ETV Bharat / sports

'ఈ విజయంలో మా బౌలర్లదే కీలకపాత్ర!'

author img

By

Published : Apr 27, 2021, 8:30 AM IST

ఐపీఎల్​లో కోల్​కతా నైట్​రైడర్స్​ రెండో విజయాన్ని నమోదు చేయడం పట్ల ఆనందాన్ని వ్యక్తం చేశాడు ఆ జట్టు కెప్టెన్​ ఇయాన్​ మోర్గాన్​. పంజాబ్​పై విజయంలో తమ బౌలర్లు కీలకపాత్ర పోషించారని వెల్లడించాడు.

Our bowlers kept the pressure throughout, says Morgan
ఇయాన్​ మోర్గాన్

ఐపీఎల్​లో తమ రెండో విజయాన్ని నమోదు చేసుకుంది కోల్​కతా నైట్​రైడర్స్​ టీమ్. అహ్మదాబాద్​ వేదికగా సోమవారం జరిగిన మ్యాచ్​లో పంజాబ్​ కింగ్స్​ జట్టును మోర్గాన్ సేన ఓడించింది. అయితే ఈ గెలుపులో తమ బౌలర్లదే కీలకపాత్ర అని అంటున్నాడు కోల్​కతా కెప్టెన్​ ఇయాన్​ మోర్గాన్​. పంజాబ్​ జట్టుపై ఇదే అత్యుత్తమ ప్రదర్శన అని మ్యాచ్​ అనంతరం వెల్లడించాడు.

"కోల్​కతా జట్టుకు నాయకత్వం వహించడం ఆనందంగా ఉంది. మేము చాలా కష్టపడ్డాం. టోర్నీ ప్రారంభంలో అనుకున్నంత ప్రదర్శన చేయకపోయినా.. పంజాబ్​ జట్టుపై మా ఆటతీరు సంతృప్తినిచ్చింది. ముఖ్యంగా మా బౌలర్లు ఈ విజయంలో కీలకంగా మారారు".

- ఇయాన్ మోర్గాన్​, కోల్​కతా నైట్​రైడర్స్​ కెప్టెన్​

"ప్రస్తుత సీజన్​లో శివమ్​ మావి రెండు మ్యాచ్​ల్లోనే ఆడాడు. అతడు గేల్​ వికెట్​ పడగొట్టడం వల్ల మ్యాచ్​ గమనమే మారిపోయింది. మావికే ఆ క్రెడిట్​ దక్కుతుంది. బౌలింగ్​ లైనప్​లో ఫాస్ట్ బౌలింగ్​తో పాటు స్పిన్​లోనూ అద్భుతమైన ప్రదర్శన చేశారు. టోర్నీలో టేబుల్​ టాప్​కు రావడానికి ఇంకా అవకాశం ఉంది" అని ఇయాన్​ మోర్గాన్ అన్నాడు.

ఈ మ్యాచ్​లో మొదట కోల్‌కతా బౌలర్ల ధాటికి పంజాబ్‌ 9 వికెట్లకు 123 పరుగులే చేయగలిగింది. మయాంక్‌ (31; 34 బంతుల్లో 1×4, 2×6) టాప్‌ స్కోరర్‌. చివర్లో జోర్డాన్‌ (30; 18 బంతుల్లో 1×4, 3×6) బ్యాట్‌ ఝుళిపించాడు. ప్రసిద్ధ్‌ కృష్ణ (3/30), నరైన్‌ (2/22), కమిన్స్‌ (2/31) ప్రత్యర్థిని దెబ్బతీశారు. ఛేదనలో కోల్‌కతా ఇబ్బంది పడ్డా.. మోర్గాన్‌ (47 నాటౌట్‌; 40 బంతుల్లో 4×4, 2×6) బాధ్యతాయుత ఇన్నింగ్స్‌తో 16.4 ఓవర్లలో లక్ష్యాన్ని అందుకుంది. రాహుల్‌ త్రిపాఠి (41; 32 బంతుల్లో 7×4) కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు.

