ETV Bharat / sports

'నాకు తీవ్ర అన్యాయం!'.. తండ్రితో మాట్లాడుతూ సింధు భావోద్వేగం

author img

By

Published : May 1, 2022, 5:02 PM IST

ఆసియా ఛాంపియన్​షిప్​ మహిళల సింగిల్స్​ సెమీఫైనల్​లో ఓడి కాంస్యంతో సరిపెట్టుకుంది భారత స్టార్​ షెట్లర్​ పీవీ సింధు. అయితే, మ్యాచ్​ మధ్యలో రిఫరీ తీసుకున్న నిర్ణయం వల్లే తాను ఓడిపోయానని, ఆ నిర్ణయం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేసింది. తాను ఈ మ్యాచ్​ గెలిచి ఫైనల్​కు వెళ్లాల్సిందని పేర్కొంది. మ్యాచ్​ తర్వాత తనతో మాట్లాడుతూ సింధు కంటతడి పెట్టుకున్నట్లు చెప్పారు ఆమె తండ్రి పీవీ రమణ.

P V Sindhu
పీవీ సింధు

ఆసియా ఛాంపియన్​షిప్​ మహిళల సింగిల్స్​ సెమీఫైనల్​ జరిగిన తీరుపై భారత స్టార్​ షట్లర్​, ఒలింపిక్​ పతక విజేత పీవీ సింధు ఆవేదన వ్యక్తం చేసింది. ప్రపంచ నంబర్​ 2 అకానె యమగూచిపై గెలిచి తాను ఫైనల్​కు వెళ్లాల్సిందని, మ్యాచ్​ కొనసాగుతున్న సమయంలో రిఫరీ తీసుకున్న నిర్ణయం సరికాదని పేర్కొంది. ఆ నిర్ణయం.. ఆసియా ఛాంపియన్​షిప్​లో పసిడి నెగ్గాలన్న కలను చెరిపేసిందని వ్యాఖ్యానించింది.

"సర్వీస్​ చేసేటప్పుడు ఎక్కువ సమయం తీసుకుంటున్నావని రిఫరీ నాతో చెప్పాడు. అయితే, నేను సర్వీస్​ చేసే సమయానికి ప్రత్యర్థి సిద్ధంగా లేదు. కానీ, నా మాట పట్టించుకోకుండా యమగూచికి పాయింట్​ ఇచ్చారు. ఇది అన్యాయం. సెమీఫైనల్లో ఓటమికి ఇదో కారణం కావచ్చు. రెండో గేమ్​లో 14-11తో ఆధిక్యంలో ఉన్న సమయంలో ఇది జరిగింది. లేదంటే నేను జోరులో 15-11తో విజయానికి చేరువయ్యేదాన్ని. అనవసరంగా ఒక పాయింట్​ కోల్పోవటం వల్ల స్కోరు 14-12గా మారింది. ఆమెకు రిఫరీ ఇచ్చిన పాయింట్​ న్యాయమైంది కాదు. నేను ఈ మ్యాచ్​లో గెలిచి ఫైనల్​కు వెళ్లాల్సింది. ఈ విషయంపై చీఫ్​ రిఫరీకి కూడా ఫిర్యాదు చేశా. కానీ, అప్పటికే పాయింట్​ ఇచ్చేశారు కదా అని బదులిచ్చారు. ఒక చీఫ్​ రిఫరీగా కనీసం ఎక్కడ తప్పు జరిగిందో అని పరిశీలించాల్సింది."

- పీవీ సింధు, భారత షట్లర్​.

రిఫరీ నిర్ణయంతో సింధూ నిరాశకు లోనైనట్లు తెలిపారు ఆమె తండ్రి పీవీ రమణ. 'ఈసారి పసిడి గెలుస్తాననే పూర్తి నమ్మకంతో ఉంది. అందుకే తీవ్ర నిరాశకు గురైంది. నాతో మాట్లాడుతూ కంటతడి పెట్టుకుంది. అది జరిగిపోయిన విషయం అని, దానిని మర్చిపోవాలని సూచించా. రిఫరీ తీసుకున్న నిర్ణయం సరికాదు. ఆమె సమయం ఎక్కువ తీసుకుంటే ఎల్లో కార్డుతో హెచ్చరించాలి. అలాగే చేస్తుంటే రెడ్​ కార్డు చూపించాక పాయింట్​ ఇవ్వాలి. కానీ, అలాంటిది ఏమీ జరగలేదు.' అని పేర్కొన్నారు.

