ETV Bharat / sports

సిరాజ్ కిర్రాక్ బౌలింగ్.. మూడో వన్డేలో శ్రీలంక చిత్తు.. సిరీస్​ క్లీన్​స్వీప్​

author img

By

Published : Jan 15, 2023, 7:49 PM IST

Updated : Jan 15, 2023, 8:13 PM IST

భారత్​-శ్రీలంక మధ్య జరుగుతున్న మూడో వన్డేలో వార్ వన్​సైడ్​ అయింది. లంకను అష్టదిగ్బంధనం చేసి 317 పరుగులతో భారత్​ ఘన విజయం సాధించింది. ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్​ను టీమ్​ఇండియా క్లీన్​స్వీప్​ చేసింది.

team india india vs srilanka 3rd one day
team india india vs srilanka 3rd one day

టీ20 ఫార్మాట్​ను మరిపించేలా చెలరేగి పోయారు టీమ్ ​ఇండియా బ్యాటర్లు. ప్రతి బంతికి శ్రీలంక బౌలర్లకు చుక్కలు చూపించారు. బౌండరీల మీద బౌండరీలు పోతున్నా.. ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో శ్రీలంక బౌలర్లను పడేశారు భారత బ్యాటర్లు. ఇక బౌలింగ్​ విషయానికొస్తే.. భారత బౌలర్ల ధాటికి శ్రీలంక బ్యాటర్లు పెవిలియన్​కు క్యూ కట్టారు. అటు బ్యాటింగ్​తో.. ఇటు బౌలింగ్​తో లంక జట్టును అష్టదిగ్బంధనం చేశారు. ఊపిరి సలపని స్థితిలో శ్రీలంక టీమ్ చేతులెత్తేసింది. శ్రీలంక మొదటి నుంచి భారత బౌలర్ల ధాటికి చతికిలపడిపోయింది. 22 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 73 పరుగులు చేసింది. గాయం కారణంగా వాండర్సే బ్యాంటింగ్​కు దిగలేదు. భారత్​ నిర్దేశించిన 391 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించలేకపోయింది. ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్​ను టీమ్​ఇండియా క్లీన్​స్వీప్​ చేసింది. భారత బౌలర్లు మహ్మద్​ సిరాజ్​ (4), షమీ (2), కుల్దీప్​ యాదవ్ (2) వికెట్లు తీశారు.

మొదట టాస్​ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమ్​ఇండియా.. నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 390 పరుగులు చేసింది. లంక బౌలర్లకు చుక్కలు చూపించారు టీమ్​ఇండియా బ్యాటర్లు. విరాట్​ కోహ్లీ పంజా విసిరాడు. 110 బంతుల్లో చెలరేగి ఆడి 166 పరుగుల చేశాడు. యువ బ్యాటర్​ శుభ్​మన్​ గిల్​ 116 పరుగులతో అద్భుత ప్రదర్శన చేశాడు. కెప్టెన్​ రోహిత్​ శర్మ (49), శ్రేయస్​ అయ్యర్​(38) రాణించారు. కేఎల్​ రాహుల్​ (7) పరుగులకే పెవిలియన్​ చేరాడు. సూర్య కుమార్​(5), అక్షర్​ పటేల్​(2) పరుగులు చేశారు. శ్రీలంక బౌలర్లలో లహిరు కుమార (2) వికెట్లు తీయగా.. కసున్​ రజిత(2), చమిక కరుణరత్నే (1) వికెట్​ పడగొట్టారు.

టీ20 ఫార్మాట్​ను మరిపించేలా చెలరేగి పోయారు టీమ్ ​ఇండియా బ్యాటర్లు. ప్రతి బంతికి శ్రీలంక బౌలర్లకు చుక్కలు చూపించారు. బౌండరీల మీద బౌండరీలు పోతున్నా.. ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో శ్రీలంక బౌలర్లను పడేశారు భారత బ్యాటర్లు. ఇక బౌలింగ్​ విషయానికొస్తే.. భారత బౌలర్ల ధాటికి శ్రీలంక బ్యాటర్లు పెవిలియన్​కు క్యూ కట్టారు. అటు బ్యాటింగ్​తో.. ఇటు బౌలింగ్​తో లంక జట్టును అష్టదిగ్బంధనం చేశారు. ఊపిరి సలపని స్థితిలో శ్రీలంక టీమ్ చేతులెత్తేసింది. శ్రీలంక మొదటి నుంచి భారత బౌలర్ల ధాటికి చతికిలపడిపోయింది. 22 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 73 పరుగులు చేసింది. గాయం కారణంగా వాండర్సే బ్యాంటింగ్​కు దిగలేదు. భారత్​ నిర్దేశించిన 391 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించలేకపోయింది. ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్​ను టీమ్​ఇండియా క్లీన్​స్వీప్​ చేసింది. భారత బౌలర్లు మహ్మద్​ సిరాజ్​ (4), షమీ (2), కుల్దీప్​ యాదవ్ (2) వికెట్లు తీశారు.

మొదట టాస్​ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమ్​ఇండియా.. నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 390 పరుగులు చేసింది. లంక బౌలర్లకు చుక్కలు చూపించారు టీమ్​ఇండియా బ్యాటర్లు. విరాట్​ కోహ్లీ పంజా విసిరాడు. 110 బంతుల్లో చెలరేగి ఆడి 166 పరుగుల చేశాడు. యువ బ్యాటర్​ శుభ్​మన్​ గిల్​ 116 పరుగులతో అద్భుత ప్రదర్శన చేశాడు. కెప్టెన్​ రోహిత్​ శర్మ (49), శ్రేయస్​ అయ్యర్​(38) రాణించారు. కేఎల్​ రాహుల్​ (7) పరుగులకే పెవిలియన్​ చేరాడు. సూర్య కుమార్​(5), అక్షర్​ పటేల్​(2) పరుగులు చేశారు. శ్రీలంక బౌలర్లలో లహిరు కుమార (2) వికెట్లు తీయగా.. కసున్​ రజిత(2), చమిక కరుణరత్నే (1) వికెట్​ పడగొట్టారు.

Last Updated : Jan 15, 2023, 8:13 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.