ETV Bharat / sports

ఐపీఎల్: చెన్నై సూపర్​కింగ్స్​లో ముగ్గురికి కరోనా!

author img

By

Published : May 3, 2021, 3:17 PM IST

చెన్నై సూపర్​కింగ్స్​ జట్టులో ముగ్గురికి కరోనా సోకింది. వీరికి సోమవారం మరోసారి పరీక్ష చేశారు. ఇందులో కూడా పాజిటివ్​ తేలితే వీరిని ఐసోలేషన్​లోకి పంపిస్తారు.

csk
సీఎస్కే

ఐపీఎల్​లో కరోనా కలకలం రేపుతోంది. ఈ కారణంగానే పలువురు ఆటగాళ్లు లీగ్​ నుంచి వీడుతున్నారు. ఇప్పుడు అగ్రశేణి జట్టు చెన్నై సూపర్​ కింగ్స్​లోనూ ముగ్గురికి వైరస్ సోకింది. ఫ్రాంచైజీ చీఫ్​ ఎగ్జిక్యూటివ్​ కాశీ విశ్వనాథన్​, బౌలింగ్​ కోచ్​ ఎల్​ బాలాజీ, ఓ బస్​ క్లీనర్​ కొవిడ్ బారిన పడినట్లు తెలిసింది. మిగతా వారికి మాత్రం నెగటివ్​గా తేలింది. ఆదివారం చేసిన పరీక్షల్లో ఈ ఫలితాలు వెల్లడయ్యాయి. అయితే వీరికి సోమవారం మరోసారి పరీక్షలు చేశారు. వీటికి సంబంధించిన ఫలితాలు రావాల్సి ఉంది. ఇందులో కూడా పాజిటివ్​గా తేలితే వీరిని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఐసోలేషన్​లోకి పంపిస్తారు.

సోమవారం జరగాల్సిన మ్యాచ్​కు ముందు చేసిన పరీక్షల్లోనూ కోల్​కతా నైట్​రైడర్స్​ ఆటగాళ్లు వరుణ్​ చక్రవర్తి, సందీప్​ వారియర్​కు కరోనా పాజిటివ్​గా తేలింది. దీంతో ఆ జట్టుకు, ఆర్సీబీతో ఆడాల్సిన మ్యాచ్​ వాయిదా పడింది.

ఐపీఎల్​లో కరోనా కలకలం రేపుతోంది. ఈ కారణంగానే పలువురు ఆటగాళ్లు లీగ్​ నుంచి వీడుతున్నారు. ఇప్పుడు అగ్రశేణి జట్టు చెన్నై సూపర్​ కింగ్స్​లోనూ ముగ్గురికి వైరస్ సోకింది. ఫ్రాంచైజీ చీఫ్​ ఎగ్జిక్యూటివ్​ కాశీ విశ్వనాథన్​, బౌలింగ్​ కోచ్​ ఎల్​ బాలాజీ, ఓ బస్​ క్లీనర్​ కొవిడ్ బారిన పడినట్లు తెలిసింది. మిగతా వారికి మాత్రం నెగటివ్​గా తేలింది. ఆదివారం చేసిన పరీక్షల్లో ఈ ఫలితాలు వెల్లడయ్యాయి. అయితే వీరికి సోమవారం మరోసారి పరీక్షలు చేశారు. వీటికి సంబంధించిన ఫలితాలు రావాల్సి ఉంది. ఇందులో కూడా పాజిటివ్​గా తేలితే వీరిని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఐసోలేషన్​లోకి పంపిస్తారు.

సోమవారం జరగాల్సిన మ్యాచ్​కు ముందు చేసిన పరీక్షల్లోనూ కోల్​కతా నైట్​రైడర్స్​ ఆటగాళ్లు వరుణ్​ చక్రవర్తి, సందీప్​ వారియర్​కు కరోనా పాజిటివ్​గా తేలింది. దీంతో ఆ జట్టుకు, ఆర్సీబీతో ఆడాల్సిన మ్యాచ్​ వాయిదా పడింది.

ఇదీ చూడండి: కోల్‌కతా ఆటగాళ్లకు కరోనా.. బెంగళూరుతో మ్యాచ్ వాయిదా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.