బిహార్కు చెందిన జాతీయ మహిళా ఫుట్బాల్ క్రీడాకారిణి మోనీ కుమారికి.. కరోనా కారణంగా కష్టాలు మొదలయ్యాయి. ఈ మహమ్మారి వల్ల తన కుటుంబం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఫలితంగా తండ్రితో కలిసి నార్కటియాగంజ్ రైల్వేస్టేషన్ సమీపంలో ఓ చెరువు ఒడ్డున బట్టలు ఉతుకుతూ జీవనం సాగిస్తోంది.
ఆల్ ఇండియా ఉమెన్స్ ఫుట్బాల్కు రెండు సార్లు మోనీ ప్రాతినిధ్యం వహించింది. ఇంతటి కష్టకాలంలోనూ ఆటను వదలనంటోంది కుమారి. రోజూ ప్రాక్టీస్ కోసం సమయం కేటాయించడం మర్చిపోలేదని తెలిపింది.
![national footballer washing people clothes due to financial problem in Bettiah](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/250720-bh-bet-nationalfootballerwashcloth-av-byte-bhc10119_25072020202104_2507f_1595688664_375.jpg)
ప్రభుత్వం స్పందించి తన కుమార్తెకు ఉద్యోగం ఇప్పించాలని మోనీ తండ్రి కోరాడు. తద్వారా ఈ వృత్తిని మానేసి.. ఆటపై మరింత దృష్టిపెట్టేందుకు ఆస్కారం ఉంటుందని వెల్లడించాడు. కొవిడ్ విజృంభణ సమయంలో పరిశుభ్రత కీలక పాత్ర పోషిస్తుందని మోనీ సూచించింది.