ETV Bharat / sports

భారత బాక్సర్లకు నిరాశ.. 'కాంస్యం'తో వెనక్కి.. గాయం వల్ల సెమీస్ ఆడకుండానే..

author img

By

Published : May 12, 2023, 6:26 PM IST

Updated : May 12, 2023, 8:36 PM IST

Boxer Mohammad Hussamuddin : ప్రపంచ పురుషుల బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్స్‌లో సెమీస్‌కు చేరి ఇప్పటికే చరిత్ర సృష్టించిన తెలంగాణకు చెందిన బాక్సర్​ మహమ్మద్‌ హుసాముద్దీన్‌.. మోకాలి గాయం కారణంగా పోటీ నుంచి తప్పుకున్నాడు. దీంతో అతడు కాంస్య పతకంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. మరోవైపు భారత్​కు చెందిన మరో ఇద్దరు బాక్సర్​లు​ దీపక్‌ భోరియా, నిశాంత్ దేవ్​లు కూడా పురుషుల 51, 71 కేజీల విభాగంలో కాంస్యం పతకాలను ముద్దాడారు.

World Boxing Championships 2023 Boxer Mohammad Hussamudin Won Bronze Medal
ప్రపంచ పురుషుల బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్స్‌ 2023 బాక్సర్​ మహమ్మద్‌ హుసాముద్దీన్‌కు కాంస్య పతకం

Boxer Mohammad Hussamuddin : ప్రపంచ పురుషుల బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్స్‌ సెమిస్​కు చేరిన ప్రముఖ బాక్సర్​ మహమ్మద్‌ హుసాముద్దీన్‌ మోకాలి గాయం కారణంగా పోటీ నుంచి తప్పుకున్నాడు. వైద్యులు సూచన మేరకు సెమీస్ బౌట్​ ఆడకూడదని నిర్ణయించుకున్నాడు. దీంతో ప్రపంచ పురుషుల బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్స్‌లో కాంస్య పతకంతో సరిపెట్టుకున్నాడు. మరోవైపు భారత్​కు చెందిన మరో ఇద్దరు బాక్సర్​లు​ దీపక్‌ భోరియా, నిశాంత్ దేవ్​లు కూడా పురుషుల 51, 71 కేజీల విభాగంలో కాంస్యం పతకాలను ముద్దాడారు. ప్రపంచ ఛాంపియన్‌షిప్స్​ 51 కేజీల విభాగం సెమీస్‌లో రెండుసార్లు కాంస్య పతకాన్ని గెలిచిన ఫ్రాన్స్​ బాక్సర్ బిలాల్ బెన్నామాతో జరిగిన పోరులో దీపక్ 3-4 తేడాతో ఓటమిపాలయ్యాడు.

ఇప్పటికే ప్రపంచ పురుషుల బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్స్‌లో సెమీస్‌కు చేరి చరిత్ర సృష్టించాడు నిజామాబాద్‌కు చెందిన ఈ 29 ఏళ్ల బాక్సర్ హుసాముద్దీన్‌. శుక్రవారం ఉజ్బెకిస్థాన్ ​​రాజధాని తాష్కెంట్‌లో జరిగిన క్వార్టర్స్​ పోరులో హుసాముద్దీన్‌ గాయపడ్డాడు. ఆ బౌట్‌లో పురుషుల 57 కేజీల విభాగంలో బల్గేరియాకు చెందిన జె.డియాజ్ ఇబానెజ్‌తో తలపడుతుండగా.. హుసాముద్దీన్​ మోకాలికి గాయమైంది. దీంతో అతడు సెమీఫైనల్ బౌట్ నుంచి వైదొలగాల్సి వచ్చింది.

"హుస్సాముద్దీన్ గాయం కారణంగా వాకోవర్ ఇచ్చి కాంస్యంతో సరిపెట్టుకున్నాడు. క్వార్టర్​ ఫైనల్​ బౌట్ సమయంలో అతడి మోకాలి గాయం అయింది. దీంతో కొద్దిరోజుల వరకు ఆటకు దూరంగా ఉండాలని సలహా ఇచ్చాము." అని బాక్సింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (బీఎఫ్​ఐ) ఓ ప్రకటనలో తెలిపింది. ఒకవేళ గాయంతోనే హుసాముద్దీన్​ బౌట్​ను కొనసాగించి సెమీస్​కు చేరి తలపడితే.. గాయం మరింత తీవ్రమై కోలుకోవడం కష్టంగా మారుతుందని వైద్యులు సూచించారు. ఈ మేరకు అతడు టోర్నమెంట్​ను నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు.

