అభినవ్ బింద్రా 2008 బీజింగ్ ఒలింపిక్స్లో బంగారు పతకం సాధించి నేటికి 11 ఏళ్లు పూర్తయ్యాయి. వ్యక్తిగత విభాగంలో ఈ ఘనత సాధించిన ఏకైక భారతీయుడు అభినవ్ బింద్రానే. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో పసిడి కైవసం చేసుకున్నాడు.
"గత ఏడాది ఇదే సమయంలో మన అథ్లెట్లు బంగారు పతకాలు సాధించగా.. ఆ వేడుకల్లో బిజీగా ఉన్నాను. ఇంకా ఎన్నో మెడల్స్ కోసం వాళ్లు కృషి చేయాలని కోరుకుంటున్నా. అయితే, ఇందులో వారు ఆత్మాభిమానాన్ని కోల్పోకూడదు" -అభినవ్ బింద్రా, షూటర్
2016లో జరిగిన రియో ఒలింపిక్స్లో నాలుగో స్థానంలో నిలిచిన బింద్రా తృటిలో పతకాన్ని చేజార్చుకున్నాడు. అనంతరం ఆటకు రిటైర్మెంట్ ఇచ్చేశాడీ షూటర్.