మరోవైపు.. మెడల్​ ప్రదానోత్సవానికి సింధు దూరంగా ఉండటం వల్ల ఆమె కాస్యం తీసుకునేందుకు ఇష్టపడటం లేదనే ఊహాగానాలు వినిపించాయి. అయితే.. ఆ తర్వాత మెడల్​తో ఉన్న ఫొటోను ట్విట్టర్​లో షేర్​ చేస్తూ ఆ వాదనలకు చెక్ పెట్టింది సింధు. ఒక ప్రతిష్టాత్మక ఈవెంట్​ ముగింపులో పతకం చాలా ముఖ్యమైనదని, ప్రస్తుతం తదుపరి గేమ్​పై దృష్టి పెట్టినట్లు పేర్కొంది.

ఏం జరిగింది?: ఆసియా ఛాంపియన్​షిప్​ మహిళల సింగిల్స్​ సెమీఫైనల్స్​లో జపాన్​కు చెందిన అకానె యమగూచితో తలపడింది సింధు. సుమారు గంటకుపైగా సాగిన పోరులో సింధు 21-13,19-21,16-21 తేడాతో ఓటమిపాలైంది. అయితే, ఈ మ్యాచ్​లో ఆమెకు తీవ్ర అన్యాయం జరిగినట్లు తెలుస్తోంది. రెండో గేమ్​లో సింధూ 14-11 తేడాతో ఆధిపత్యంలో ఉన్న సమయంలో రిఫరీ తీసుకున్న తప్పుడు నిర్ణయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తొలి గేమ్​ను సొంతం చేసుకున్న సింధు రెండో గేమ్​లో ఆధిపత్యంలో దూసుకుపోతుండగా.. మ్యాచ్​ రిఫరీ యమగూచికి ఒక పాయింట్​ కేటాయించారు. సింధు సర్వీస్​ చేసేటప్పుడు ఎక్కువ సమయం తీసుకుందన్న కారణంతోనే పాయింట్​ ఇచ్చినట్లు తెలిసింది. అనంతరం రిఫరీతో సింధు మాట్లాడింది. యమగూచి సిద్ధంగా లేనందునే తాను సమయం తీసుకున్నానని వివరించినా పట్టించుకోలేదు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్​గా మారింది.

ఇదీ చూడండి: ఆసియా ఛాంపియన్​షిప్​ సెమీస్​లో సింధు ఓటమి.. కాంస్యంతో సరి

ఆసియా ఛాంపియన్​షిప్​ మహిళల సింగిల్స్​ సెమీఫైనల్​ జరిగిన తీరుపై భారత స్టార్​ షట్లర్​, ఒలింపిక్​ పతక విజేత పీవీ సింధు ఆవేదన వ్యక్తం చేసింది. ప్రపంచ నంబర్​ 2 అకానె యమగూచిపై గెలిచి తాను ఫైనల్​కు వెళ్లాల్సిందని, మ్యాచ్​ కొనసాగుతున్న సమయంలో రిఫరీ తీసుకున్న నిర్ణయం సరికాదని పేర్కొంది. ఆ నిర్ణయం.. ఆసియా ఛాంపియన్​షిప్​లో పసిడి నెగ్గాలన్న కలను చెరిపేసిందని వ్యాఖ్యానించింది.