ఇద్దరికీ తొలి ఛాంపియన్​షిప్​!
World Boxing Championships 2023 : ఒకే ప్రపంచ బాక్సింగ్​ ఛాంపియన్‌షిప్స్‌లో ముగ్గురు భారత బాక్సర్లు క్వార్టర్స్‌ దాటడం ఇదే తొలిసారి. శుక్రవారం జరిగిన ఈ పోరులో బలమైన ప్రత్యర్థులతో వీరు తలపడ్డారు. ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌ అరంగేట్రంలోనే సత్తాచాటిన హుసాముద్దీన్‌.. ఈ క్వార్టర్స్​లో నెగ్గితే గనుకు సెమీస్​కు చేరుకునేవాడు. అనంతరం చివరి నాలుగు బౌట్​లు 57 కేజీల విభాగం సెమీస్‌లో క్యూబాకు చెందిన సైడెల్ హోర్టాతో ఢీకొనేవాడు. దురదృష్టవశాత్తు గాయం కావడం అతడికి ఆ అవకాశాన్ని చేజార్చుకునేలా చేసింది. హోర్టా సైతం తొలిసారి ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌లో ఆడటం విశేషం.

Boxer Mohammad Hussamuddin : ప్రపంచ పురుషుల బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్స్‌ సెమిస్​కు చేరిన ప్రముఖ బాక్సర్​ మహమ్మద్‌ హుసాముద్దీన్‌ మోకాలి గాయం కారణంగా పోటీ నుంచి తప్పుకున్నాడు. వైద్యులు సూచన మేరకు సెమీస్ బౌట్​ ఆడకూడదని నిర్ణయించుకున్నాడు. దీంతో ప్రపంచ పురుషుల బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్స్‌లో కాంస్య పతకంతో సరిపెట్టుకున్నాడు. మరోవైపు భారత్​కు చెందిన మరో ఇద్దరు బాక్సర్​లు​ దీపక్‌ భోరియా, నిశాంత్ దేవ్​లు కూడా పురుషుల 51, 71 కేజీల విభాగంలో కాంస్యం పతకాలను ముద్దాడారు. ప్రపంచ ఛాంపియన్‌షిప్స్​ 51 కేజీల విభాగం సెమీస్‌లో రెండుసార్లు కాంస్య పతకాన్ని గెలిచిన ఫ్రాన్స్​ బాక్సర్ బిలాల్ బెన్నామాతో జరిగిన పోరులో దీపక్ 3-4 తేడాతో ఓటమిపాలయ్యాడు.

ఇప్పటికే ప్రపంచ పురుషుల బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్స్‌లో సెమీస్‌కు చేరి చరిత్ర సృష్టించాడు నిజామాబాద్‌కు చెందిన ఈ 29 ఏళ్ల బాక్సర్ హుసాముద్దీన్‌. శుక్రవారం ఉజ్బెకిస్థాన్ ​​రాజధాని తాష్కెంట్‌లో జరిగిన క్వార్టర్స్​ పోరులో హుసాముద్దీన్‌ గాయపడ్డాడు. ఆ బౌట్‌లో పురుషుల 57 కేజీల విభాగంలో బల్గేరియాకు చెందిన జె.డియాజ్ ఇబానెజ్‌తో తలపడుతుండగా.. హుసాముద్దీన్​ మోకాలికి గాయమైంది. దీంతో అతడు సెమీఫైనల్ బౌట్ నుంచి వైదొలగాల్సి వచ్చింది.

"హుస్సాముద్దీన్ గాయం కారణంగా వాకోవర్ ఇచ్చి కాంస్యంతో సరిపెట్టుకున్నాడు. క్వార్టర్​ ఫైనల్​ బౌట్ సమయంలో అతడి మోకాలి గాయం అయింది. దీంతో కొద్దిరోజుల వరకు ఆటకు దూరంగా ఉండాలని సలహా ఇచ్చాము." అని బాక్సింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (బీఎఫ్​ఐ) ఓ ప్రకటనలో తెలిపింది. ఒకవేళ గాయంతోనే హుసాముద్దీన్​ బౌట్​ను కొనసాగించి సెమీస్​కు చేరి తలపడితే.. గాయం మరింత తీవ్రమై కోలుకోవడం కష్టంగా మారుతుందని వైద్యులు సూచించారు. ఈ మేరకు అతడు టోర్నమెంట్​ను నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు.

ఇద్దరికీ తొలి ఛాంపియన్​షిప్​!
World Boxing Championships 2023 : ఒకే ప్రపంచ బాక్సింగ్​ ఛాంపియన్‌షిప్స్‌లో ముగ్గురు భారత బాక్సర్లు క్వార్టర్స్‌ దాటడం ఇదే తొలిసారి. శుక్రవారం జరిగిన ఈ పోరులో బలమైన ప్రత్యర్థులతో వీరు తలపడ్డారు. ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌ అరంగేట్రంలోనే సత్తాచాటిన హుసాముద్దీన్‌.. ఈ క్వార్టర్స్​లో నెగ్గితే గనుకు సెమీస్​కు చేరుకునేవాడు. అనంతరం చివరి నాలుగు బౌట్​లు 57 కేజీల విభాగం సెమీస్‌లో క్యూబాకు చెందిన సైడెల్ హోర్టాతో ఢీకొనేవాడు. దురదృష్టవశాత్తు గాయం కావడం అతడికి ఆ అవకాశాన్ని చేజార్చుకునేలా చేసింది. హోర్టా సైతం తొలిసారి ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌లో ఆడటం విశేషం.

Last Updated : May 12, 2023, 8:36 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.