ETV Bharat / sports

WTC Final: ఇక రిజర్వ్​ డే పైనే.. టీమ్ఇండియా@64/2

author img

By

Published : Jun 22, 2021, 11:40 PM IST

ఇంగ్లాండ్ వేదికగా భారత్​-కివీస్​ మధ్య జరుగుతోన్న డబ్ల్యూటీసీ ఫైనల్​లో ఐదో రోజు ఆట ముగిసే సమయానికి టీమ్ఇండియా రెండు వికెట్ల నష్టానికి 64 పరుగులు చేసింది. ఓపెనర్​ శుభ్​మన్​ గిల్​ త్వరగానే ఔట్​ అయ్యాడు. క్రీజులో ​పుజారా(12*), కోహ్లీ (8*) ఉన్నారు. న్యూజిలాండ్ బౌలర్లలో సౌథీ రెండు వికెట్లు తీసుకున్నాడు.

wtc final, india vs new zealand
డబ్ల్యూటీసీ ఫైనల్, ఇండియా vs న్యూజిలాండ్

సౌథాంప్టన్​ వేదికగా కివీస్​తో జరుగుతోన్న మ్యాచ్​లో ఐదో రోజు ఆట ముగిసే సమయానికి టీమ్ఇండియా రెండో ఇన్నింగ్స్​లో రెండు వికెట్ల నష్టానికి 64 పరుగులు చేసింది. క్రీజులో విరాట్​ కోహ్లీ (12 బంతుల్లో 8 పరుగులు), పుజారా (55 బంతుల్లో 12 పరుగులు) ఉన్నారు. న్యూజిలాండ్ బౌలర్లలో టిమ్ సౌథీ రెండు వికెట్లు తీసుకున్నాడు.

​ఐదో రోజు మూడో సెషన్​లో టీమ్ఇండియా రెండో ఇన్నింగ్స్​ మొదలు పెట్టింది. తొలి వికెట్​కు ఓపెనర్ల జంట 24 పరుగులు జోడించింది. శుభ్​మన్​ గిల్​ (33 బంతుల్లో 8 పరుగులు)ను.. ఎల్బీగా పెవిలియన్​ పంపి కివీస్​కు తొలి వికెట్​ను అందించాడు సౌథీ. అనంతరం క్రీజులోకి వచ్చిన పుజారా ఆచితూచి ఆడుతున్నాడు. క్రీజులో కుదురుకున్నట్టే కనిపించిన రోహిత్​ను​ (81 బంతుల్లో 30 పరుగులు) సౌథీ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు.

సౌథాంప్టన్​ వేదికగా కివీస్​తో జరుగుతోన్న మ్యాచ్​లో ఐదో రోజు ఆట ముగిసే సమయానికి టీమ్ఇండియా రెండో ఇన్నింగ్స్​లో రెండు వికెట్ల నష్టానికి 64 పరుగులు చేసింది. క్రీజులో విరాట్​ కోహ్లీ (12 బంతుల్లో 8 పరుగులు), పుజారా (55 బంతుల్లో 12 పరుగులు) ఉన్నారు. న్యూజిలాండ్ బౌలర్లలో టిమ్ సౌథీ రెండు వికెట్లు తీసుకున్నాడు.

​ఐదో రోజు మూడో సెషన్​లో టీమ్ఇండియా రెండో ఇన్నింగ్స్​ మొదలు పెట్టింది. తొలి వికెట్​కు ఓపెనర్ల జంట 24 పరుగులు జోడించింది. శుభ్​మన్​ గిల్​ (33 బంతుల్లో 8 పరుగులు)ను.. ఎల్బీగా పెవిలియన్​ పంపి కివీస్​కు తొలి వికెట్​ను అందించాడు సౌథీ. అనంతరం క్రీజులోకి వచ్చిన పుజారా ఆచితూచి ఆడుతున్నాడు. క్రీజులో కుదురుకున్నట్టే కనిపించిన రోహిత్​ను​ (81 బంతుల్లో 30 పరుగులు) సౌథీ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు.

ఇదీ చదవండి : బుమ్రా బౌలింగ్​ సీక్రెట్​పై ఐసీసీ వీడియో

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.