టెస్టుల్లో టీమ్ఇండియా నంబర్ వన్ ర్యాంక్ కైవసం చేసుకోవడంపై కోచ్ రవిశాస్త్రి హర్షం వ్యక్తం చేశాడు. భారత కుర్రాళ్లపై ప్రశంసలు కురిపించాడు. వారి అసమాన పోరాటం వల్లే ఇది సాధ్యమైందని తెలిపాడు.
"టీమ్ఇండియా ధృడమైన సంకల్పం, స్థిరమైన ప్రదర్శన వల్లే సుదీర్ఘ ఫార్మాట్లో అగ్రస్థానాన్ని కైవసం చేసుకోగలిగాం. ర్యాంకింగ్స్కు సంబంధించి నిబంధనలను ఐసీసీ మధ్యలో మార్చింది. అయినప్పటికీ.. సవాళ్లను అధిగమిస్తూ తిరిగి నంబర్ వన్ ర్యాంకును పొందారు. కఠిన పరిస్థితుల్లో కఠిన క్రికెట్ ఆడారు. జట్టు విజయాల పట్ల గర్వంగా ఉంది."
-రవిశాస్త్రి, టీమ్ఇండియా ప్రధాన కోచ్.
గురువారం వార్షిక టెస్టు ర్యాంకింగ్లను ఐసీసీ ప్రకటించింది. 121 పాయింట్లతో టీమ్ఇండియా అగ్రస్థానంలో నిలిచింది. కేవలం ఒక్క పాయింట్ తేడాతో కివీస్ రెండో స్థానంలో ఉంది. ఆస్ట్రేలియాతో 2-1, ఇంగ్లాండ్తో 3-1 తేడాతో సాధించిన సిరీస్ విజయాలు ఇండియాకు కలిసొచ్చాయి.
ఇదీ చదవండి: ఈ క్రికెటర్ల భార్యలు ఏం చేస్తుంటారో తెలుసా?