టోక్యో ఒలింపిక్స్ నుంచి తప్పుకొంటున్న టెన్నిస్ ఆటగాళ్ల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. తాజాగా కెనడా స్టార్ టెన్నిస్ ప్లేయర్ బియాంకా ఆండ్రెస్కు విశ్వక్రీడల నుంచి వైదొలుగుతున్నట్లు స్పష్టం చేసింది. కొవిడ్ నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. 2024 పారిస్ ఒలింపిక్స్లో తప్పనిసరిగా పాల్గొంటానని ప్రమాణం చేసిందీ ఐదో సీడ్ ప్లేయర్.
"ఒలింపిక్స్ నుంచి తప్పుకోవాలనే కఠినమైన నిర్ణయం తీసుకున్నా. నా చిన్నతనం నుంచి ఒలింపిక్స్లో దేశానికి ప్రాతినిధ్యం వహించాలని కలలు కన్నాను. కానీ, ప్రస్తుతం కొవిడ్ మహమ్మారి కారణంగా ఈ విశ్వక్రీడల నుంచి తప్పుకోక తప్పట్లేదు. ఇది నన్ను బాధించినా.. ప్రస్తుత సమయానికి తగిన నిర్ణయమిది. పారిస్ వేదికగా 2024లో జరిగే ఒలింపిక్స్లో తప్పనిసరిగా పాల్గొంటా."
-బియాంకా, టెన్నిస్ ప్లేయర్.
స్టార్ టెన్నిస్ ఆటగాడు రఫెల్ నాదల్, అమెరికా ప్లేయర్ సెరెనా విలియమ్స్, సిమోనా హలెప్, డొమినిక్ థీమ్.. ఇప్పటికే ఒలింపిక్స్ నుంచి తప్పుకొంటున్నట్లు ప్రకటించారు. టోక్యో వేదికగా ఈ విశ్వ క్రీడలు జులై 23న ప్రారంభమై.. ఆగస్టు 8న ముగియనున్నాయి.
ఇవీ చదవండి: