ETV Bharat / sports

కరోనా నుంచి కోలుకున్న ప్రసిధ్, మిశ్రా

author img

By

Published : May 19, 2021, 1:09 PM IST

ఐపీఎల్ సమయంలో కరోనా బారినపడిన పేసర్ ప్రసిధ్ కృష్ణ, వెటరన్ స్పిన్నర్ అమిత్ మిశ్రా కోలుకున్నారు. ఈ విషయాన్ని బీసీసీఐ ధ్రువీకరించింది.

Prasidh Krishna, Amit Mishra
ప్రసిధ్, మిశ్రా

ఐపీఎల్​ సమయంలో కరోనాబారిన పడిన కోల్​కతా నైట్​రైడర్స్ పేసర్ ప్రసిధ్ కృష్ణ, వెటరన్ స్పిన్నర్ అమిత్ మిశ్రా కోలుకున్నారు. మే 4న మిశ్రాకు పాజిటివ్​గా తేలగా, మే 8న ప్రసిధ్​కు పాజిటివ్ నిర్ధరణ అయింది. దీంతో వీరిద్దరూ ఇన్నిరోజులు ఐసోలేషన్​లో ఉన్నారు.

ప్రసిధ్ కృష్ణకు నెగిటివ్​ వచ్చినట్లుగా బీసీసీఐ అధికారి తెలపగా, తన ఆరోగ్యం గురించి సామాజిక మాధ్యమాల వేదికగా తెలియజేశాడు మిశ్రా. "ఫ్రంట్​లైన్ వర్కర్స్ నిజమైన హీరోలు. మీ అందరికీ మనస్ఫూర్థిగా ధన్యవాదాలు తెలుపుతున్నా. మీరు, మీ కుటుంబం చేస్తున్న త్యాగాలు చాలా గొప్పవి" అని మిశ్రా తెలిపాడు.

ఐపీఎల్​లో కోల్​కతా నైట్​రైడర్స్​కు ప్రాతినిధ్యం వహించాడు ప్రసిధ్ కృష్ణ. అలాగే ఈ సీజన్​లో కరోనా బారినపడిన నాలుగో కేకేఆర్ ఆటగాడు ఇతడు. ఇంతకుముందు ఈ జట్టుకు చెందిన వరుణ్ చక్రవర్తి, సందీప్ వారియర్, టిమ్ సీఫెర్ట్​లకు వైరస్ సోకింది.

ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్, ఇంగ్లాండ్​తో జరగబోయే టెస్టు సిరీస్​ కోసం ఎంపిక చేసిన జట్టులో చోటు దక్కించుకున్నాడు ప్రసిధ్. ఈ పర్యటనలో పాల్గొననున్న ఆటగాళ్లు ముందుగా ముంబయిలో క్వారంటైన్​లో ఉండాల్సి ఉంది. ప్రస్తుతం ప్రసిధ్​కు కరోనా నెగిటివ్​ రాగా అతడు కూడా క్వారంటైన్​లో పాల్గొనే అవకాశం ఉంది. దీంతో ఇతడి ఇంగ్లాండ్ పర్యటనకు మార్గం సుగమమైనట్లేనని తెలుస్తోంది.

ఐపీఎల్​ సమయంలో కరోనాబారిన పడిన కోల్​కతా నైట్​రైడర్స్ పేసర్ ప్రసిధ్ కృష్ణ, వెటరన్ స్పిన్నర్ అమిత్ మిశ్రా కోలుకున్నారు. మే 4న మిశ్రాకు పాజిటివ్​గా తేలగా, మే 8న ప్రసిధ్​కు పాజిటివ్ నిర్ధరణ అయింది. దీంతో వీరిద్దరూ ఇన్నిరోజులు ఐసోలేషన్​లో ఉన్నారు.

ప్రసిధ్ కృష్ణకు నెగిటివ్​ వచ్చినట్లుగా బీసీసీఐ అధికారి తెలపగా, తన ఆరోగ్యం గురించి సామాజిక మాధ్యమాల వేదికగా తెలియజేశాడు మిశ్రా. "ఫ్రంట్​లైన్ వర్కర్స్ నిజమైన హీరోలు. మీ అందరికీ మనస్ఫూర్థిగా ధన్యవాదాలు తెలుపుతున్నా. మీరు, మీ కుటుంబం చేస్తున్న త్యాగాలు చాలా గొప్పవి" అని మిశ్రా తెలిపాడు.

ఐపీఎల్​లో కోల్​కతా నైట్​రైడర్స్​కు ప్రాతినిధ్యం వహించాడు ప్రసిధ్ కృష్ణ. అలాగే ఈ సీజన్​లో కరోనా బారినపడిన నాలుగో కేకేఆర్ ఆటగాడు ఇతడు. ఇంతకుముందు ఈ జట్టుకు చెందిన వరుణ్ చక్రవర్తి, సందీప్ వారియర్, టిమ్ సీఫెర్ట్​లకు వైరస్ సోకింది.

ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్, ఇంగ్లాండ్​తో జరగబోయే టెస్టు సిరీస్​ కోసం ఎంపిక చేసిన జట్టులో చోటు దక్కించుకున్నాడు ప్రసిధ్. ఈ పర్యటనలో పాల్గొననున్న ఆటగాళ్లు ముందుగా ముంబయిలో క్వారంటైన్​లో ఉండాల్సి ఉంది. ప్రస్తుతం ప్రసిధ్​కు కరోనా నెగిటివ్​ రాగా అతడు కూడా క్వారంటైన్​లో పాల్గొనే అవకాశం ఉంది. దీంతో ఇతడి ఇంగ్లాండ్ పర్యటనకు మార్గం సుగమమైనట్లేనని తెలుస్తోంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.