ETV Bharat / sports

ఐపీఎల్​: క్రికెటర్లు కావలెను.. ఆ ఫ్రాంఛైజీ ప్రకటన

author img

By

Published : Apr 27, 2021, 7:30 AM IST

ఐపీఎల్​లో నలుగురు విదేశీ ఆటగాళ్ల సేవలను కోల్పోయిన రాజస్థాన్​ రాయల్స్​ జట్టు.. క్రికెటర్లను అరువు తీసుకోవాలని నిర్ణయించుకుంది. వివిధ కారణాలతో వారు తప్పుకున్న నేపథ్యంలో వారి స్థానంలో మరోకరిని ఆడించేందుకు ఫ్రాంఛైజీ ముందుకొచ్చింది. ఈ క్రమంలో మిగిలిన ఫ్రాంఛైజీలకు లేఖలను రాసింది రాజస్థాన్​ యాజమాన్యం.

Rajasthan Royals approach other teams to loan players
ఐపీఎల్​ 2021

వివిధ కారణాలతో నలుగురు విదేశీ ఆటగాళ్ల సేవలను కోల్పోయిన రాజస్థాన్​ రాయల్స్​.. క్రికెటర్లను అరువు ఇవ్వమని మిగిలిన ఫ్రాంఛైజీలను కోరింది. గాయాల కారణంగా స్టోక్స్​, ఆర్చర్​ ఆ జట్టుకు దూరమవగా.. బబుల్​ ఆందోళనతో లివింగ్​స్టన్​, పెరుగుతోన్న పాజిటివ్​ కేసుల కారణంగా భారత్​లోనే చిక్కుకుపోతానేమోననే భయంతో ఆండ్రూ టై తమ దేశాలకు వెళ్లిపోయారు. దీంతో ఆ జట్టుపై గట్టి ప్రభావమే పడింది.

"ఆటగాళ్లను అరువు తెచ్చుకోవడం కోసం మిగతా ఫ్రాంఛైజీలకు రాజస్థాన్ లేఖలు రాసింది. కానీ ప్రస్తుతానికి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు" అని ఆ జట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి.

ఈ సీజన్​లో ఇతర ఫ్రాంఛైజీలకు చెందిన ఆటగాళ్లను జట్లు అరువు తెచ్చుకునే ప్రక్రియ సోమవారం మొదలైంది. లీగ్​ దశ ముగిసే వరకు ఇది కొనసాగుతోంది. ఈ సీజన్​లో రెండు కంటే తక్కువ మ్యాచ్​లాడిన ఆటగాడ్ని ఇతర జట్లు అరువుగా తీసుకోవచ్చు. ఆ ఆటగాడు తన సొంత జట్టుపై మ్యాచ్​లో ఆడకూడదు. ఇప్పటివరకూ లీగ్​లో అయిదు మ్యాచ్​లాడిన రాజస్థాన్​ రెండు విజయాలు మాత్రమే నమోదు చేసింది.

ఇదీ చూడండి.. కామన్వెల్త్​ గేమ్స్​లో మహిళల క్రికెట్​

వివిధ కారణాలతో నలుగురు విదేశీ ఆటగాళ్ల సేవలను కోల్పోయిన రాజస్థాన్​ రాయల్స్​.. క్రికెటర్లను అరువు ఇవ్వమని మిగిలిన ఫ్రాంఛైజీలను కోరింది. గాయాల కారణంగా స్టోక్స్​, ఆర్చర్​ ఆ జట్టుకు దూరమవగా.. బబుల్​ ఆందోళనతో లివింగ్​స్టన్​, పెరుగుతోన్న పాజిటివ్​ కేసుల కారణంగా భారత్​లోనే చిక్కుకుపోతానేమోననే భయంతో ఆండ్రూ టై తమ దేశాలకు వెళ్లిపోయారు. దీంతో ఆ జట్టుపై గట్టి ప్రభావమే పడింది.

"ఆటగాళ్లను అరువు తెచ్చుకోవడం కోసం మిగతా ఫ్రాంఛైజీలకు రాజస్థాన్ లేఖలు రాసింది. కానీ ప్రస్తుతానికి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు" అని ఆ జట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి.

ఈ సీజన్​లో ఇతర ఫ్రాంఛైజీలకు చెందిన ఆటగాళ్లను జట్లు అరువు తెచ్చుకునే ప్రక్రియ సోమవారం మొదలైంది. లీగ్​ దశ ముగిసే వరకు ఇది కొనసాగుతోంది. ఈ సీజన్​లో రెండు కంటే తక్కువ మ్యాచ్​లాడిన ఆటగాడ్ని ఇతర జట్లు అరువుగా తీసుకోవచ్చు. ఆ ఆటగాడు తన సొంత జట్టుపై మ్యాచ్​లో ఆడకూడదు. ఇప్పటివరకూ లీగ్​లో అయిదు మ్యాచ్​లాడిన రాజస్థాన్​ రెండు విజయాలు మాత్రమే నమోదు చేసింది.

ఇదీ చూడండి.. కామన్వెల్త్​ గేమ్స్​లో మహిళల క్రికెట్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.