భావితరాలకు మేలు జరగాలంటే నీటి సంరక్షణ సామాజిక బాధ్యతగా భావించాలని కేంద్రమంత్రిత్వశాఖ సంయుక్త కార్యదర్శి సంజయ్ జజు పేర్కొన్నారు. జలశక్తి అభియాన్ కార్యక్రమం అమలులో భాగంగా ఆదిలాబాద్లోని జడ్పీ హాలులో ఏర్పాటు చేసిన సమావేశానికి సంజయ్ హాజరయ్యారు. జిల్లా పాలనాధికారి దివ్య దేవరాజన్, జిల్లాలోని సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు సమావేశంలో పాల్గొన్నారు. ప్రతి ఇంటికి ఇంకుడు గుంతలు నిర్మించాలని సంజయ్ సూచించారు.
ఇవీ చూడండి: లెక్క తేల్చాలంటున్న అటవీ శాఖ!