ETV Bharat / sports

డిస్కస్​ త్రో ఫైనల్లో కమల్​ప్రీత్​.. ఆర్చరీ, బాక్సింగ్​లో నిరాశ

author img

By

Published : Jul 31, 2021, 10:00 AM IST

Updated : Jul 31, 2021, 1:30 PM IST

టోక్యో ఒలింపిక్స్​లో భారత్​కు శనివారం ఉదయం నిరాశాజనక ఫలితాలు వచ్చాయి. బాక్సింగ్​లో ప్రపంచ నెం.1, భారత ఫేవరేట్​ అమిత్​ పంగాల్​కు అనూహ్య ఓటమి ఎదురై.. నిష్క్రమించాడు. ఆర్చరీలో అతాను దాస్​కు నిరాశే ఎదురైంది. మహిళల డిస్కస్ త్రోలో.. కమల్​ప్రీత్​ కౌర్​ ఫైనల్​కు చేరడమే భారత్​కు సానుకూలాంశం.

Tokyo Olympics
ఒలింపిక్స్​ ఇండియా

ఒలింపిక్స్​లో శనివారం భారత్​కు ఊహించని షాక్​ తగిలింది. బాక్సింగ్​ పురుషుల 52 కిలోల విభాగంలో.. ప్రపంచ నెం.1, టాప్​ సీడ్​ అమిత్​ పంగాల్​ అనూహ్య ఓటమితో విశ్వక్రీడల నుంచి నిష్క్రమించాడు. రియో ఒలింపిక్స్​ రజత పతక విజేత, కొలంబియా బాక్సర్​ యుబెర్జెన్​ మార్టినెజ్​ చేతిలో ప్రీక్వార్టర్​ ఫైనల్లో 4-1తేడాతో ఓడిపోయాడు.

Tokyo Olympics
యుబెర్జెన్​ మార్టినెజ్​ను విజేతగా ప్రకటిస్తున్న రిఫరీ

పంగాల్​ను ప్రత్యర్థి ఉక్కిరిబిక్కిరి చేశాడు. పదే పదే పంచ్​లు కురిపిస్తూ.. రింగ్​ అంతా పరుగులు పెట్టించాడు. కొలంబియా బాక్సర్​ దూకుడు ముందు.. భారత ఫేవరేట్​ తేలిపోయాడు.

Tokyo Olympics
కొలంబియా బాక్సర్​ దూకుడు ముందు తేలిపోయిన ప్రపంచ నెం.1 అమిత్​ పంగాల్​

ఇటీవల భారత్​ నుంచి అత్యుత్తమ ప్రదర్శన చేసిన బాక్సర్లలో పంగాల్​ ముందున్నాడు. 2018 ఆసియా క్రీడల్లో స్వర్ణం, 2019 ప్రపంచ ఛాంపియన్​ షిప్​లో రజతం సాధించాడు. కానీ.. తాను బరిలోకి దిగిన తొలి ఒలింపిక్స్​లో మాత్రం పతకం లేకుండానే వైదొలిగాడు.

Tokyo Olympics
కొలంబియా బాక్సర్​పై అమిత్​ పంచ్​లు

అయితే.. బాక్సింగ్​లో ఇప్పటికే భారత్​కు ఓ పతకం ఖాయమైంది. మహిళల 69 కిలోల విభాగంలో లవ్లీనా బోర్గోహైన్​ సెమీఫైనల్లోకి ప్రవేశించింది. అందులో ఓడినా.. కాంస్యం దక్కుతుంది.

మరోవైపు.. మహిళల 75 కిలోల విభాగంలో పూజారాణి శనివారం, క్వార్టర్​ ఫైనల్​​ ఆడనుంది. అందులో గెలిస్తే ఈమెకూ పతకం ఖాయమవుతుంది.

పురుషుల 91 కేజీల ప్లస్​ విభాగంలో సతీశ్​ కుమార్​ కూడా క్వార్టర్​ ఫైనల్​లోకి​ ప్రవేశించాడు.

ఇదీ చూడండి: కండోమ్‌ సాయంతో ఒలింపిక్స్‌లో స్వర్ణం

పోరాడి ఓడిన అతాను..

ఆర్చరీలో భారత్​ కథ ముగిసింది. పతకం తెస్తాడని ఆశలు పెట్టుకున్న అతాన్​ దాస్​.. ప్రీక్వార్టర్​ ఫైనల్లో పోరాడి ఓడాడు. పురుషుల వ్యక్తిగత విభాగంలో జపాన్​ ఆర్చర్​ టకహరు ఫురుకవా చేతిలో 6-4 తేడాతో ఓటమి పాలై ఒలింపిక్స్​ నుంచి నిష్క్రమించాడు.

