ETV Bharat / sports

ప్రేమ బాణం గురి కుదిరింది.. ఆట అదిరింది!

author img

By

Published : Jun 29, 2021, 6:51 AM IST

ప్రపంచకప్‌లో పసిడి పంట పండించి అంతర్జాతీయ వేదికపై భారత పతాకాన్ని రెపరెపలాడించిన ఆర్చరీ జోడీ.. దీపికా కుమారి, అతాను దాస్‌. ఆట కారణంగా ఒక్కటై ఇప్పుడు ఒలింపిక్స్‌ ముంగిట పారిస్‌లో గొప్ప ప్రదర్శన చేసిన ఈ జోడీ.. విశ్వక్రీడల్లో పతకాశలు రేపుతూ టోక్యో విమానం ఎక్కబోతున్నారు.

Deepika Kumari Atanu Das
దీపిక, అతాను

ఆట వాళ్లకు జీవితాన్నిచ్చింది. ఆ ఆటే ఇద్దరినీ స్నేహితుల్ని చేసింది. తర్వాత ప్రేమికులుగా మార్చింది. పెళ్లి బంధంతో ఒక్కటయ్యేలా చేసింది. ఒకప్పుడు విడివిడిగా విజయాలు సాధించి గుర్తింపు పొందిన ఆ ఇద్దరూ.. ఇప్పుడు కలిసి అద్భుతాలు ఆవిష్కరిస్తున్నారు. ప్రపంచకప్‌లో పసిడి పంట పండించి అంతర్జాతీయ వేదికపై భారత పతాకాన్ని రెపరెపలాడించిన ఆ జంటే.. దీపికా కుమారి, అతాను దాస్‌. ఒలింపిక్స్‌ ముంగిట పారిస్‌లో గొప్ప ప్రదర్శన చేసిన ఈ జోడీ.. విశ్వక్రీడల్లో పతకాశలు రేపుతూ టోక్యో విమానం ఎక్కబోతున్నారు.

దీపికా కుమారి- అతాను దాస్ దంపతులు ప్రపంచకప్‌ మూడో అంచె పోటీల్లో రికర్వ్‌ విభాగంలో మిక్స్‌డ్‌ టీమ్‌లో స్వర్ణాలతో సత్తా చాటారు. భర్తతో కలిసి ఓ బంగారు పతకం సాధించిన దీపిక.. మరో రెండు విభాగాల్లో (మహిళల జట్టు, వ్యక్తిగత)నూ అదే ప్రదర్శన పునరావృతం చేసింది. బుధవారం (జూన్‌ 30) తొలి వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకోనున్న ఈ జంట.. ఈ ఏడాది కాలంలో ఆటలో ఎంతో మెరుగయ్యారు. వచ్చే నెల 23న ఆరంభమయ్యే టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన ఈ జోడీ.. ఆ క్రీడల్లో వేర్వేరుగా తలపడనున్నారు. పురుషుల రికర్వ్‌ జట్టుతో పాటు వ్యక్తిగత విభాగంలో అతాను బరిలో దిగుతుండగా.. మహిళల వ్యక్తిగత కేటగిరీలో దీపిక తలపడనుంది.

Deepika Kumari
దీపికా కుమారి

అలా కలిసి..

అతాను, దీపికలను ఆర్చరీనే కలిపింది. 2008లో ఓ అకాడమీలో వీళ్లకు పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత చాలా కాలం వరకూ పెద్దగా మాట్లాడుకోలేదు. కానీ కలిసే టోర్నీలకు వెళ్లడం వల్ల కొన్నేళ్ల తర్వాత వీళ్లిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. కొంతకాలం ప్రణయంలో మునిగి తేలిన వీళ్లు.. 2018లో నిశ్చితార్థం చేసుకున్నారు. టోక్యో ఒలింపిక్స్‌ ముగిశాక పెళ్లి చేసుకుందామని మొదట నిర్ణయించుకున్నారు. కానీ కరోనా కారణంగా ఆ విశ్వ క్రీడలు ఏడాది పాటు వాయిదా పడడం వల్ల గతేడాది వివాహం చేసుకున్నారు. ఇప్పుడీ క్రీడల్లో భార్యాభర్తలుగా బరిలో దిగనున్నారు.