"సర్వీస్​ చేసేటప్పుడు ఎక్కువ సమయం తీసుకుంటున్నావని రిఫరీ నాతో చెప్పాడు. అయితే, నేను సర్వీస్​ చేసే సమయానికి ప్రత్యర్థి సిద్ధంగా లేదు. కానీ, నా మాట పట్టించుకోకుండా యమగూచికి పాయింట్​ ఇచ్చారు. ఇది అన్యాయం. సెమీఫైనల్లో ఓటమికి ఇదో కారణం కావచ్చు. రెండో గేమ్​లో 14-11తో ఆధిక్యంలో ఉన్న సమయంలో ఇది జరిగింది. లేదంటే నేను జోరులో 15-11తో విజయానికి చేరువయ్యేదాన్ని. అనవసరంగా ఒక పాయింట్​ కోల్పోవటం వల్ల స్కోరు 14-12గా మారింది. ఆమెకు రిఫరీ ఇచ్చిన పాయింట్​ న్యాయమైంది కాదు. నేను ఈ మ్యాచ్​లో గెలిచి ఫైనల్​కు వెళ్లాల్సింది. ఈ విషయంపై చీఫ్​ రిఫరీకి కూడా ఫిర్యాదు చేశా. కానీ, అప్పటికే పాయింట్​ ఇచ్చేశారు కదా అని బదులిచ్చారు. ఒక చీఫ్​ రిఫరీగా కనీసం ఎక్కడ తప్పు జరిగిందో అని పరిశీలించాల్సింది."

- పీవీ సింధు, భారత షట్లర్​.

రిఫరీ నిర్ణయంతో సింధూ నిరాశకు లోనైనట్లు తెలిపారు ఆమె తండ్రి పీవీ రమణ. 'ఈసారి పసిడి గెలుస్తాననే పూర్తి నమ్మకంతో ఉంది. అందుకే తీవ్ర నిరాశకు గురైంది. నాతో మాట్లాడుతూ కంటతడి పెట్టుకుంది. అది జరిగిపోయిన విషయం అని, దానిని మర్చిపోవాలని సూచించా. రిఫరీ తీసుకున్న నిర్ణయం సరికాదు. ఆమె సమయం ఎక్కువ తీసుకుంటే ఎల్లో కార్డుతో హెచ్చరించాలి. అలాగే చేస్తుంటే రెడ్​ కార్డు చూపించాక పాయింట్​ ఇవ్వాలి. కానీ, అలాంటిది ఏమీ జరగలేదు.' అని పేర్కొన్నారు.

మరోవైపు.. మెడల్​ ప్రదానోత్సవానికి సింధు దూరంగా ఉండటం వల్ల ఆమె కాస్యం తీసుకునేందుకు ఇష్టపడటం లేదనే ఊహాగానాలు వినిపించాయి. అయితే.. ఆ తర్వాత మెడల్​తో ఉన్న ఫొటోను ట్విట్టర్​లో షేర్​ చేస్తూ ఆ వాదనలకు చెక్ పెట్టింది సింధు. ఒక ప్రతిష్టాత్మక ఈవెంట్​ ముగింపులో పతకం చాలా ముఖ్యమైనదని, ప్రస్తుతం తదుపరి గేమ్​పై దృష్టి పెట్టినట్లు పేర్కొంది.

ఏం జరిగింది?: ఆసియా ఛాంపియన్​షిప్​ మహిళల సింగిల్స్​ సెమీఫైనల్స్​లో జపాన్​కు చెందిన అకానె యమగూచితో తలపడింది సింధు. సుమారు గంటకుపైగా సాగిన పోరులో సింధు 21-13,19-21,16-21 తేడాతో ఓటమిపాలైంది. అయితే, ఈ మ్యాచ్​లో ఆమెకు తీవ్ర అన్యాయం జరిగినట్లు తెలుస్తోంది. రెండో గేమ్​లో సింధూ 14-11 తేడాతో ఆధిపత్యంలో ఉన్న సమయంలో రిఫరీ తీసుకున్న తప్పుడు నిర్ణయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తొలి గేమ్​ను సొంతం చేసుకున్న సింధు రెండో గేమ్​లో ఆధిపత్యంలో దూసుకుపోతుండగా.. మ్యాచ్​ రిఫరీ యమగూచికి ఒక పాయింట్​ కేటాయించారు. సింధు సర్వీస్​ చేసేటప్పుడు ఎక్కువ సమయం తీసుకుందన్న కారణంతోనే పాయింట్​ ఇచ్చినట్లు తెలిసింది. అనంతరం రిఫరీతో సింధు మాట్లాడింది. యమగూచి సిద్ధంగా లేనందునే తాను సమయం తీసుకున్నానని వివరించినా పట్టించుకోలేదు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్​గా మారింది.

ఇదీ చూడండి: ఆసియా ఛాంపియన్​షిప్​ సెమీస్​లో సింధు ఓటమి.. కాంస్యంతో సరి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.