Tokyo Olympics
అతాను దాస్​

ఐదు సెట్ల పోరు హోరాహోరీగా సాగింది. తొలి సెట్​ను జపాన్​ ఆర్చర్​ గెల్చుకొని 2 పాయింట్లు సాధించగా.. రెండో సెట్​ టై అయింది. దీంతో స్కోరు 3-1గా ఉంది. తర్వాతి సెట్​ను కైవసం చేసుకొని స్కోరు 3-3తో సమం చేశాడు అతాను. నాలుగో సెట్​ మళ్లీ టై అయింది. 4-4తో స్కోరు సమం అయింది. కీలకమైన చివరి సెట్​లో అతాను దాస్​ 9,8,9 స్కోరు చేయగా.. స్థానిక ప్లేయర్​ 9,10, 8 చేసి ఒక్క పాయింట్​ తేడాతో మ్యాచ్​ గెల్చుకున్నాడు. క్వార్టర్​ ఫైనల్లోకి ప్రవేశించాడు.

Tokyo Olympics
ప్రీక్వార్టర్స్​లో ఓటమి పాలైన అతాను దాస్​ ఓటమి

ఇప్పటికే ఆర్చరీలో మిక్స్​డ్​ టీం విభాగం(దీపికా కుమారి, ప్రవీణ్​ జాదవ్​), మహిళల వ్యక్తిగత విభాగం(దీపికా కుమారి), పురుషుల వ్యక్తిగత విభాగంలో(తరుణ్​దీప్​ రాయ్​, ప్రవీణ్​ జాదవ్​) ఓటమి పాలయ్యారు. చివరిగా ఆశలు రేపిన అతాను కూడా ఇప్పుడు ఓటమి చెంది ఆర్చరీలో రిక్తహస్తాలతో వైదొలగాల్సి వచ్చింది.

డిస్కస్​ త్రో లో అదుర్స్​..

మహిళల డిస్కస్​ త్రో లో కమల్​ప్రీత్​ కౌర్​ సంచలనం సృష్టించింది. క్వాలిఫికేషన్​ రౌండ్​ గ్రూప్​ బీ లో పోటీపడిన ఆమె.. డిస్క్​ను 64 మీటర్ల దూరం విసిరి ఫైనల్​కు అర్హత సాధించింది. గ్రూప్​-బీలో రెండో స్థానం, ఓవరాల్​గానూ రెండో స్థానంలోనే నిలిచింది.

Tokyo Olympics
మహిళల డిస్కస్​ త్రో ఈవెంట్​లో ఫైనల్​కు చేరిన కమల్​ప్రీత్​ కౌర్​

డిస్క్​ను విసిరేందుకు 3 ప్రయత్నాలు చేయొచ్చు. కౌర్​ వరుసగా 60.29, 63.97, 64 మీటర్ల దూరం విసిరింది.

Tokyo Olympics
డిస్క్​ను 64 మీ. దూరం విసిరిన కమల్​ప్రీత్​ కౌర్​

డిఫెండింగ్​ ఛాంపియన్(రియో గోల్డ్​ మెడలిస్ట్​)​ క్రొయేషియా అథ్లెట్​ సండ్ర పెర్కోవిక్​(63.75 మీ.) కంటే కౌర్​.. ఎక్కువ దూరం డిస్క్​ను విసరడం విశేషం. ప్రస్తుత ప్రపంచ ఛాంపియన్​ యామీ పెరెజ్​(63.18 మీ.) కూడా కమల్​ప్రీత్​ వెనుకే నిలిచింది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఈ పంజాబ్​ డిస్కస్​ త్రో అథ్లెట్​.. ఇటీవల మంచి ప్రదర్శనలు చేసి ఒలింపిక్స్​కు అర్హత సాధించింది. రెండు సార్లు 65 మీ. కంటే దూరం డిస్క్​ను విసిరింది. మార్చిలో జరిగిన ఫెడరేషన్​ కప్​లో 65.06 మీ. దూరం విసరడం జాతీయ రికార్డుగా ఉంది. ఓ భారత అథ్లెట్​ అంత దూరం డిస్క్​ను విసరడం కూడా అదే తొలిసారి.

సీమా పునియా ఔట్​..

గ్రూప్​ ఏలో 15 మంది, గ్రూప్​ బీలో 16 మంది అర్హత పోటీల్లో పాల్గొన్నారు. గ్రూప్​ ఏలో 60.57 మీటర్ల దూరం డిస్క్​ను విసిరిన మరో భారత దిగ్గజ త్రోయర్​ సీమా పునియా ఆరో స్థానంలో నిలిచింది. మొత్తంగా 16వ స్థానంలో నిలిచి.. ఫైనల్​కు అర్హత సాధించలేకపోయింది.