ఇప్పటికే రెండు (2012, 2016) ఒలింపిక్స్‌ల్లో పోటీపడ్డ దీపికాకు.. ఇది ముచ్చటగా మూడో ఒలింపిక్స్‌. అతానుకిది రెండో ఒలింపిక్స్‌. గత క్రీడల్లో అతను పాల్గొన్నాడు. అయితే గతంలో కంటే ఇప్పుడు వీళ్లిద్దరి ప్రదర్శన అత్యుత్తమంగా సాగుతోంది. లాక్‌డౌన్‌లో తీవ్రంగా సాధన చేసిన వీళ్లు.. దానికి తగిన ఫలితాలు రాబడుతున్నారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో గాటెమాలాలో జరిగిన తొలి అంచె ప్రపంచకప్‌ టోర్నీల్లో స్వర్ణాలతో మెరిశారు. పురుషుల వ్యక్తిగత విభాగంలో అతాను తొలి ప్రపంచకప్‌ పసిడి సాధించాడు. ఆ టోర్నీలో దీపిక రెండు బంగారు పతాకాలు నెగ్గింది.

Atanu Das
అతాను దాస్

తోడుగా.. నీడగా

ఈ దంపతులు ఒకే ఆటలో కొనసాగుతుండటం వల్ల తమ ప్రదర్శన మెరుగుపర్చుకునేందుకు ఒకరికొకరు తోడుగా నిలుస్తున్నారు. వ్యక్తిగత జీవితంతో పాటు క్రీడా కెరీర్‌నూ ఆనందంగా ఆస్వాదిస్తున్నారు. ప్రేమతో సాగుతూ.. తమ లోటుపాట్లను సరిదిద్దుకుంటున్నారు. రోజూ ఆర్చరీ గురించే మాట్లాడుకుంటారు. మరో ఆలోచన లేకుండా తప్పులపై చర్చించుకుంటారు. నిత్యం వాళ్లలో వాళ్లే పోటీపడుతుంటారు. దీంతో ఈ ఇద్దరి ఆట మెరుగవుతోంది. ఇదే ఆత్మవిశ్వాసంతో టోక్యో ఒలింపిక్స్‌లోనూ పతకాలు సాధిస్తామనే ధీమాతో ఉందీ జంట.

ఇవీ చూడండి:

Deepika Kumari: గురి కుదిరింది.. అగ్రస్థానం దక్కింది

ప్రేమాట: ఔను.. వాళ్లిద్దరినీ క్రీడలే కలిపాయి

ఆట వాళ్లకు జీవితాన్నిచ్చింది. ఆ ఆటే ఇద్దరినీ స్నేహితుల్ని చేసింది. తర్వాత ప్రేమికులుగా మార్చింది. పెళ్లి బంధంతో ఒక్కటయ్యేలా చేసింది. ఒకప్పుడు విడివిడిగా విజయాలు సాధించి గుర్తింపు పొందిన ఆ ఇద్దరూ.. ఇప్పుడు కలిసి అద్భుతాలు ఆవిష్కరిస్తున్నారు. ప్రపంచకప్‌లో పసిడి పంట పండించి అంతర్జాతీయ వేదికపై భారత పతాకాన్ని రెపరెపలాడించిన ఆ జంటే.. దీపికా కుమారి, అతాను దాస్‌. ఒలింపిక్స్‌ ముంగిట పారిస్‌లో గొప్ప ప్రదర్శన చేసిన ఈ జోడీ.. విశ్వక్రీడల్లో పతకాశలు రేపుతూ టోక్యో విమానం ఎక్కబోతున్నారు.

