ETV Bharat / state

కరోనా వేళ సఫాయి కార్మికుల సేవలు అమూల్యం: జోగు రామన్న - తెలంగాణ వార్తలు

కరోనా విపత్కర కాలంలో సఫాయి కార్మికుల సేవలు అమూల్యమైనవని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. పారిశుద్ధ్య కార్మికులను ఆయన క్యాంపు కార్యాలయానికి పిలిచి సన్మానించారు. ఏ కష్టం వచ్చినా అండగా ఉంటామని భరోసానిచ్చారు.

mla jogu ramanna felicitated sanitary workers , mla jogu ramanna latest news
పారిశుద్ధ్య కార్మికులకు జోగు రామన్న సన్మానం, ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న
author img

By

Published : Apr 25, 2021, 8:45 AM IST

కరోనా మృతులకు అంత్యక్రియలు చేస్తున్న సఫాయి కార్మికుల సేవలు అమూల్యమైనవని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న కొనియాడారు. పారిశుద్ధ్య కార్మికుల సేవలపై ఈటీవీ భారత్​లో కథనం ప్రచురితం కాగా... ఎమ్మెల్యే తనయులు జోగు ప్రేమిందర్, జోగు మహేందర్ స్పందించారు.

ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి కార్మికులను పిలిపించి... వారిని సన్మానించారు. నెల రోజుల పాటు అవసరమయ్యే నిత్యవసర సరకులు అందజేశారు. విపత్కర కాలంలో వారి సేవలను కొనియాడారు. ఏ కష్టం వచ్చినా అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

కరోనా మృతులకు అంత్యక్రియలు చేస్తున్న సఫాయి కార్మికుల సేవలు అమూల్యమైనవని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న కొనియాడారు. పారిశుద్ధ్య కార్మికుల సేవలపై ఈటీవీ భారత్​లో కథనం ప్రచురితం కాగా... ఎమ్మెల్యే తనయులు జోగు ప్రేమిందర్, జోగు మహేందర్ స్పందించారు.

ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి కార్మికులను పిలిపించి... వారిని సన్మానించారు. నెల రోజుల పాటు అవసరమయ్యే నిత్యవసర సరకులు అందజేశారు. విపత్కర కాలంలో వారి సేవలను కొనియాడారు. ఏ కష్టం వచ్చినా అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

ఇదీ చదవండి: టీకా పంపిణీపై కేంద్రం కొత్త మార్గదర్శకాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.