ETV Bharat / sports

WTC Final 2023 : డబ్ల్యూటీసీ ప్రైజ్​ మనీ ప్రకటించిన ఐసీసీ.. గెలిస్తే అన్ని కోట్లా?

author img

By

Published : May 26, 2023, 5:06 PM IST

Updated : May 26, 2023, 5:55 PM IST

WTC Prize Money : వరల్డ్ ​టెస్ట్​ ఛాంపియన్​షిప్ 2021-23కు సంబంధించి ప్రైజ్​ మనీ వివరాలను ఐసీసీ శుక్రవారం ప్రకటించింది. మరి ఏ టీమ్​కు ఎంత దక్కనుందంటే..

WTC prize money
వరల్డ్​టెస్ట్​ ఛాంపియన్​షిప్ ప్రైజ్​ మనీ

WTC Prize Money : వరల్డ్​టెస్ట్​ ఛాంపియన్​షిప్ 2021-23 టోర్నీకి ప్రైజ్​ మనీ వివరాలను అంతర్జాతీయ క్రికెట్​ కౌన్సిల్ (ఐసీసీ) శుక్రవారం ప్రకటించింది. ఈ సీజన్​కు సంబంధించి విజేతతో సహా మిగిలిన ఎనిమిది జట్లకు కలిపి ప్రైజ్​ మనీని 3.8 మిలియన్ డాలర్లు (సుమారు రూ.31 కోట్లు)గా నిర్ణయించింది. ఇంతకుముందు జరిగిన 2019-21 టోర్నీలో కూడా 3.8 మిలియన్ డాలర్లను ప్రైజ్ మనీ అందించింది. వరల్డ్​ టెస్ట్​ ఛాంపియన్​షిప్ ఫైనల్ విజేత 1.6 మిలియన్ డాలర్లు (సుమారు రూ.13 కోట్లు), రన్నరప్​గా నిలిచిన జట్టుకు 8 లక్షల డాలర్లు (సుమారు రూ.6.4 కోట్లు) బహుమతిగా అందించనుంది.

డబ్ల్యూటీసీ విజేతతో పాటు టోర్నీలో పాల్గొన్న ఆయా జట్లకు వాటి స్థానాలను బట్టి అందనున్న ప్రైజ్​మనీ.

స్థానంజట్టుప్రైజ్ ​మనీ (రూ. సుమారు కోట్లు/లక్షల్లో)
విజేత భారత్​/ఆస్ట్రేలియా16 లక్షల డాలర్లు (రూ.13 కోట్లు)
రెండో స్థానంభారత్​/ఆస్ట్రేలియా8 లక్షల డాలర్లు (రూ.6.4 కోట్లు)
మూడో స్థానం దక్షిణాఫ్రికా4.5 లక్షల డాలర్లు (రూ.3.6 కోట్లు )
నాలుగో స్థానం ఇంగ్లాండ్ 3.5 లక్షల డాలర్లు (రూ.2.8 కోట్లు)
ఐదో స్థానం శ్రీలంక2 లక్షల డాలర్లు (రూ.1.6 కోట్లు)
ఆరో స్థానంన్యూజిలాండ్ లక్ష డాలర్లు (రూ.82 లక్షలు)
ఏడో స్థానంపాకిస్థాన్ లక్ష డాలర్లు (రూ.82 లక్షలు)
ఎనిమిదో స్థానం వెస్టిండీస్ లక్ష డాలర్లు (రూ.82 లక్షలు)
తొమ్మిదో స్థానం బంగ్లాదేశ్​ లక్ష డాలర్లు (రూ.82 లక్షలు)

జూన్ 7-11 తేదీల్లో భారత్ - ఆస్ట్రేలియా మధ్య ఓవల్ మైదానంలో డబ్ల్యూటీసీ ఫైనల్ జరగనుంది. ఐపీఎల్​ ముగించుకున్న టీమ్​ఇండియా ఆటగాళ్లు ఇప్పటికే ఇంగ్లాడ్ చేరుకుని.. ప్రాక్టీస్ మొదలు పెట్టేశారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ బీసీసీఐ తమ అధికారిక ట్విట్టర్​ ఖాతాలో ఓ వీడియోను పోస్ట్​ చేసింది. ఈ వీడియోలో టీమ్​ఇండియా ఆటగాళ్లు కొత్త కిట్​ స్పాన్సర్ 'అడిడాస్' స్పోర్ట్స్ వేర్​లో కనిపించారు.
కాగా మొదటి డబ్ల్యూటీసీ 2019-21 ఫైనల్​లో న్యూజిలాండ్ చేతిలో ఓడిన టీమ్ఇండియా ఈసారి ఎలాగైన టైటిల్ గెలవాలన్న కసితో బరిలో దిగనుంది. ఇక ఐపీఎల్ 2023 ఫైనల్ ముగిసిన అనంతరం పూర్తి టీమ్ఇండియా జట్టు ప్రాక్టీస్​కు అందుబాటులో ఉండనుంది.