దీపికా కుమారి- అతాను దాస్ దంపతులు ప్రపంచకప్‌ మూడో అంచె పోటీల్లో రికర్వ్‌ విభాగంలో మిక్స్‌డ్‌ టీమ్‌లో స్వర్ణాలతో సత్తా చాటారు. భర్తతో కలిసి ఓ బంగారు పతకం సాధించిన దీపిక.. మరో రెండు విభాగాల్లో (మహిళల జట్టు, వ్యక్తిగత)నూ అదే ప్రదర్శన పునరావృతం చేసింది. బుధవారం (జూన్‌ 30) తొలి వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకోనున్న ఈ జంట.. ఈ ఏడాది కాలంలో ఆటలో ఎంతో మెరుగయ్యారు. వచ్చే నెల 23న ఆరంభమయ్యే టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన ఈ జోడీ.. ఆ క్రీడల్లో వేర్వేరుగా తలపడనున్నారు. పురుషుల రికర్వ్‌ జట్టుతో పాటు వ్యక్తిగత విభాగంలో అతాను బరిలో దిగుతుండగా.. మహిళల వ్యక్తిగత కేటగిరీలో దీపిక తలపడనుంది.

Deepika Kumari
దీపికా కుమారి

అలా కలిసి..

అతాను, దీపికలను ఆర్చరీనే కలిపింది. 2008లో ఓ అకాడమీలో వీళ్లకు పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత చాలా కాలం వరకూ పెద్దగా మాట్లాడుకోలేదు. కానీ కలిసే టోర్నీలకు వెళ్లడం వల్ల కొన్నేళ్ల తర్వాత వీళ్లిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. కొంతకాలం ప్రణయంలో మునిగి తేలిన వీళ్లు.. 2018లో నిశ్చితార్థం చేసుకున్నారు. టోక్యో ఒలింపిక్స్‌ ముగిశాక పెళ్లి చేసుకుందామని మొదట నిర్ణయించుకున్నారు. కానీ కరోనా కారణంగా ఆ విశ్వ క్రీడలు ఏడాది పాటు వాయిదా పడడం వల్ల గతేడాది వివాహం చేసుకున్నారు. ఇప్పుడీ క్రీడల్లో భార్యాభర్తలుగా బరిలో దిగనున్నారు.

ఇప్పటికే రెండు (2012, 2016) ఒలింపిక్స్‌ల్లో పోటీపడ్డ దీపికాకు.. ఇది ముచ్చటగా మూడో ఒలింపిక్స్‌. అతానుకిది రెండో ఒలింపిక్స్‌. గత క్రీడల్లో అతను పాల్గొన్నాడు. అయితే గతంలో కంటే ఇప్పుడు వీళ్లిద్దరి ప్రదర్శన అత్యుత్తమంగా సాగుతోంది. లాక్‌డౌన్‌లో తీవ్రంగా సాధన చేసిన వీళ్లు.. దానికి తగిన ఫలితాలు రాబడుతున్నారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో గాటెమాలాలో జరిగిన తొలి అంచె ప్రపంచకప్‌ టోర్నీల్లో స్వర్ణాలతో మెరిశారు. పురుషుల వ్యక్తిగత విభాగంలో అతాను తొలి ప్రపంచకప్‌ పసిడి సాధించాడు. ఆ టోర్నీలో దీపిక రెండు బంగారు పతాకాలు నెగ్గింది.

Atanu Das
అతాను దాస్

తోడుగా.. నీడగా

ఈ దంపతులు ఒకే ఆటలో కొనసాగుతుండటం వల్ల తమ ప్రదర్శన మెరుగుపర్చుకునేందుకు ఒకరికొకరు తోడుగా నిలుస్తున్నారు. వ్యక్తిగత జీవితంతో పాటు క్రీడా కెరీర్‌నూ ఆనందంగా ఆస్వాదిస్తున్నారు. ప్రేమతో సాగుతూ.. తమ లోటుపాట్లను సరిదిద్దుకుంటున్నారు. రోజూ ఆర్చరీ గురించే మాట్లాడుకుంటారు. మరో ఆలోచన లేకుండా తప్పులపై చర్చించుకుంటారు. నిత్యం వాళ్లలో వాళ్లే పోటీపడుతుంటారు. దీంతో ఈ ఇద్దరి ఆట మెరుగవుతోంది. ఇదే ఆత్మవిశ్వాసంతో టోక్యో ఒలింపిక్స్‌లోనూ పతకాలు సాధిస్తామనే ధీమాతో ఉందీ జంట.

ఇవీ చూడండి:

Deepika Kumari: గురి కుదిరింది.. అగ్రస్థానం దక్కింది

ప్రేమాట: ఔను.. వాళ్లిద్దరినీ క్రీడలే కలిపాయి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.