ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రిలో పనిచేస్తున్న స్టాఫ్ నర్సులు తమ ఆందోళనను ఉద్ధృతం చేశారు. బకాయిపడ్డ ఆరు నెలల వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ ఎదుట మంగళవారం ధర్నా నిర్వహించారు.
బుధవారం విధులను బహిష్కరించి ఆసుపత్రి ఎదుట నిరసన తెలిపారు. పెండింగ్లో ఉన్న జీతాలతో పాటు కొవిడ్ సమయంలో విధులు నిర్వహిస్తోన్న తమకు ప్రత్యేక నగదు ప్రోత్సాహకాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. వేతన చెల్లింపులో రిమ్స్ డైరెక్టర్ నిర్లక్ష్య వైఖరిని ఖండిస్తూ వారికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఇదీ చదవండి: తరాలు మారిన తీరని సమస్యలు.. అమలుకు నోచుకోని హామీలు