ETV Bharat / state

collector anudeep: పొలంబాట పట్టిన కలెక్టర్​... కూలీలతో కలిసి వరినాట్లు - కూలీలతో కలిసి నాట్లు వేసిన భద్రాద్రి కలెక్టర్​

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్​ అనుదీప్ (bhadradri collector anudeep)​... వరిపొలంలో నాట్లు వేశారు. జిల్లాలోని కరకగూడెం మండలంలో పర్యటనకు వెళ్తూ రహదారిపక్కన వరినాట్లు వేస్తున్న కూలీలను చూసి ఆగారు. కాసేపు వారితో మాట్లాడారు. అనంతరం కూలీలతో కలిసి పొలంలో దిగి నాట్లు వేశారు.

kothagudem district collector anudeep
kothagudem district collector anudeep
author img

By

Published : Aug 19, 2021, 8:14 PM IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలంలో జిల్లా పాలనాధికారి అనుదీప్​ పర్యటించారు. ఈ సందర్భంగా మండల కేంద్రానికి వెళ్లే రహదారి పక్కన ఉన్న పొలం వద్ద ఆగి... కూలీలతో కలిసి వరినాట్లు వేశారు. కూలీలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వర్షాకాలం నేపథ్యంలో ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

ఇంటింటికీ కాలినడకన

అనంతరం మండలంలోని భట్టుపల్లి గ్రామాన్ని సందర్శించారు. గ్రామంలో కాలినడకన పర్యటించి ప్రతి ఇంటినీ పరిశీలించారు. గృహ సముదాయాల మధ్య నీరు నిల్వ ఉండడంపై అసహనం వ్యక్తం చేశారు. వర్షాకాలంలో అంటువ్యాధులు ప్రభలే అవకాశం ఉందని... గ్రామ సర్పంచి, కార్యదర్శి ప్రతి ఇంటికీ వెళ్లి వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పించాలని ఆదేశించారు.

విధులపట్ల బాధ్యతగా ఉండాలి

అనంతరం తహసీల్దారు కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. తహసీల్దారు విధులకు గైర్హాజరు కావడం పట్ల అసహనం వ్యక్తం చేశారు. ప్రతి అధికారి విధులపట్ల బాధ్యతగా ఉండాలని ఆదేశించారు. మండల స్థాయిలో అధికారులు విధులను బాధ్యతగా నిర్వర్తిస్తే... ప్రజలు జిల్లా కేంద్రానికి రావాల్సిన అవసరం ఉండదని పేర్కొన్నారు.

పొలంబాటపట్టిన కలెక్టర్​... కూలీలతో కలిసి వరినాట్లు

ఇదీ చూడండి: వరలక్ష్మి వ్రతం: కిటకిటలాడుతున్న పూల మార్కెట్లు.. ఆకాశాన్నంటుతున్న ధరలు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలంలో జిల్లా పాలనాధికారి అనుదీప్​ పర్యటించారు. ఈ సందర్భంగా మండల కేంద్రానికి వెళ్లే రహదారి పక్కన ఉన్న పొలం వద్ద ఆగి... కూలీలతో కలిసి వరినాట్లు వేశారు. కూలీలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వర్షాకాలం నేపథ్యంలో ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

ఇంటింటికీ కాలినడకన

అనంతరం మండలంలోని భట్టుపల్లి గ్రామాన్ని సందర్శించారు. గ్రామంలో కాలినడకన పర్యటించి ప్రతి ఇంటినీ పరిశీలించారు. గృహ సముదాయాల మధ్య నీరు నిల్వ ఉండడంపై అసహనం వ్యక్తం చేశారు. వర్షాకాలంలో అంటువ్యాధులు ప్రభలే అవకాశం ఉందని... గ్రామ సర్పంచి, కార్యదర్శి ప్రతి ఇంటికీ వెళ్లి వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పించాలని ఆదేశించారు.

విధులపట్ల బాధ్యతగా ఉండాలి

అనంతరం తహసీల్దారు కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. తహసీల్దారు విధులకు గైర్హాజరు కావడం పట్ల అసహనం వ్యక్తం చేశారు. ప్రతి అధికారి విధులపట్ల బాధ్యతగా ఉండాలని ఆదేశించారు. మండల స్థాయిలో అధికారులు విధులను బాధ్యతగా నిర్వర్తిస్తే... ప్రజలు జిల్లా కేంద్రానికి రావాల్సిన అవసరం ఉండదని పేర్కొన్నారు.

పొలంబాటపట్టిన కలెక్టర్​... కూలీలతో కలిసి వరినాట్లు

ఇదీ చూడండి: వరలక్ష్మి వ్రతం: కిటకిటలాడుతున్న పూల మార్కెట్లు.. ఆకాశాన్నంటుతున్న ధరలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.