ETV Bharat / state

భద్రాద్రి రామయ్యకు సహస్ర కలశాభిషేకం - భద్రాచలం వార్తలు

భద్రాద్రి రామయ్య సన్నిధిలో మాఘ పౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి. వేడుకల్లో భాగంగా సీతారామలక్ష్మణులకు సహస్ర కలశాభిషేకం నిర్వహించారు.

bhadrachalam
భద్రాచలం
author img

By

Published : Feb 27, 2021, 10:48 AM IST

భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో మాఘ పౌర్ణమి వేడుకలు వైభవంగా నిర్వహించారు. లక్ష్మణ సమేత సీతారాములకు 1001 కలశాలతో అభిషేకం నిర్వహించారు. సమస్త నదీజలాలు, సముద్ర జలాలు, పళ్లరసాలు, పంచోదకములు, పాలు, తేనె, నెయ్యి, సుగంధద్రవ్యాలతో అభిషేకం చేశారు. అనంతరం మహా కుంభ సంప్రోక్షణ నిర్వహించారు.

bhadrachalam
1001 కలశాలు

ఈ రోజు మధ్యాహ్నం మహా పూర్ణాహుతి అనంతరం స్వామి వారికి ప్రధాన ఆలయంలో మహా నివేదన నిర్వహించనున్నారు. మాఘ పౌర్ణమి సందర్భంగా భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చి వేడుకలో పాల్గొన్నారు.

ఇదీ చదవండి: 12వ శతాబ్దపు కట్టడం.. చారిత్రక నిర్లక్ష్యం

భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో మాఘ పౌర్ణమి వేడుకలు వైభవంగా నిర్వహించారు. లక్ష్మణ సమేత సీతారాములకు 1001 కలశాలతో అభిషేకం నిర్వహించారు. సమస్త నదీజలాలు, సముద్ర జలాలు, పళ్లరసాలు, పంచోదకములు, పాలు, తేనె, నెయ్యి, సుగంధద్రవ్యాలతో అభిషేకం చేశారు. అనంతరం మహా కుంభ సంప్రోక్షణ నిర్వహించారు.

bhadrachalam
1001 కలశాలు

ఈ రోజు మధ్యాహ్నం మహా పూర్ణాహుతి అనంతరం స్వామి వారికి ప్రధాన ఆలయంలో మహా నివేదన నిర్వహించనున్నారు. మాఘ పౌర్ణమి సందర్భంగా భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చి వేడుకలో పాల్గొన్నారు.

ఇదీ చదవండి: 12వ శతాబ్దపు కట్టడం.. చారిత్రక నిర్లక్ష్యం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.