ETV Bharat / state

ఆదివాసీల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి చేస్తోంది: జోగు రామన్న

author img

By

Published : Oct 31, 2020, 7:38 PM IST

ఆదిలాబాద్​ పట్టణ పరిధిలోని కుమురం భీం కాలనీలో తుడుందెబ్బ ఆధ్వర్యంలో ఆదివాసీల సభ నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే జోగు రామన్న ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

MLA Jogu Ramanna participating in the Tribal Meeting
ఆదివాసీల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి చేస్తోంది: జోగు రామన్న

ఆదివాసీల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో పని చేస్తున్నట్లు ఆదిలాబాద్‌ ఎమ్మెల్యే జోగు రామన్న పేర్కొన్నారు. ఆదిలాబాద్‌ పట్టణ పరిధిలోని కుమురం భీం కాలనీలో తుడుందెబ్బ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆదివాసీల సభలో మాజీ ఎంపీ గోడం నగేష్​తో కలిసి ఆయన పాల్గొన్నారు.

కరోనా వైరస్ ప్రబలకుండా ఉండి ఉంటే.. అర్హులైన ఆదివాసీలకు ఇప్పటికే అటవీ హక్కులు అంది ఉండేవని నేతలు పేర్కొన్నారు. త్వరలోనే ఈ సమస్య పరిష్కారమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అంతకు ముందు భీం విగ్రహానికి ఆదివాసీ సంప్రదాయరీతిలో నివాళులర్పించారు.

ఇదీ చూడండి.. కొడుకును సీఎం చేయడానికే ప్రచారం చేయట్లేదు: బండి సంజయ్‌

ఆదివాసీల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో పని చేస్తున్నట్లు ఆదిలాబాద్‌ ఎమ్మెల్యే జోగు రామన్న పేర్కొన్నారు. ఆదిలాబాద్‌ పట్టణ పరిధిలోని కుమురం భీం కాలనీలో తుడుందెబ్బ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆదివాసీల సభలో మాజీ ఎంపీ గోడం నగేష్​తో కలిసి ఆయన పాల్గొన్నారు.

కరోనా వైరస్ ప్రబలకుండా ఉండి ఉంటే.. అర్హులైన ఆదివాసీలకు ఇప్పటికే అటవీ హక్కులు అంది ఉండేవని నేతలు పేర్కొన్నారు. త్వరలోనే ఈ సమస్య పరిష్కారమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అంతకు ముందు భీం విగ్రహానికి ఆదివాసీ సంప్రదాయరీతిలో నివాళులర్పించారు.

ఇదీ చూడండి.. కొడుకును సీఎం చేయడానికే ప్రచారం చేయట్లేదు: బండి సంజయ్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.