Tokyo Olympics
డిస్కస్​ త్రో క్వాలిఫికేషన్​లో విఫలమైన సీమా పునియా

రెండు గ్రూపుల్లో కలిపి 64 మీ. దూరం లేదా టాప్​-12 అథ్లెట్లు ఫైనల్​కు అర్హత సాధిస్తారు.

ఇవీ చూడండి:

Tokyo Olympics: కీలక సెమీస్​లో సింధు గట్టెక్కేనా?

Olympics: అమ్మాయిలు.. మీ ఆట బంగారం కానూ!

ఒలింపిక్స్​లో శనివారం భారత్​కు ఊహించని షాక్​ తగిలింది. బాక్సింగ్​ పురుషుల 52 కిలోల విభాగంలో.. ప్రపంచ నెం.1, టాప్​ సీడ్​ అమిత్​ పంగాల్​ అనూహ్య ఓటమితో విశ్వక్రీడల నుంచి నిష్క్రమించాడు. రియో ఒలింపిక్స్​ రజత పతక విజేత, కొలంబియా బాక్సర్​ యుబెర్జెన్​ మార్టినెజ్​ చేతిలో ప్రీక్వార్టర్​ ఫైనల్లో 4-1తేడాతో ఓడిపోయాడు.

Tokyo Olympics
యుబెర్జెన్​ మార్టినెజ్​ను విజేతగా ప్రకటిస్తున్న రిఫరీ

పంగాల్​ను ప్రత్యర్థి ఉక్కిరిబిక్కిరి చేశాడు. పదే పదే పంచ్​లు కురిపిస్తూ.. రింగ్​ అంతా పరుగులు పెట్టించాడు. కొలంబియా బాక్సర్​ దూకుడు ముందు.. భారత ఫేవరేట్​ తేలిపోయాడు.

Tokyo Olympics
కొలంబియా బాక్సర్​ దూకుడు ముందు తేలిపోయిన ప్రపంచ నెం.1 అమిత్​ పంగాల్​

ఇటీవల భారత్​ నుంచి అత్యుత్తమ ప్రదర్శన చేసిన బాక్సర్లలో పంగాల్​ ముందున్నాడు. 2018 ఆసియా క్రీడల్లో స్వర్ణం, 2019 ప్రపంచ ఛాంపియన్​ షిప్​లో రజతం సాధించాడు. కానీ.. తాను బరిలోకి దిగిన తొలి ఒలింపిక్స్​లో మాత్రం పతకం లేకుండానే వైదొలిగాడు.

Tokyo Olympics
కొలంబియా బాక్సర్​పై అమిత్​ పంచ్​లు

అయితే.. బాక్సింగ్​లో ఇప్పటికే భారత్​కు ఓ పతకం ఖాయమైంది. మహిళల 69 కిలోల విభాగంలో లవ్లీనా బోర్గోహైన్​ సెమీఫైనల్లోకి ప్రవేశించింది. అందులో ఓడినా.. కాంస్యం దక్కుతుంది.

మరోవైపు.. మహిళల 75 కిలోల విభాగంలో పూజారాణి శనివారం, క్వార్టర్​ ఫైనల్​​ ఆడనుంది. అందులో గెలిస్తే ఈమెకూ పతకం ఖాయమవుతుంది.

పురుషుల 91 కేజీల ప్లస్​ విభాగంలో సతీశ్​ కుమార్​ కూడా క్వార్టర్​ ఫైనల్​లోకి​ ప్రవేశించాడు.

ఇదీ చూడండి: కండోమ్‌ సాయంతో ఒలింపిక్స్‌లో స్వర్ణం

పోరాడి ఓడిన అతాను..

ఆర్చరీలో భారత్​ కథ ముగిసింది. పతకం తెస్తాడని ఆశలు పెట్టుకున్న అతాన్​ దాస్​.. ప్రీక్వార్టర్​ ఫైనల్లో పోరాడి ఓడాడు. పురుషుల వ్యక్తిగత విభాగంలో జపాన్​ ఆర్చర్​ టకహరు ఫురుకవా చేతిలో 6-4 తేడాతో ఓటమి పాలై ఒలింపిక్స్​ నుంచి నిష్క్రమించాడు.

Tokyo Olympics
అతాను దాస్​

ఐదు సెట్ల పోరు హోరాహోరీగా సాగింది. తొలి సెట్​ను జపాన్​ ఆర్చర్​ గెల్చుకొని 2 పాయింట్లు సాధించగా.. రెండో సెట్​ టై అయింది. దీంతో స్కోరు 3-1గా ఉంది. తర్వాతి సెట్​ను కైవసం చేసుకొని స్కోరు 3-3తో సమం చేశాడు అతాను. నాలుగో సెట్​ మళ్లీ టై అయింది. 4-4తో స్కోరు సమం అయింది. కీలకమైన చివరి సెట్​లో అతాను దాస్​ 9,8,9 స్కోరు చేయగా.. స్థానిక ప్లేయర్​ 9,10, 8 చేసి ఒక్క పాయింట్​ తేడాతో మ్యాచ్​ గెల్చుకున్నాడు. క్వార్టర్​ ఫైనల్లోకి ప్రవేశించాడు.

