ETV Bharat / sports

'ఈ హత్య కేసులో రెజ్లర్​ సుశీల్​దే ప్రధానపాత్ర!'

author img

By

Published : May 7, 2021, 10:11 AM IST

Updated : May 7, 2021, 11:53 AM IST

స్టార్​ రెజ్లర్​ సుశీల్​ కుమార్ ఓ హత్య కేసులో ఇరుకున్నాడు. దిల్లీలోని ఛత్రపాల్​ స్టేడియంలో జరిగిన హత్యతో సుశీల్​కు సంబంధమున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. దాడుల్లో గాయపడిన సోను మహల్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. ఈ నేపథ్యంలో రెజ్లర్​ సుశీల్ ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు.

sushil kumar, Delhi Police on lookout for suspects in Chhatrasal Stadium murder
రెజ్లర్ సుశీల్ కుమార్, రెజ్లర్​ సుశీల్‌ కోసం పోలీసుల గాలింపు!

దిల్లీలోని ఛత్రసాల్​ స్టేడియంలో జరిగిన హత్య కేసులో భారత స్టార్ రెజ్లర్​ సుశీల్​ కుమార్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఈ ఘటనలో సాగర్​ అనే మల్లయోధుడు మరణించగా.. మరో ఇద్దరు గాయాలతో బయటపడ్డారు. గాయపడిన సోనూ మహల్​ అనే వ్యక్తి వాంగ్మూలాన్ని పోలీసులు నమోదు చేశారు.

సుశీల్​తో పాటు మరికొందరు అతని సన్నిహితులు తమపై దాడి చేశారని ఆ వ్యక్తి తెలిపాడు. మరో నిందుతుడు ప్రిన్స్​ చరవాణి నుంచి గొడవకు సంబంధించి ఓ వీడియోను తీసుకున్నారు. దాడిలో పాల్గొన్న వారి ముఖాలు ఆ వీడియోలో స్పష్టంగా కనిపిస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.

Delhi Police on lookout for suspects in Chhatrasal Stadium murder
మృతుడు సాగర్​​

అసలేం జరిగింది?

ఛత్రసాల్​ స్టేడియంలో మంగళవారం రెండు గ్రూపుల మధ్య గొడవ జరిగింది. ఇందులో మల్లయోధులు సాగర్​, సోను, అమిత్​ల బృందంపై.. సుశీల్​ కుమార్, అతని అనుచరులు దాడికి పాల్పడ్డారు. ఇందులో సాగర్​ మరణించగా.. మరో ఇద్దరు గాయపడ్డారు. సంఘటన స్థలంలో కొన్ని వాహనాలతో పాటు ఓ గన్ లభ్యమయ్యాయి. ఇందుకు సంబంధించి మోడల్​ టౌన్​ పోలీసు స్టేషన్​లో కేసు నమోదైంది.

Delhi Police on lookout for suspects in Chhatrasal Stadium murder
ఛత్రసాల్​ స్టేడియం

బాధితుడి వాంగ్మూలం ప్రకారం సుశీల్​ ప్రమేయం కూడా ఈ హత్య కేసులో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు.. అతని కోసం గాలిస్తున్నారు. స్టేడియంలోని సీసీ కెమెరాలను కూడా పరిశీలిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

ఇవీ చదవండి: ఆర్చరీ ప్రపంచకప్‌కు భారత్‌ దూరం!

ఒలింపిక్స్​ వద్దంటూ వేలాది సంతకాలు!

దిల్లీలోని ఛత్రసాల్​ స్టేడియంలో జరిగిన హత్య కేసులో భారత స్టార్ రెజ్లర్​ సుశీల్​ కుమార్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఈ ఘటనలో సాగర్​ అనే మల్లయోధుడు మరణించగా.. మరో ఇద్దరు గాయాలతో బయటపడ్డారు. గాయపడిన సోనూ మహల్​ అనే వ్యక్తి వాంగ్మూలాన్ని పోలీసులు నమోదు చేశారు.

సుశీల్​తో పాటు మరికొందరు అతని సన్నిహితులు తమపై దాడి చేశారని ఆ వ్యక్తి తెలిపాడు. మరో నిందుతుడు ప్రిన్స్​ చరవాణి నుంచి గొడవకు సంబంధించి ఓ వీడియోను తీసుకున్నారు. దాడిలో పాల్గొన్న వారి ముఖాలు ఆ వీడియోలో స్పష్టంగా కనిపిస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.

Delhi Police on lookout for suspects in Chhatrasal Stadium murder
మృతుడు సాగర్​​

అసలేం జరిగింది?

ఛత్రసాల్​ స్టేడియంలో మంగళవారం రెండు గ్రూపుల మధ్య గొడవ జరిగింది. ఇందులో మల్లయోధులు సాగర్​, సోను, అమిత్​ల బృందంపై.. సుశీల్​ కుమార్, అతని అనుచరులు దాడికి పాల్పడ్డారు. ఇందులో సాగర్​ మరణించగా.. మరో ఇద్దరు గాయపడ్డారు. సంఘటన స్థలంలో కొన్ని వాహనాలతో పాటు ఓ గన్ లభ్యమయ్యాయి. ఇందుకు సంబంధించి మోడల్​ టౌన్​ పోలీసు స్టేషన్​లో కేసు నమోదైంది.

Delhi Police on lookout for suspects in Chhatrasal Stadium murder
ఛత్రసాల్​ స్టేడియం

బాధితుడి వాంగ్మూలం ప్రకారం సుశీల్​ ప్రమేయం కూడా ఈ హత్య కేసులో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు.. అతని కోసం గాలిస్తున్నారు. స్టేడియంలోని సీసీ కెమెరాలను కూడా పరిశీలిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

ఇవీ చదవండి: ఆర్చరీ ప్రపంచకప్‌కు భారత్‌ దూరం!

ఒలింపిక్స్​ వద్దంటూ వేలాది సంతకాలు!

Last Updated : May 7, 2021, 11:53 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.