టోక్యో ఒలింపిక్స్ కోసం భారత్ నుంచి మొదటి బృందం జపాన్ వెళ్లనున్న నేపథ్యంలో వారికి కల్పించిన సదుపాయాలపై శుక్రవారం సమీక్షించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. అథ్లెట్లకు రవాణా, వైద్య సౌకర్యాలు సహా టీకా వివరాలపై చర్చించినట్లు ట్విట్టర్లో వెల్లడించారు. వారితో జులై 13న సాయంత్రం 5 గంటలకు భేటీ కానున్నట్లు తెలిపారు.
2020 టోక్యో కోసం భారత బృందం సన్నద్ధతపై సమీక్షించాను. ఒలింపిక్స్లో పాల్గొనే అథ్లెట్లతో జులై 13న సమావేశమవుతాను. 130 కోట్ల మంది భారతీయుల తరఫున వారికి శుభాకాంక్షలు తెలియజేస్తా.
-నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి
ఎయిర్ ఇండియా ప్రత్యేక విమానంలో జులై 17న టోక్యో బయలుదేరనుంది భారత బృందం. ఈ నేపథ్యంలో అథ్లెట్లను ఉత్సాహపరచాలని ప్రజలను కోరారు మోదీ.
ఇప్పటికే 120 మందికి పైగా భారత అథ్లెట్లు ఒలింపిక్స్కు అర్హత సాధించారు. జులై 23 నుంచి ఆగస్టు 8 వరకు ఈ మెగా ఈవెంట్ జరగనుంది.
ఇదీ చూడండి: Olympics: ప్రేక్షకులు లేకుండానే ఒలింపిక్స్