ETV Bharat / sports

మలేషియా మాస్టర్స్​లో భారత్​కు నిరాశ.. కశ్యప్​ నిష్క్రమణ

author img

By

Published : Jul 7, 2022, 3:20 PM IST

కౌలాలంపూర్‌ వేదికగా జరుగతున్న మలేషియా మాస్టర్స్​లో భారత్​కు తీవ్ర నిరాశ ఎదురైంది. ప్రీక్వార్టర్స్‌లో భారత్​ స్టార్​ షట్లర్​ పారుపల్లి కశ్యప్ ఓడిపోయారు. ఫలితంగా టోర్నీ నుంచి నిష్క్రమించారు.

Malaysia Masters 2022: Parupalli Kashyap bows out, loses to Anthony Ginting
మలేషియా మాస్టర్స్​లో భారత్​కు నిరాశ.. కశ్యప్​ నిష్క్రమణ

Malaysia Masters 2022: మలేషియా రాజధాని కౌలాలంపూర్‌లో జరుగుతున్న మలేషియా మాస్టర్స్ - 2022 టోర్నీ నుంచి భారత్​ స్టార్​ షట్లర్​ షట్లర్​ పారుపల్లి కశ్యప్​ నిష్ర్కమించారు. ప్రీక్వార్టర్స్‌లో ఇండోనేషియాకు చెందిన ఆంథోనీ సినిసుకా గింటింగ్​తో తలపడిన కశ్యప్​ 21-10, 21-15 తేడాతో ఓడిపోయాడు. దాదాపు 34 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో.. వరుసగా రెండో రౌండ్లలో పూర్తి ఆధిపత్యం కనబర్చారు సినిసుకా. దీంతో క్వార్టర్ ఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకున్నాడు.

ఇదిలా ఉంటే.. ఒలింపిక్​ విజేత పీవీ సింధు మరోసారి సత్తా చాటింది. మలేసియా మాస్టర్స్‌ ప్రపంచ టూర్‌ సూపర్‌ 500 బ్యాడ్మింటన్​ టోర్నీ క్వార్టర్‌ఫైనల్లోకి దూసుకెళ్లింది. మహిళల సింగిల్స్‌ ప్రీక్వార్టర్స్‌లో సింధు.. 21-12, 21-10తో జాంగ్​ యీ(చైనా)​పై విజయం సాధించింది. ఈ మ్యాచ్​ 28 నిమిషాల్లోనే ముగిసింది.

అంతకుముందు బుధవారం జరిగిన తొలి రౌండ్​లో చైనాకు చెందిన హి బింగ్‌ జియావొ​పై సింధు గెలిచింది. 21-13,17-21,21-15 తేడాతో విజయం సాధించింది. మరోవైపు, పురుషుల సింగిల్స్​లో తొలి రౌండ్​లో గెలిచి.. రెండో రౌండ్​ చేరుకున్న భారత షట్లర్​ సాయి ప్రణీత్​కు నిరాశ ఎదురైంది. చైనాకు చెందిన లీ షి ఫెంగ్​ చేతిలో 14-21, 17-21 తేడాతో ఓటమి పాలయ్యాడు.

ఇదీ చదవండి: టీ20 వరల్డ్​కప్​కు ముందే భారత్​- పాక్​ ఢీ.. రివెంజ్​కు ఛాన్స్!

Malaysia Masters 2022: మలేషియా రాజధాని కౌలాలంపూర్‌లో జరుగుతున్న మలేషియా మాస్టర్స్ - 2022 టోర్నీ నుంచి భారత్​ స్టార్​ షట్లర్​ షట్లర్​ పారుపల్లి కశ్యప్​ నిష్ర్కమించారు. ప్రీక్వార్టర్స్‌లో ఇండోనేషియాకు చెందిన ఆంథోనీ సినిసుకా గింటింగ్​తో తలపడిన కశ్యప్​ 21-10, 21-15 తేడాతో ఓడిపోయాడు. దాదాపు 34 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో.. వరుసగా రెండో రౌండ్లలో పూర్తి ఆధిపత్యం కనబర్చారు సినిసుకా. దీంతో క్వార్టర్ ఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకున్నాడు.

ఇదిలా ఉంటే.. ఒలింపిక్​ విజేత పీవీ సింధు మరోసారి సత్తా చాటింది. మలేసియా మాస్టర్స్‌ ప్రపంచ టూర్‌ సూపర్‌ 500 బ్యాడ్మింటన్​ టోర్నీ క్వార్టర్‌ఫైనల్లోకి దూసుకెళ్లింది. మహిళల సింగిల్స్‌ ప్రీక్వార్టర్స్‌లో సింధు.. 21-12, 21-10తో జాంగ్​ యీ(చైనా)​పై విజయం సాధించింది. ఈ మ్యాచ్​ 28 నిమిషాల్లోనే ముగిసింది.

అంతకుముందు బుధవారం జరిగిన తొలి రౌండ్​లో చైనాకు చెందిన హి బింగ్‌ జియావొ​పై సింధు గెలిచింది. 21-13,17-21,21-15 తేడాతో విజయం సాధించింది. మరోవైపు, పురుషుల సింగిల్స్​లో తొలి రౌండ్​లో గెలిచి.. రెండో రౌండ్​ చేరుకున్న భారత షట్లర్​ సాయి ప్రణీత్​కు నిరాశ ఎదురైంది. చైనాకు చెందిన లీ షి ఫెంగ్​ చేతిలో 14-21, 17-21 తేడాతో ఓటమి పాలయ్యాడు.

ఇదీ చదవండి: టీ20 వరల్డ్​కప్​కు ముందే భారత్​- పాక్​ ఢీ.. రివెంజ్​కు ఛాన్స్!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.