ETV Bharat / sports

మయాంక్ సెంచరీ మిస్​.. దిల్లీ లక్ష్యం​ 167

author img

By

Published : May 2, 2021, 9:17 PM IST

దిల్లీ క్యాపిటల్స్​కు 167 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది పంజాబ్​ కింగ్స్​. మయాంక్​ అగర్వాల్​(99) కొద్దిలో శతకం మిస్సయ్యాడు. దిల్లీ బౌలర్లలో రబాడా 3 వికెట్లు తీశాడు.

mayank
మయాంక్​

అహ్మదాబాద్​ వేదికగా దిల్లీ క్యాపిటల్స్​తో జరిగిన ఐపీఎల్​ మ్యాచ్​లో పంజాబ్​ కింగ్స్​ బ్యాట్స్​మన్​ తడబడ్డారు. తాత్కాలిక సారథిగా వ్యవహరిస్తున్న మయాంక్​ అగర్వాల్​(99*) ఒక్క పరుగుతో సెంచరీ మిస్సయ్యాడు. మొత్తంగా నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లు నష్టానికి 166 పరుగులు చేసింది పంజాబ్​. దిల్లీ బౌలర్లలో రబాడా 3, అక్షర్​ పటేల్, అవేష్​ ఖాన్​​ తలో వికెట్​ తీశారు.

టాస్​ ఓడి బ్యాటింగ్​కు దిగిన పంజాబ్​కు శుభారంభం దక్కలేదు. ఓపెనర్​ ప్రభ్​సిమ్రాన్​(12) నాలుగో ఓవర్లో తొలి వికెట్​గా వెనుదిరిగాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన క్రిస్​ గేల్​(13), డేవిడ్​ మలన్​(26), దీపక్​ హోడా(1), షారుక్​ ఖాన్​(4), క్రిస్​ జోర్డాన్(2) వరుసగా​ విఫలమయ్యారు. మరో ఓపెనర్​ మయాంక్​(99) చివరి దాకా క్రీజులో నాటౌట్​గా నిలిచి స్కోరు బోర్డును ముందుకు నడిపించాడు.

అహ్మదాబాద్​ వేదికగా దిల్లీ క్యాపిటల్స్​తో జరిగిన ఐపీఎల్​ మ్యాచ్​లో పంజాబ్​ కింగ్స్​ బ్యాట్స్​మన్​ తడబడ్డారు. తాత్కాలిక సారథిగా వ్యవహరిస్తున్న మయాంక్​ అగర్వాల్​(99*) ఒక్క పరుగుతో సెంచరీ మిస్సయ్యాడు. మొత్తంగా నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లు నష్టానికి 166 పరుగులు చేసింది పంజాబ్​. దిల్లీ బౌలర్లలో రబాడా 3, అక్షర్​ పటేల్, అవేష్​ ఖాన్​​ తలో వికెట్​ తీశారు.

టాస్​ ఓడి బ్యాటింగ్​కు దిగిన పంజాబ్​కు శుభారంభం దక్కలేదు. ఓపెనర్​ ప్రభ్​సిమ్రాన్​(12) నాలుగో ఓవర్లో తొలి వికెట్​గా వెనుదిరిగాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన క్రిస్​ గేల్​(13), డేవిడ్​ మలన్​(26), దీపక్​ హోడా(1), షారుక్​ ఖాన్​(4), క్రిస్​ జోర్డాన్(2) వరుసగా​ విఫలమయ్యారు. మరో ఓపెనర్​ మయాంక్​(99) చివరి దాకా క్రీజులో నాటౌట్​గా నిలిచి స్కోరు బోర్డును ముందుకు నడిపించాడు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.