ఐపీఎల్​లో గురువారం జరగనున్న మ్యాచ్​లో దిల్లీ క్యాపిటల్స్​ జట్టుతో కోల్​కతా నైట్​రైడర్స్​ తలపడనుంది.

ఇదీ చూడండి.. ఐపీఎల్​: క్రికెటర్లు కావలెను.. ఆ ఫ్రాంఛైజీ ప్రకటన

ఐపీఎల్​లో తమ రెండో విజయాన్ని నమోదు చేసుకుంది కోల్​కతా నైట్​రైడర్స్​ టీమ్. అహ్మదాబాద్​ వేదికగా సోమవారం జరిగిన మ్యాచ్​లో పంజాబ్​ కింగ్స్​ జట్టును మోర్గాన్ సేన ఓడించింది. అయితే ఈ గెలుపులో తమ బౌలర్లదే కీలకపాత్ర అని అంటున్నాడు కోల్​కతా కెప్టెన్​ ఇయాన్​ మోర్గాన్​. పంజాబ్​ జట్టుపై ఇదే అత్యుత్తమ ప్రదర్శన అని మ్యాచ్​ అనంతరం వెల్లడించాడు.

"కోల్​కతా జట్టుకు నాయకత్వం వహించడం ఆనందంగా ఉంది. మేము చాలా కష్టపడ్డాం. టోర్నీ ప్రారంభంలో అనుకున్నంత ప్రదర్శన చేయకపోయినా.. పంజాబ్​ జట్టుపై మా ఆటతీరు సంతృప్తినిచ్చింది. ముఖ్యంగా మా బౌలర్లు ఈ విజయంలో కీలకంగా మారారు".

- ఇయాన్ మోర్గాన్​, కోల్​కతా నైట్​రైడర్స్​ కెప్టెన్​

"ప్రస్తుత సీజన్​లో శివమ్​ మావి రెండు మ్యాచ్​ల్లోనే ఆడాడు. అతడు గేల్​ వికెట్​ పడగొట్టడం వల్ల మ్యాచ్​ గమనమే మారిపోయింది. మావికే ఆ క్రెడిట్​ దక్కుతుంది. బౌలింగ్​ లైనప్​లో ఫాస్ట్ బౌలింగ్​తో పాటు స్పిన్​లోనూ అద్భుతమైన ప్రదర్శన చేశారు. టోర్నీలో టేబుల్​ టాప్​కు రావడానికి ఇంకా అవకాశం ఉంది" అని ఇయాన్​ మోర్గాన్ అన్నాడు.

ఈ మ్యాచ్​లో మొదట కోల్‌కతా బౌలర్ల ధాటికి పంజాబ్‌ 9 వికెట్లకు 123 పరుగులే చేయగలిగింది. మయాంక్‌ (31; 34 బంతుల్లో 1×4, 2×6) టాప్‌ స్కోరర్‌. చివర్లో జోర్డాన్‌ (30; 18 బంతుల్లో 1×4, 3×6) బ్యాట్‌ ఝుళిపించాడు. ప్రసిద్ధ్‌ కృష్ణ (3/30), నరైన్‌ (2/22), కమిన్స్‌ (2/31) ప్రత్యర్థిని దెబ్బతీశారు. ఛేదనలో కోల్‌కతా ఇబ్బంది పడ్డా.. మోర్గాన్‌ (47 నాటౌట్‌; 40 బంతుల్లో 4×4, 2×6) బాధ్యతాయుత ఇన్నింగ్స్‌తో 16.4 ఓవర్లలో లక్ష్యాన్ని అందుకుంది. రాహుల్‌ త్రిపాఠి (41; 32 బంతుల్లో 7×4) కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు.

ఐపీఎల్​లో గురువారం జరగనున్న మ్యాచ్​లో దిల్లీ క్యాపిటల్స్​ జట్టుతో కోల్​కతా నైట్​రైడర్స్​ తలపడనుంది.

ఇదీ చూడండి.. ఐపీఎల్​: క్రికెటర్లు కావలెను.. ఆ ఫ్రాంఛైజీ ప్రకటన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.