ETV Bharat / sports

Tokyo Olympics: ఒలింపిక్స్​కు ముందు పెరుగుతున్న కరోనా కేసులు - ఒలింపిక్ క్రీడా గ్రామంలో కొవిడ్ కేసులు

ప్రతిష్ఠాత్మక టోక్యో ఒలింపిక్స్​కు ముందు కరోనా కేసులు కలవరపెడుతున్నాయి. తాజాగా అమెరికాకు చెందిన మహిళా జిమ్నాస్ట్​కు కొవిడ్ నిర్ధరణ అయింది. మరోవైపు చెక్​ రిపబ్లిక్​ బీచ్​ వాలీబాల్ ప్లేయర్​ ఒండ్రెజ్​ పెరుసిక్​ కూడా కరోనా బారిన పడింది.

tokyo olympics
టోక్యో ఒలింపిక్స్
author img

By

Published : Jul 19, 2021, 4:51 PM IST

టోక్యో ఒలింపిక్స్​కు ముందు అథ్లెట్లు కరోనా బారిన పడటం నిర్వాహకులను కలవరపెడుతోంది. తాజాగా అమెరికాకు చెందిన మహిళా జిమ్నాస్ట్​కు కొవిడ్ నిర్ధరణ అయింది. ఆమె ప్రి టోక్యో ఒలింపిక్స్​ ట్రైనింగ్ క్యాంపులో శిక్షణ తీసుకుంది. వైరస్​ బారిన పడటం వల్ల ప్రస్తుతం ఐసోలేషన్​లోకి వెళ్లింది. ఈ

అంతకుముందు చెక్​ రిపబ్లిక్​ బీచ్​ వాలీబాల్​ ప్లేయర్​ ఒండ్రెజ్​ పెరుసిక్​కు కరోనా పాజిటివ్​గా తేలింది. ఆమెకు కూడా ఐసోలేషన్​లోకి వెళ్లింది. చెక్​ రిపబ్లిక్​కు సంబంధించి ఇది ఒలింపిక్స్​లో రెండో కేసు.

ఇక ఆదివారం రాత్రి గ్రేట్ బ్రిటన్​కు చెందిన 8 మంది అథ్లెట్లు ఐసోలేషన్​లోకి వెళ్లారు. ఫ్లైట్​లో వస్తున్న సమయంలో కొవిడ్ సోకిన వ్యక్తితో వీరు సన్నిహితంగా మెలగడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. వీరంతా టోక్యోకు బయలుదేరడానికి ముందు నెగెటివ్​ రిపోర్ట్​తో ఉన్నారు.

ఐఓసీ శరణార్థుల జట్టు చీఫ్‌కు కరోనా:

అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ (ఐఓసీ) శరణార్థుల జట్టు చెఫ్‌ డి మిషన్‌, మాజీ అథ్లెట్‌ లోరౌప్‌ పాజిటివ్‌గా తేలింది. దోహా నుంచి టోక్యోకు బయల్దేరే ముందు ఆమెకు పాజిటివ్‌ వచ్చింది. దీంతో శరణార్థుల జట్టు టోక్యో రాక ఆలస్యం కానుంది. ఒకటి, రెండు రోజుల్లో శరణార్థుల జట్టు ఒలింపిక్స్‌కు రావొచ్చని.. లోరౌప్‌ మాత్రం దోహాలోనే క్వారంటైన్‌లో ఉండనుందని ఐసీఓ వర్గాలు తెలిపాయి.

ఇదీ చదవండి: Olympics: ఒలింపిక్స్​కు దూరమైన టెన్నిస్ యువ సంచలనం

టోక్యో ఒలింపిక్స్​కు ముందు అథ్లెట్లు కరోనా బారిన పడటం నిర్వాహకులను కలవరపెడుతోంది. తాజాగా అమెరికాకు చెందిన మహిళా జిమ్నాస్ట్​కు కొవిడ్ నిర్ధరణ అయింది. ఆమె ప్రి టోక్యో ఒలింపిక్స్​ ట్రైనింగ్ క్యాంపులో శిక్షణ తీసుకుంది. వైరస్​ బారిన పడటం వల్ల ప్రస్తుతం ఐసోలేషన్​లోకి వెళ్లింది. ఈ

అంతకుముందు చెక్​ రిపబ్లిక్​ బీచ్​ వాలీబాల్​ ప్లేయర్​ ఒండ్రెజ్​ పెరుసిక్​కు కరోనా పాజిటివ్​గా తేలింది. ఆమెకు కూడా ఐసోలేషన్​లోకి వెళ్లింది. చెక్​ రిపబ్లిక్​కు సంబంధించి ఇది ఒలింపిక్స్​లో రెండో కేసు.

ఇక ఆదివారం రాత్రి గ్రేట్ బ్రిటన్​కు చెందిన 8 మంది అథ్లెట్లు ఐసోలేషన్​లోకి వెళ్లారు. ఫ్లైట్​లో వస్తున్న సమయంలో కొవిడ్ సోకిన వ్యక్తితో వీరు సన్నిహితంగా మెలగడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. వీరంతా టోక్యోకు బయలుదేరడానికి ముందు నెగెటివ్​ రిపోర్ట్​తో ఉన్నారు.

ఐఓసీ శరణార్థుల జట్టు చీఫ్‌కు కరోనా:

అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ (ఐఓసీ) శరణార్థుల జట్టు చెఫ్‌ డి మిషన్‌, మాజీ అథ్లెట్‌ లోరౌప్‌ పాజిటివ్‌గా తేలింది. దోహా నుంచి టోక్యోకు బయల్దేరే ముందు ఆమెకు పాజిటివ్‌ వచ్చింది. దీంతో శరణార్థుల జట్టు టోక్యో రాక ఆలస్యం కానుంది. ఒకటి, రెండు రోజుల్లో శరణార్థుల జట్టు ఒలింపిక్స్‌కు రావొచ్చని.. లోరౌప్‌ మాత్రం దోహాలోనే క్వారంటైన్‌లో ఉండనుందని ఐసీఓ వర్గాలు తెలిపాయి.

ఇదీ చదవండి: Olympics: ఒలింపిక్స్​కు దూరమైన టెన్నిస్ యువ సంచలనం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.