కరోనా బారిన పడ్డ ఆరుగురు భారత హాకీ జట్టు ఆటగాళ్లను బెంగళూరులోని ఎస్ఎస్ స్పార్ష్ మల్టీస్పెషాలిటీ ఆస్పత్రికి తరలించారు. ఈ విషయాన్ని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్) తెలిపింది. ప్రస్తుతం ప్లేయర్ల ఆరోగ్య పరిస్థితి బాగానే ఉన్నట్లు స్పష్టం చేసింది. మెరుగైన వైద్యం అందించేందుకే వారిని తరలించినట్లు వెల్లడించింది. జట్టు సారథి మన్ప్రీత్ సింగ్, స్ట్రైకర్ మన్దీప్ సింగ్, జస్కరన్ సింగ్, సురేందర్ కుమార్, వరుణ్ కుమార్, క్రిష్ణన్ బీ పాథక్కు ఇటీవలే కరోనా సోకింది.
![SAI](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/8392393_368_8392393_1597231134514.png)
బెంగళూరులోని జాతీయ శిక్షణ శిబిరానికి చేరే ముందు చేసిన వైద్య పరీక్షల్లో ఈ ఆటగాళ్లకు కరోనా పాజిటివ్గా నిర్ధరణ అయింది. ఈ నెల 20 నుంచి శిబిరం ఆరంభం కావాల్సి ఉంది.
![hockey player](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/mandeep-singh_1208newsroom_1597208157_751.jpg)
![hockey player](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/manpreet-singh_1208newsroom_1597208157_547.jpg)