ETV Bharat / sports

శుభమన్​ గిల్‌ ఖాతాలో అరుదైన రికార్డు.. వన్డేల్లో అత్యంత వేగంగా..

author img

By

Published : Oct 7, 2022, 12:05 PM IST

భారత క్రికెట్​ జట్టు యువ ఆటగాడు శుభమన్​ గిల్​.. అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. అంతర్జాతీయ వన్డే క్రికెట్​లో అత్యంత వేగంగా 500 పరుగులు చేసిన ఇండియన్​ ప్లేయర్​గా నిలిచాడు.

shubman gill record
shubman gill record

Shubman Gill Record: టీమ్​ఇండియా యువ ఆటగాడు శుభ్​మన్‌ గిల్‌ అంతర్జాతీయ వన్డేల్లో అరుదైన రికార్డు సాధించాడు. వన్డే క్రికెట్‌లో అత్యంత వేగంగా 500 పరుగులు సాధించిన భారత ఆటగాడిగా గిల్‌ నిలిచాడు. లఖ్​నవూ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో మూడు పరుగుల చేసిన గిల్‌.. ఈ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.

గిల్‌ మొత్తం 10 ఇన్నింగ్స్‌లో 500 పరుగుల మార్క్‌ను అందుకున్నాడు. కాగా ఇంతకుముందు ఈ రికార్డు టీమ్​ఇండియా మాజీ ఆటగాడు నవజ్యోత్ సింగ్ సిద్ధూ పేరిట ఉండేది. సిద్దూ 11 ఇన్నింగ్స్‌లలో ఈ ఘనతను సాధించాడు. తాజా మ్యాచ్‌తో సిద్దూ రికార్డును గిల్‌ బద్దలు కొట్టాడు.

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. తొలి వన్డేలో సౌతాఫ్రికా చేతిలో భారత్‌ 9 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. వర్షం కారణంగా గురువారం జరిగిన మ్యాచ్‌ను 40 ఓవర్లకు కుదించారు. తొలుత బ్యాటింగ్‌ చేసిన దక్షిణాఫ్రికా నిర్ణీత ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 249 పరుగులు చేసింది. ప్రోటీస్‌ బ్యాటర్లలో మిల్లర్‌(74 నాటౌట్‌), క్లాసెన్(74) అద్భుతమైన ఇన్నింగ్స్‌ ఆడారు. 250 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌ నిర్ణీత ఓవర్లలో 8వికెట్లు కోల్పోయి 240 పరుగులకు పరిమితమైంది. టీమ్​ఇండియా బ్యాటర్లలో సంజూ శాంసన్‌(86) పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు.

Shubman Gill Record: టీమ్​ఇండియా యువ ఆటగాడు శుభ్​మన్‌ గిల్‌ అంతర్జాతీయ వన్డేల్లో అరుదైన రికార్డు సాధించాడు. వన్డే క్రికెట్‌లో అత్యంత వేగంగా 500 పరుగులు సాధించిన భారత ఆటగాడిగా గిల్‌ నిలిచాడు. లఖ్​నవూ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో మూడు పరుగుల చేసిన గిల్‌.. ఈ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.

గిల్‌ మొత్తం 10 ఇన్నింగ్స్‌లో 500 పరుగుల మార్క్‌ను అందుకున్నాడు. కాగా ఇంతకుముందు ఈ రికార్డు టీమ్​ఇండియా మాజీ ఆటగాడు నవజ్యోత్ సింగ్ సిద్ధూ పేరిట ఉండేది. సిద్దూ 11 ఇన్నింగ్స్‌లలో ఈ ఘనతను సాధించాడు. తాజా మ్యాచ్‌తో సిద్దూ రికార్డును గిల్‌ బద్దలు కొట్టాడు.

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. తొలి వన్డేలో సౌతాఫ్రికా చేతిలో భారత్‌ 9 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. వర్షం కారణంగా గురువారం జరిగిన మ్యాచ్‌ను 40 ఓవర్లకు కుదించారు. తొలుత బ్యాటింగ్‌ చేసిన దక్షిణాఫ్రికా నిర్ణీత ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 249 పరుగులు చేసింది. ప్రోటీస్‌ బ్యాటర్లలో మిల్లర్‌(74 నాటౌట్‌), క్లాసెన్(74) అద్భుతమైన ఇన్నింగ్స్‌ ఆడారు. 250 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌ నిర్ణీత ఓవర్లలో 8వికెట్లు కోల్పోయి 240 పరుగులకు పరిమితమైంది. టీమ్​ఇండియా బ్యాటర్లలో సంజూ శాంసన్‌(86) పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు.

ఇవీ చదవండి: 'మేము అలా చేయలేకపోయాం.. అందుకే ఓడిపోయాం.. సంజూ ఈజ్​ గ్రేట్‌!'

'ఆ ఇద్దరికి వరల్డ్ కప్​ టీమ్​లో చోటు దక్కకపోవడమా?.. చాలా ఆశ్చర్యంగా ఉంది!'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.