AFC Women's Asian cup: ఏఎఫ్సీ మహిళల ఫుట్బాల్ ఆసియా కప్ నుంచి భారత మహిళల జట్టు అనివార్య పరిస్థితుల వల్ల తప్పుకొంది. దీంతో గ్రూప్-ఏ ఉన్న ఆ జట్టు ఇకపై ఆడాల్సిన తదుపరి మ్యాచ్లు కూడా రద్దయ్యాయి.
జట్టులో 13మంది ప్లేయర్స్కు కరోనా సోకింది. మరో ఇద్దరు గాయాలతో మ్యాచ్కు దూరమయ్యారు. దీంతో చైనీస్ తైపీతో ఆదివారం జరగాల్సిన మ్యాచ్కు కావాల్సిన 13 మంది ప్లేయర్స్ను భారత జట్టు సిద్ధం చేయలేకపోయింది. ఫలితంగా ఆ మ్యాచ్ను చివరి నిమిషంలో అర్థాంతరంగా నిలిపివేశారు.
టోర్నీ నిబంధనల ప్రకారం మ్యాచ్కు సిద్ధం కాలేపోయిన జట్టు.. పోటీ నుంచి తప్పుకొన్నట్లు పరిగణిస్తారు.
ఇదీ చూడండి:
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!