పాకిస్థాన్ క్రికెట్ జట్టు తరఫున టీమ్ఇండియా సారథి కోహ్లీ(Kohli) ఆడుతున్నాడా? అంటే అవుననే అభిప్రాయపడుతున్నారు నెటిజన్లు!. విరాట్ పాక్ జట్టులో ఉండటమేంటి అనుకుంటున్నారా? అవును మీరు చదివేది నిజమే!. అసలేం జరిగిందంటే?
పాకిస్థాన్ ఇంగ్లాండ్తో సిరీస్ ఆడుతోంది. ఇందులో భాగంగా రెండో వన్డేలో పాక్ యువ బ్యాట్స్మన్ సౌద్ షకీల్ బరిలో దిగాడు. 77వ బంతుల్లో 56 పరుగులు చేసి ఔటయ్యాడు. అనంతరం క్రీజులో నుంచి బయటకు వచ్చే సమయంలో షకీల్ను కెమెరామన్ పలు సార్లు క్లోజ్ షాట్లో ఫొటోలు తీశాడు. ఇందులో ఓ లుక్ అచ్చం కోహ్లీని పోలి ఉండటం విశేషం. ఈ ఫొటోనే నెట్టంట్లో వైరల్గా మారింది.
'71వ సెంచరీ బాదేందుకు కోహ్లీ సాబ్ పాకిస్థాన్ తరఫున ఆడుతున్నాడు', 'ఆపదలో ఉన్న పాకిస్థాన్ జట్టును ఆదుకునేందుకు విరాట్ కోహ్లీ వచ్చాడు', 'సౌద్ షకీల్ కొత్త విరాట్ కోహ్లీ?', 'పాకిస్థాన్కు కొత్త కోహ్లీ దొరికేశాడు' అంటూ నెటిజన్లు విపరీతంగా కామెంట్లు చేశారు. అంతకుముందు పాక్ జట్టులో ఓపెనింగ్ బ్యాట్స్మన్ అహ్మద్ షెహజాద్.. విరాట్ పోలికలతో ఉన్నాడని పలు సందర్భాల్లో నెటిజన్లు అభిప్రాయపడ్డారు. సోషల్మీడియా వేదికగా ఆ ఫొటోలను షేర్ చేశారు.
ఇదీ చూడండి: 'మైదానంలో కోహ్లీ, కోహ్లీలా ఉండడు'