ETV Bharat / sports

గుడ్​న్యూస్​.. ఒలింపిక్స్​లో క్రికెట్​కు అంతా సిద్ధం!

author img

By

Published : Aug 10, 2021, 2:10 PM IST

ఒలింపిక్స్​లో(Olympics) క్రికెట్​ను చేర్చే అవకాశాలున్న నేపథ్యంలో అంతర్జాతీయ క్రికెట్​ మండలి(ICC) స్పందించింది. విశ్వక్రీడల్లో క్రికెట్​ను ​చేర్చేందుకు సన్నాహాలు జరుపుతున్నామని ఐసీసీ అధ్యక్షుడు గ్రెగ్​ బార్క్​లే వెల్లడించారు. 2028లో అమెరికాలోని లాస్​ఏంజెలెస్​​(Los Angeles Olympics 2028) వేదికగా జరగనున్న విశ్వక్రీడల్లో క్రికెట్​కు అవకాశం కల్పించే విధంగా కృషి చేస్తామని ఆయన తెలిపారు.

ICC to push for cricket's inclusion in Olympics, Los Angeles 2028 'primary target'
క్రికెట్​ ఫ్యాన్స్​కు గుడ్​న్యూస్​.. ఆ​ ఒలింపిక్స్​లో జెంటిల్​మ్యాన్​ గేమ్​!

ఒలింపిక్స్​లో(Olympics) అన్ని క్రీడలు కనిపిస్తాయి. కానీ, క్రికెట్​కు మాత్రం చోటు లేదు. దీంతో జెంటిల్మెన్​ గేమ్​ను కూడా విశ్వక్రీడల్లో చేర్చాలనేది అభిమానుల నుంచి కొంతకాలంగా వినిపిస్తున్న డిమాండ్. 2028 లాస్​ ఏంజెలెస్​​ ఒలింపిక్స్​లో (Los Angeles Olympics 2028) ఇది సాధ్యం కావొచ్చు. ఇదే విషయమై అంతర్జాతీయ క్రికెట్​ మండలి(ICC) అధ్యక్షుడు గ్రెగ్ బార్క్​లే(Greg Barclay) స్పందించారు. 2028 ఒలింపిక్స్​లో క్రికెట్​నూ భాగం చేసేందుకు క్రికెట్​ తరఫున బిడ్​ వేసేందుకు ఐసీసీ సన్నాహాలు జరుపుతోందని వెల్లడించారు.

"ప్రపంచవ్యాప్తంగా ఏర్పడిన క్లిష్ట పరిస్థితుల్లోనూ ఒలింపిక్స్​ను సజావుగా నిర్వహించిన అంతర్జాతీయ ఒలింపిక్​ కమిటీతో పాటు జపాన్​ ప్రభుత్వ యంత్రాంగానికి అభినందనలు. విశ్వక్రీడలు చాలా అద్భుతంగా జరిగాయి. భవిష్యత్​లోనైనా క్రికెట్​ను ఒలింపిక్స్​లో చూడాలని మేము భావిస్తున్నాం. మా క్రీడకు ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల మందికి పైగా అభిమానులున్నారు. దాదాపు 90 శాతం మంది క్రికెట్​ను ఒలింపిక్స్​లో చూడాలని భావిస్తున్నారు. అదే విధంగా క్రికెట్​కు భవిష్యత్​లో మరింత క్రేజ్​ తెచ్చేందుకు మా క్రీడను ఒలింపిక్స్​లో ప్రవేశపెట్టాలని నిర్ణయించాం. ఒలింపిక్స్​కు క్రికెట్​ కొత్త అలంకరణగా మేము భావిస్తున్నాం. అయితే మా క్రీడను అందులో చేర్చడం అంత సులభమైనది కాదని మాకు తెలుసు. క్రికెట్​ను విశ్వక్రీడల్లో చేర్చేందుకు ఇదే సరైన సమయమని మేము ఆశిస్తున్నాం".

- గ్రెగ్​ బార్క్​లే, ఐసీసీ అధ్యక్షుడు

అమెరికాలో 3 కోట్ల మందికి పైగా క్రికెట్​ అభిమానులున్నారు. అందుకే 2028లో లాస్​ఏంజెలెస్​​ వేదికగా జరగనున్న ఒలింపిక్స్​లో ఈ క్రీడను చేర్చేందుకు సరైన సమయమని ఐసీసీ వర్గాలు భావిస్తున్నాయి.

మొదటిసారి ఆడింది అక్కడే

1900 పారిస్ ఒలింపిక్స్​లో తొలిసారిగా క్రికెట్​కు​ అవకాశమిచ్చారు. ఇందులో ఫ్రాన్స్​, గ్రేట్​ బ్రిటన్​ జట్లు మాత్రమే పాల్గొన్నాయి. రెండ్రోజుల పాటు సాగిన ఈ మ్యాచ్​లో గ్రేట్​ బ్రిటన్​ 158 పరుగుల తేడాతో గెలుపొంది స్వర్ణ పతకం అందుకుంది. ఓడిపోయిన ఫ్రాన్స్​ టీమ్​కు రజతం దక్కింది. రెండే టీమ్​లు పాల్గొనడం వల్ల కాంస్య పతకానికి అవకాశం లేకుండా పోయింది. మళ్లీ 128 ఏళ్ల తర్వాత 2028లో ఆ క్రీడను ఒలింపిక్స్​లో చేర్చేందుకు ఐసీసీ సన్నాహాలు మొదలెట్టింది.

