ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్లో(World Test Championship) అత్యధిక వికెట్ల వీరుడిగా నిలిచేందుకు.. టీమ్ఇండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అడుగు దూరంలో ఉన్నాడు. న్యూజిలాండ్తో శుక్రవారం నుంచి ప్రారంభమయ్యే ఫైనల్లో నాలుగు వికెట్లు తీస్తే ఆ ఘనత సాధిస్తాడు.
ఈ టోర్నీలో అశ్విన్ ఇప్పటివరకు 13 మ్యాచ్ల్లో 67 వికెట్లు తీయగా, 14 మ్యాచ్లాడిన ఆసీస్ పేసర్ కమిన్స్ 70 వికెట్లతో టాప్లో కొనసాగుతున్నాడు.
అయితే టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్కు వేదికైన సౌథాంప్టన్ పిచ్, ప్రస్తుత వాతావరణం దృష్ట్యా పేసర్లకు అనుకూలించే అవకాశమే ఎక్కువగా కనిపిస్తోంది. కానీ తన స్పిన్ మాయాజాలంతో అశ్విన్ బ్యాట్స్మెన్ను ఇబ్బందిపెట్టగలడు.