Tokyo Olympics
ప్రీక్వార్టర్స్​లో ఓటమి పాలైన అతాను దాస్​ ఓటమి

ఇప్పటికే ఆర్చరీలో మిక్స్​డ్​ టీం విభాగం(దీపికా కుమారి, ప్రవీణ్​ జాదవ్​), మహిళల వ్యక్తిగత విభాగం(దీపికా కుమారి), పురుషుల వ్యక్తిగత విభాగంలో(తరుణ్​దీప్​ రాయ్​, ప్రవీణ్​ జాదవ్​) ఓటమి పాలయ్యారు. చివరిగా ఆశలు రేపిన అతాను కూడా ఇప్పుడు ఓటమి చెంది ఆర్చరీలో రిక్తహస్తాలతో వైదొలగాల్సి వచ్చింది.

డిస్కస్​ త్రో లో అదుర్స్​..

మహిళల డిస్కస్​ త్రో లో కమల్​ప్రీత్​ కౌర్​ సంచలనం సృష్టించింది. క్వాలిఫికేషన్​ రౌండ్​ గ్రూప్​ బీ లో పోటీపడిన ఆమె.. డిస్క్​ను 64 మీటర్ల దూరం విసిరి ఫైనల్​కు అర్హత సాధించింది. గ్రూప్​-బీలో రెండో స్థానం, ఓవరాల్​గానూ రెండో స్థానంలోనే నిలిచింది.

Tokyo Olympics
మహిళల డిస్కస్​ త్రో ఈవెంట్​లో ఫైనల్​కు చేరిన కమల్​ప్రీత్​ కౌర్​

డిస్క్​ను విసిరేందుకు 3 ప్రయత్నాలు చేయొచ్చు. కౌర్​ వరుసగా 60.29, 63.97, 64 మీటర్ల దూరం విసిరింది.

Tokyo Olympics
డిస్క్​ను 64 మీ. దూరం విసిరిన కమల్​ప్రీత్​ కౌర్​

డిఫెండింగ్​ ఛాంపియన్(రియో గోల్డ్​ మెడలిస్ట్​)​ క్రొయేషియా అథ్లెట్​ సండ్ర పెర్కోవిక్​(63.75 మీ.) కంటే కౌర్​.. ఎక్కువ దూరం డిస్క్​ను విసరడం విశేషం. ప్రస్తుత ప్రపంచ ఛాంపియన్​ యామీ పెరెజ్​(63.18 మీ.) కూడా కమల్​ప్రీత్​ వెనుకే నిలిచింది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఈ పంజాబ్​ డిస్కస్​ త్రో అథ్లెట్​.. ఇటీవల మంచి ప్రదర్శనలు చేసి ఒలింపిక్స్​కు అర్హత సాధించింది. రెండు సార్లు 65 మీ. కంటే దూరం డిస్క్​ను విసిరింది. మార్చిలో జరిగిన ఫెడరేషన్​ కప్​లో 65.06 మీ. దూరం విసరడం జాతీయ రికార్డుగా ఉంది. ఓ భారత అథ్లెట్​ అంత దూరం డిస్క్​ను విసరడం కూడా అదే తొలిసారి.

సీమా పునియా ఔట్​..

గ్రూప్​ ఏలో 15 మంది, గ్రూప్​ బీలో 16 మంది అర్హత పోటీల్లో పాల్గొన్నారు. గ్రూప్​ ఏలో 60.57 మీటర్ల దూరం డిస్క్​ను విసిరిన మరో భారత దిగ్గజ త్రోయర్​ సీమా పునియా ఆరో స్థానంలో నిలిచింది. మొత్తంగా 16వ స్థానంలో నిలిచి.. ఫైనల్​కు అర్హత సాధించలేకపోయింది.

Tokyo Olympics
డిస్కస్​ త్రో క్వాలిఫికేషన్​లో విఫలమైన సీమా పునియా

రెండు గ్రూపుల్లో కలిపి 64 మీ. దూరం లేదా టాప్​-12 అథ్లెట్లు ఫైనల్​కు అర్హత సాధిస్తారు.

ఇవీ చూడండి:

Tokyo Olympics: కీలక సెమీస్​లో సింధు గట్టెక్కేనా?

Olympics: అమ్మాయిలు.. మీ ఆట బంగారం కానూ!

Last Updated : Jul 31, 2021, 1:30 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.