ETV Bharat / sports

ర్యాన్ 'చిరిగిన బూట్ల'కు స్పాన్సర్ దొరికేశారు - puma

జింబాబ్వే క్రికెటర్​ ర్యాన్ బర్ల్​ ట్విట్టర్​లో పెట్టిన ఓ పోస్టుకు ప్రముఖ ఫుట్​వేర్ సంస్థ పుమా స్పందించింది. తన చిరిగిన బూట్ల ఫొటోను పెట్టిన బర్ల్​.. స్పాన్సర్లు ఉంటే ఇలా ప్రతి సిరీస్ తర్వాత తాము బూట్లను బాగు చేసుకోవాల్సిన అవసరం ఉండదంటూ రాసుకొచ్చాడు. 'ఇకపై మీకు ఆ అవసరం ఉండదు.. మీకు బూట్లను మేము స్పాన్సర్​ చేస్తాము' అని పుమా స్పందనగా తెలిపింది.

ryan burl, zimbabwe cricketer
ర్యాన్ బర్ల్, జింబాబ్వే క్రికెటర్
author img

By

Published : May 23, 2021, 6:39 PM IST

Updated : May 23, 2021, 9:27 PM IST

జింబాబ్వే క్రికెటర్ ర్యాన్​ బర్ల్​ సామాజిక మాధ్యమాల్లో పెట్టిన ఓ పోస్టుకు ప్రముఖ ఫుట్​వేర్ సంస్థ పుమా స్పందించింది. తన చిరిగిపోయిన బూట్లను ట్విట్టర్​లో పోస్టు చేసిన ర్యాన్​.. "మాకు స్పాన్సర్లు దొరికితే.. ప్రతి సిరీస్ తర్వాత ఇలా బూట్లను బాగుచేసుకోవాల్సిన పరిస్థితి తలెత్తదు. ఎవరైనా ఉన్నారా?" అని ఆ ఫొటో కింద రాసుకున్నాడు. ఈ ట్వీట్​కు స్పందించిన పుమా.. "ఇకపై మీకు ఆ అవసరం ఉండదు. మీకు బూట్లను మేము స్పాన్సర్ చేస్తాం" అని ట్వీట్​ చేసింది.

ప్రభుత్వం జోక్యం చేసుకుందనే కారణంతో అంతర్జాతీయ క్రికెట్ నుంచి జింబాబ్వేను 2019లో ఐసీసీ నిషేధించింది. తిరిగి అదే ఏడాది అక్టోబర్​లో నిషేధం ఎత్తివేసింది. అయినప్పటికీ కొవిడ్ కారణంగా జరగాల్సిన పర్యటనలు వాయిదా పడ్డాయి. ఈ ఏడాది పాకిస్థాన్​ ఆ దేశంలో పర్యటించింది. అయినా బోర్డుకు తగినంత ఆదాయం లేదు.

స్పాన్సర్​షిప్​లు, బ్రాడ్​కాస్ట్​ హక్కుల ద్వారా ఓవైపు సంపన్న క్రికెట్ బోర్డులు లక్షల కొద్దీ ఆదాయాన్ని గడిస్తున్న నేటి రోజుల్లో.. జింబాబ్వే క్రికెట్ బోర్డు పరిస్థితి దయనీయంగా ఉంది! ఆటగాళ్లకు కనీసం బూట్లు కొనలేని స్థితిలో ఉంది.

ఇదీ చదవండి: 'సుశీల్​.. ఎందుకిలా చేశావ్​?'

జింబాబ్వే క్రికెటర్ ర్యాన్​ బర్ల్​ సామాజిక మాధ్యమాల్లో పెట్టిన ఓ పోస్టుకు ప్రముఖ ఫుట్​వేర్ సంస్థ పుమా స్పందించింది. తన చిరిగిపోయిన బూట్లను ట్విట్టర్​లో పోస్టు చేసిన ర్యాన్​.. "మాకు స్పాన్సర్లు దొరికితే.. ప్రతి సిరీస్ తర్వాత ఇలా బూట్లను బాగుచేసుకోవాల్సిన పరిస్థితి తలెత్తదు. ఎవరైనా ఉన్నారా?" అని ఆ ఫొటో కింద రాసుకున్నాడు. ఈ ట్వీట్​కు స్పందించిన పుమా.. "ఇకపై మీకు ఆ అవసరం ఉండదు. మీకు బూట్లను మేము స్పాన్సర్ చేస్తాం" అని ట్వీట్​ చేసింది.

ప్రభుత్వం జోక్యం చేసుకుందనే కారణంతో అంతర్జాతీయ క్రికెట్ నుంచి జింబాబ్వేను 2019లో ఐసీసీ నిషేధించింది. తిరిగి అదే ఏడాది అక్టోబర్​లో నిషేధం ఎత్తివేసింది. అయినప్పటికీ కొవిడ్ కారణంగా జరగాల్సిన పర్యటనలు వాయిదా పడ్డాయి. ఈ ఏడాది పాకిస్థాన్​ ఆ దేశంలో పర్యటించింది. అయినా బోర్డుకు తగినంత ఆదాయం లేదు.

స్పాన్సర్​షిప్​లు, బ్రాడ్​కాస్ట్​ హక్కుల ద్వారా ఓవైపు సంపన్న క్రికెట్ బోర్డులు లక్షల కొద్దీ ఆదాయాన్ని గడిస్తున్న నేటి రోజుల్లో.. జింబాబ్వే క్రికెట్ బోర్డు పరిస్థితి దయనీయంగా ఉంది! ఆటగాళ్లకు కనీసం బూట్లు కొనలేని స్థితిలో ఉంది.

ఇదీ చదవండి: 'సుశీల్​.. ఎందుకిలా చేశావ్​?'

Last Updated : May 23, 2021, 9:27 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.