ఒలింపియన్, ఆసియా గేమ్స్ పతక విజేత, దిగ్గజ ఫుట్బాలర్ తులసీదాస్ బలరామ్కు మంగళవారం బ్రెయిన్ సర్జరీ జరిగింది. కోల్కతాలోని ఆయన నివాసంలో కిందపడిన ఆయనను ఆస్పత్రిలో చేర్చారు. ప్రస్తుతం తులసీదాస్ ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉండగా, వైద్యులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఆయనకు ఆయ్యే ఆస్పత్రి ఖర్చు మొత్తాన్ని బంగాల్ ప్రభుత్వం భరిస్తోంది.
84 ఏళ్ల బలరామ్ గతేడాది నుంచి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. అప్పటినుంచి మంచంపైనే ఉన్న ఆయనను నర్స్ సపర్యలు చేస్తోంది. సికింద్రాబాద్కు చెందిన తులసీదాస్.. భారత ఫుట్బాల్ త్రయంలో ఒకరు(చునీ గోస్వామి, పీకే బెనర్జీ, తులసీదాస్ బలరామ్).