కొవిడ్ బారిన పడ్డ పోలీసులకు ఆహ్లాదకర వాతావరణం కల్పించేందుకు.. ఆదిలాబాద్ జిల్లా బోథ్ పోలీసులు వినూత్న ప్రయత్నం చేశారు. బాధితులను ఒత్తిడికి గురికాకుండా చేసేందుకు.. వారి కోసం ఓ ప్రత్యేక పార్క్ను నిర్మించారు. జిల్లా ఇంఛార్జ్ యస్. పి. రాజేశ్ చంద్ర ఈ ఉద్యానవనాన్ని ప్రారంభించారు.
మహమ్మారి బారిన పడ్డ పోలీసులు.. వ్యాయామం చేసుకునేందుకు వీలుగా పార్క్లో అన్ని వసతులు ఉన్నాయని రాజేశ్ చంద్ర వివరించారు. పార్క్ ఏర్పాటులో బోథ్ పోలీసుల కృషిని ఆయన అభినందించారు. కరోనా తగ్గుముఖం పట్టిన అనంతరం.. పార్క్ లోనికి పిల్లలతో పాటు అందరినీ అనుమతించనున్నట్లు డీఎస్పీ వెంకటేశ్వర్లు తెలిపారు.
ఇదీ చదవండి: 'కరోనా సోకితే ఈ జాగ్రత్తలు తీసుకోవాలి'