పాకిస్థాన్ బోర్డు.. తమ దేశ పర్యటనకు రానున్న న్యూజిలాండ్ జట్టుకు సంబంధించిన షెడ్యూల్ వివరాలను ప్రకటించింది. ద్వైపాక్షిక సిరీస్లో తలపడేందుకు కివీస్ జట్టు.. రెండు సార్లు పాకిస్థాన్కు రానున్నట్లు తెలిపింది. తొలి దశ పర్యటనలో భాగంగా పాక్తో విలియమ్సన్ సేన రెండు టెస్టులు, మూడు వన్డేల సిరీస్లలో తలపడనుంది.
డిసెంబర్ 27న కరాచీ వేదికగా జరగనున్న తొలి టెస్టుతో న్యూజిలాండ్ పర్యటన ప్రారంభం కానుంది. రెండో టెస్టు ముల్తాన్ వేదికగా వచ్చే ఏడాది జనవరి 4 నుంచి జరగనుంది. ఆ తర్వాత అదే నెలలో 11,13,15 తేదీల్లో మూడు వన్డేల సిరీస్ జరగనుంది. అనంతరం వచ్చే ఏడాది ఏప్రిల్లో మరోసారి కీవిస్ జట్టు పాక్ టూర్కు రానుంది. రెండో దశ పర్యటనలో భాగంగా ఐదు టీ20లు(13,15,16,19,23), ఐదు వన్డేల సిరీస్ను(ఏప్రిల్ 26,28.. మే 1,4,7 తేదీల్లో) పాక్తో కివీస్ ఆడనుంది. కాగా గతేడాది 32ఏళ్ల తర్వాత పాకిస్థాన్ పర్యటనకు వచ్చిన న్యూజిలాండ్.. భద్రతా కారణాల దృష్ట్యా అఖరి నిమిషంలో వన్డే సిరీస్ను రద్దు చేసుకుంది. ఇకపోతే ప్రస్తుతం పాకిస్థాన్ జట్టు.. న్యూజిలాండ్ పర్యటనలో ఉంది. బంగ్లాదేశ్, న్యూజిలాండ్ జట్లతో ట్రై సిరీస్ ఆడుతోంది.
ఇదీ చూడండి: నేను 'గే'.. స్టార్ ఫుట్బాలర్ సంచలన ట్వీట్.. ఆ తర్వాత సూపర్ ట్విస్ట్!