Pakistan vs West Indies: మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ను వాయిదా వేస్తున్నట్లు పాకిస్థాన్, వెస్టిండీస్ క్రికెట్ బోర్డులు ప్రకటించాయి. ఆటగాళ్ల శిబిరంలో కరోనా కేసులు పెరుగుతుండటం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నాయి. గురువారం మూడు మ్యాచ్ల టీ20 సీరీస్ పూర్తయిన తర్వాత ఇరుదేశాల క్రికెట్ బోర్డులు ఈ మేరకు ప్రకటన చేశాయి. వచ్చే ఏడాది జూన్లో మళ్లీ రీషెడ్యూల్ చేయనున్నట్లు వెల్లడించాయి.
కరోనా నెగెటివ్ తేలిన వెస్టిండీస్ ఆటగాళ్లు గురువారం రాత్రే స్వదేశానికి బయలుదేరనున్నారు. పాజిటివ్గా తేలిన ఆటగాళ్లను ఐసోలేషన్లో ఉంచనున్నారు. క్వారెంటైన్ పూర్తికాగానే క్రిస్టమస్ నాటికి వారిని స్వదేశానికి పంపనున్నారు.
పాకిస్థాన్, వెస్టిండీస్ మధ్య వన్డే, టీ20 సిరీస్లు జరుగుతున్నాయి. కరాచీ వేదికగా గురువారం టీ20 సీరీస్ పూర్తయింది.
ఇదీ చదవండి: IND vs SA 2021: దక్షిణాఫ్రికాలో అడుగుపెట్టిన టీమ్ఇండియా