ETV Bharat / state

దమ్ముంటే అవినీతిపై విచారణ జరిపించండి: జోగు రామన్న - telangana latest news

సీఎం కేసీఆర్​ పాలనపై కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఆదిలాబాద్​ ఎమ్మెల్యే జోగురామన్న ఖండించారు. భాజపా నాయకులే అవినీతి పరులని ధ్వజమెత్తారు. అవినీతిపై విచారణ జరిపించి నిరూపించాలే తప్ప విమర్శలు చేయడం తగదని హితవు పలికారు.

mla jogu ramanna denied the comments of kishan reddy
దమ్ముంటే అవినీతిపై విచారణ జరిపించండి: జోగు రామన్న
author img

By

Published : Dec 23, 2020, 4:40 PM IST

ముఖ్యమంత్రి కేసీఆర్‌ పాలనపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి ఆదిలాబాద్‌లో చేసిన వ్యాఖ్యలను ఎమ్మెల్యే జోగురామన్న ఖండించారు. భాజపానాయకులే అవినీతిపరులని ధ్వజమెత్తారు. ఎంపీ సోయం బాపురావు, భాజపా జిల్లా అధ్యక్షుడు పాయల్‌ శంకర్‌ అవినీతి దందాపై త్వరలో వివరాలు వెల్లడిస్తానని జోగు రామన్న పేర్కొన్నారు.

కేంద్రంలో అధికారంలో ఉన్న భాజపా.. దమ్ముంటే కేసీఆర్‌ అవినీతిపై విచారణ జరిపించి నిరూపించాలే తప్ప అనవసరంగా విమర్శలు చేయవద్దని హితవు పలికారు. ఏ మాత్రం అవగాహనలేకుండా కిషన్​రెడ్డి మాట్లాడారని దుయ్యబట్టారు.

ముఖ్యమంత్రి కేసీఆర్‌ పాలనపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి ఆదిలాబాద్‌లో చేసిన వ్యాఖ్యలను ఎమ్మెల్యే జోగురామన్న ఖండించారు. భాజపానాయకులే అవినీతిపరులని ధ్వజమెత్తారు. ఎంపీ సోయం బాపురావు, భాజపా జిల్లా అధ్యక్షుడు పాయల్‌ శంకర్‌ అవినీతి దందాపై త్వరలో వివరాలు వెల్లడిస్తానని జోగు రామన్న పేర్కొన్నారు.

కేంద్రంలో అధికారంలో ఉన్న భాజపా.. దమ్ముంటే కేసీఆర్‌ అవినీతిపై విచారణ జరిపించి నిరూపించాలే తప్ప అనవసరంగా విమర్శలు చేయవద్దని హితవు పలికారు. ఏ మాత్రం అవగాహనలేకుండా కిషన్​రెడ్డి మాట్లాడారని దుయ్యబట్టారు.

ఇదీ చదవండి: అధికార పార్టీ అని భరించాం.. ఇక మా వల్ల కాదు: సర్పంచ్​లు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.