ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలంటూ ఆదిలాబాద్ బస్డిపో ఎదుట తెలంగాణ మజ్దూర్ యూనియన్ ధర్నా చేపట్టింది. ఈ సందర్భంగా డిపో ఎదుట ప్రభుత్వం, యాజమాన్య తీరుకు నిరసనగా కార్మికులు నినాదాలు చేశారు. తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన తమను విస్మరించడమేంటనీ టీఎంయూ నాయకుడు రమేష్ ప్రభుత్వంపై మండిపడ్డారు. ఆర్టీసీని విలీనం చేసే చర్యలు చేపట్టకపోతే సమ్మెకు దిగుతామని హెచ్చరించారు.
ఇవీచూడండి: 5నెలల్లో పురపాలక ఎన్నికలు పూర్తి చేయాలి