ఆదిలాబాద్ పట్టణంలోని ఐటీఐ కళాశాలలో ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈటీవీ భారత్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో విద్యార్థులు పాల్గొన్నారు. తొలుత ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గిస్తామని ప్రతిజ్ఞ చేశారు. అనంతరం ప్లాస్టిక్ వ్యర్థాల వల్ల కలిగే అనర్థాలను వివరిస్తూ ప్లాస్టిక్ను ఉపయోగించబోమని నినదించారు. ప్లాస్టిక్ నిషేధాన్ని ఇంటి నుంచే ప్రారంభిస్తామని, చుట్టుపక్కల వారికి ఈ మేరకు అవగాహన కల్పిస్తామని ప్రతినబూనారు.
ఇవీ చూడండి : మూడోరోజు చర్చలు... ప్రయాణికుల్లో ఉత్కంఠ