బీసీసీఐ సుముఖత

2028 లాస్​ ఏంజెలెస్​​ ఒలింపిక్స్​లో క్రికెట్​ చోటు కల్పించడంపై భారత క్రికెట్​ నియంత్రణ మండలి(BCCI) కార్యదర్శి జై షా స్పందించారు. అదే జరిగితే ఆ మెగా ఈవెంట్​లో భారత్​ పాల్గొంటుందని ఆయన స్పష్టం చేశారు.

ఇదీ చూడండి.. ఒలింపిక్స్​లోకి క్రికెట్​ ఎంట్రీ అప్పుడే.. భారత్​ వెళ్తుందా?

ఒలింపిక్స్​లో(Olympics) అన్ని క్రీడలు కనిపిస్తాయి. కానీ, క్రికెట్​కు మాత్రం చోటు లేదు. దీంతో జెంటిల్మెన్​ గేమ్​ను కూడా విశ్వక్రీడల్లో చేర్చాలనేది అభిమానుల నుంచి కొంతకాలంగా వినిపిస్తున్న డిమాండ్. 2028 లాస్​ ఏంజెలెస్​​ ఒలింపిక్స్​లో (Los Angeles Olympics 2028) ఇది సాధ్యం కావొచ్చు. ఇదే విషయమై అంతర్జాతీయ క్రికెట్​ మండలి(ICC) అధ్యక్షుడు గ్రెగ్ బార్క్​లే(Greg Barclay) స్పందించారు. 2028 ఒలింపిక్స్​లో క్రికెట్​నూ భాగం చేసేందుకు క్రికెట్​ తరఫున బిడ్​ వేసేందుకు ఐసీసీ సన్నాహాలు జరుపుతోందని వెల్లడించారు.

"ప్రపంచవ్యాప్తంగా ఏర్పడిన క్లిష్ట పరిస్థితుల్లోనూ ఒలింపిక్స్​ను సజావుగా నిర్వహించిన అంతర్జాతీయ ఒలింపిక్​ కమిటీతో పాటు జపాన్​ ప్రభుత్వ యంత్రాంగానికి అభినందనలు. విశ్వక్రీడలు చాలా అద్భుతంగా జరిగాయి. భవిష్యత్​లోనైనా క్రికెట్​ను ఒలింపిక్స్​లో చూడాలని మేము భావిస్తున్నాం. మా క్రీడకు ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల మందికి పైగా అభిమానులున్నారు. దాదాపు 90 శాతం మంది క్రికెట్​ను ఒలింపిక్స్​లో చూడాలని భావిస్తున్నారు. అదే విధంగా క్రికెట్​కు భవిష్యత్​లో మరింత క్రేజ్​ తెచ్చేందుకు మా క్రీడను ఒలింపిక్స్​లో ప్రవేశపెట్టాలని నిర్ణయించాం. ఒలింపిక్స్​కు క్రికెట్​ కొత్త అలంకరణగా మేము భావిస్తున్నాం. అయితే మా క్రీడను అందులో చేర్చడం అంత సులభమైనది కాదని మాకు తెలుసు. క్రికెట్​ను విశ్వక్రీడల్లో చేర్చేందుకు ఇదే సరైన సమయమని మేము ఆశిస్తున్నాం".

- గ్రెగ్​ బార్క్​లే, ఐసీసీ అధ్యక్షుడు

అమెరికాలో 3 కోట్ల మందికి పైగా క్రికెట్​ అభిమానులున్నారు. అందుకే 2028లో లాస్​ఏంజెలెస్​​ వేదికగా జరగనున్న ఒలింపిక్స్​లో ఈ క్రీడను చేర్చేందుకు సరైన సమయమని ఐసీసీ వర్గాలు భావిస్తున్నాయి.

మొదటిసారి ఆడింది అక్కడే

1900 పారిస్ ఒలింపిక్స్​లో తొలిసారిగా క్రికెట్​కు​ అవకాశమిచ్చారు. ఇందులో ఫ్రాన్స్​, గ్రేట్​ బ్రిటన్​ జట్లు మాత్రమే పాల్గొన్నాయి. రెండ్రోజుల పాటు సాగిన ఈ మ్యాచ్​లో గ్రేట్​ బ్రిటన్​ 158 పరుగుల తేడాతో గెలుపొంది స్వర్ణ పతకం అందుకుంది. ఓడిపోయిన ఫ్రాన్స్​ టీమ్​కు రజతం దక్కింది. రెండే టీమ్​లు పాల్గొనడం వల్ల కాంస్య పతకానికి అవకాశం లేకుండా పోయింది. మళ్లీ 128 ఏళ్ల తర్వాత 2028లో ఆ క్రీడను ఒలింపిక్స్​లో చేర్చేందుకు ఐసీసీ సన్నాహాలు మొదలెట్టింది.

బీసీసీఐ సుముఖత

2028 లాస్​ ఏంజెలెస్​​ ఒలింపిక్స్​లో క్రికెట్​ చోటు కల్పించడంపై భారత క్రికెట్​ నియంత్రణ మండలి(BCCI) కార్యదర్శి జై షా స్పందించారు. అదే జరిగితే ఆ మెగా ఈవెంట్​లో భారత్​ పాల్గొంటుందని ఆయన స్పష్టం చేశారు.

ఇదీ చూడండి.. ఒలింపిక్స్​లోకి క్రికెట్​ ఎంట్రీ అప్పుడే.. భారత్​ వెళ్తుందా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.