WTC Prize Money : వరల్డ్​టెస్ట్​ ఛాంపియన్​షిప్ 2021-23 టోర్నీకి ప్రైజ్​ మనీ వివరాలను అంతర్జాతీయ క్రికెట్​ కౌన్సిల్ (ఐసీసీ) శుక్రవారం ప్రకటించింది. ఈ సీజన్​కు సంబంధించి విజేతతో సహా మిగిలిన ఎనిమిది జట్లకు కలిపి ప్రైజ్​ మనీని 3.8 మిలియన్ డాలర్లు (సుమారు రూ.31 కోట్లు)గా నిర్ణయించింది. ఇంతకుముందు జరిగిన 2019-21 టోర్నీలో కూడా 3.8 మిలియన్ డాలర్లను ప్రైజ్ మనీ అందించింది. వరల్డ్​ టెస్ట్​ ఛాంపియన్​షిప్ ఫైనల్ విజేత 1.6 మిలియన్ డాలర్లు (సుమారు రూ.13 కోట్లు), రన్నరప్​గా నిలిచిన జట్టుకు 8 లక్షల డాలర్లు (సుమారు రూ.6.4 కోట్లు) బహుమతిగా అందించనుంది.

డబ్ల్యూటీసీ విజేతతో పాటు టోర్నీలో పాల్గొన్న ఆయా జట్లకు వాటి స్థానాలను బట్టి అందనున్న ప్రైజ్​మనీ.

స్థానంజట్టుప్రైజ్ ​మనీ (రూ. సుమారు కోట్లు/లక్షల్లో)
విజేత భారత్​/ఆస్ట్రేలియా16 లక్షల డాలర్లు (రూ.13 కోట్లు)
రెండో స్థానంభారత్​/ఆస్ట్రేలియా8 లక్షల డాలర్లు (రూ.6.4 కోట్లు)
మూడో స్థానం దక్షిణాఫ్రికా4.5 లక్షల డాలర్లు (రూ.3.6 కోట్లు )
నాలుగో స్థానం ఇంగ్లాండ్ 3.5 లక్షల డాలర్లు (రూ.2.8 కోట్లు)
ఐదో స్థానం శ్రీలంక2 లక్షల డాలర్లు (రూ.1.6 కోట్లు)
ఆరో స్థానంన్యూజిలాండ్ లక్ష డాలర్లు (రూ.82 లక్షలు)
ఏడో స్థానంపాకిస్థాన్ లక్ష డాలర్లు (రూ.82 లక్షలు)
ఎనిమిదో స్థానం వెస్టిండీస్ లక్ష డాలర్లు (రూ.82 లక్షలు)
తొమ్మిదో స్థానం బంగ్లాదేశ్​ లక్ష డాలర్లు (రూ.82 లక్షలు)

జూన్ 7-11 తేదీల్లో భారత్ - ఆస్ట్రేలియా మధ్య ఓవల్ మైదానంలో డబ్ల్యూటీసీ ఫైనల్ జరగనుంది. ఐపీఎల్​ ముగించుకున్న టీమ్​ఇండియా ఆటగాళ్లు ఇప్పటికే ఇంగ్లాడ్ చేరుకుని.. ప్రాక్టీస్ మొదలు పెట్టేశారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ బీసీసీఐ తమ అధికారిక ట్విట్టర్​ ఖాతాలో ఓ వీడియోను పోస్ట్​ చేసింది. ఈ వీడియోలో టీమ్​ఇండియా ఆటగాళ్లు కొత్త కిట్​ స్పాన్సర్ 'అడిడాస్' స్పోర్ట్స్ వేర్​లో కనిపించారు.
కాగా మొదటి డబ్ల్యూటీసీ 2019-21 ఫైనల్​లో న్యూజిలాండ్ చేతిలో ఓడిన టీమ్ఇండియా ఈసారి ఎలాగైన టైటిల్ గెలవాలన్న కసితో బరిలో దిగనుంది. ఇక ఐపీఎల్ 2023 ఫైనల్ ముగిసిన అనంతరం పూర్తి టీమ్ఇండియా జట్టు ప్రాక్టీస్​కు అందుబాటులో ఉండనుంది.

Last Updated : May 26, 2023, 5:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.