ETV Bharat / sports

బక్సమ్​ టోర్నీలో కౌశిక్​కు స్వర్ణం

author img

By

Published : Mar 8, 2021, 11:02 PM IST

స్పెయిన్ వేదికగా జరిగిన బక్సమ్ అంతర్జాతీయ టోర్నమెంట్​లో స్వర్ణం సాధించాడు భారత్​ బాక్సర్​ ​మనీశ్ కౌశిక్. ఫైనల్​లో 3-2తో డెన్మార్క్​కు చెందిన నికోలాయ్​ టెర్టేరియన్​ను మట్టికరిపించాడు.

Boxam International: Manish Kaushik wins gold, India finish with 10 medals
బక్సమ్​ టోర్నీలో కౌశిక్​కు స్వర్ణం

బక్సమ్​ అంతర్జాతీయ టోర్నమెంట్​లో వరుస విజయాలతో ఫైనల్​కు దూసుకుపోయిన భారత బాక్సర్​ మనీశ్ కౌశిక్​ స్వర్ణ పతకాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. 63కిలోల విభాగంలో రింగ్​లోకి దిగిన మనీశ్​.. 3-2తో డెన్మార్క్​కు చెందిన నికోలాయ్​ టెర్టేరియన్​ను మట్టికరిపించాడు. 2018 కామన్​వెల్త్​ గేమ్స్​లో రజతం సాధించిన కౌశిక్​.. ఆసియన్​ ఒలింపిక్​ క్వాలిఫయర్​ తర్వాత తొలిసారి బరిలోకి దిగాడు.

అయితే, ప్రపంచ ఛాంపియన్‌షిప్​లో కాంస్య పతక విజేత వికాస్ క్రిషన్​ రజతంతో సరిపెట్టుకున్నాడు. 69కిలోల విభాగంలో స్పెయిన్​కు చెందిన సిసోఖోపై 4-1తో విజయం సాధించాడు.

బక్సమ్​ అంతర్జాతీయ టోర్నమెంట్​లో వరుస విజయాలతో ఫైనల్​కు దూసుకుపోయిన భారత బాక్సర్​ మనీశ్ కౌశిక్​ స్వర్ణ పతకాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. 63కిలోల విభాగంలో రింగ్​లోకి దిగిన మనీశ్​.. 3-2తో డెన్మార్క్​కు చెందిన నికోలాయ్​ టెర్టేరియన్​ను మట్టికరిపించాడు. 2018 కామన్​వెల్త్​ గేమ్స్​లో రజతం సాధించిన కౌశిక్​.. ఆసియన్​ ఒలింపిక్​ క్వాలిఫయర్​ తర్వాత తొలిసారి బరిలోకి దిగాడు.

అయితే, ప్రపంచ ఛాంపియన్‌షిప్​లో కాంస్య పతక విజేత వికాస్ క్రిషన్​ రజతంతో సరిపెట్టుకున్నాడు. 69కిలోల విభాగంలో స్పెయిన్​కు చెందిన సిసోఖోపై 4-1తో విజయం సాధించాడు.

ఇదీ చూడండి: కోహ్లీసేనకు 'ధర్మ సంకటం'- రాహుల్‌కు చోటెక్కడ?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.