ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ వరుస బ్యాటింగ్ వైఫల్యాలపై స్పందించాడు భారత మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్. బ్యాటింగ్ ఆర్డర్లో ముందుగా రావాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డాడు.
ఇదీ చదవండి: స్వర్ణంతో మెరిసిన సరిత.. మరో ఇద్దరికి కాంస్యాలు
"ఎంఎస్ ధోనీ ఎక్కువ సేపు బ్యాటింగ్ చేయాల్సిన అవసరముంది. నాయకుడు అనే వాడు ముందుండి నడిపించాలి. లీడర్ ముందుండి నడిపించాలని ఏళ్లుగా చెబుతూనే ఉన్నాం. బ్యాటింగ్ ఆర్డర్లో ధోనీ 7వ స్థానంలో వచ్చి ఆధిపత్యం చెలాయించలేడు. అతడు నాలుగు లేదా ఐదో స్థానంలో క్రీజులోకి రావాలి. నాలుగైదేళ్ల క్రితం ధోనీలా ఇప్పుడు లేడు. సీఎస్కే బౌలింగ్లో సమస్యలు ఉన్నాయి." అని గౌతమ్ గంభీర్ పేర్కొన్నాడు.
దిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో ఏడో స్థానంలో బ్యాటింగ్కు వచ్చిన ధోనీ.. డకౌట్ అయ్యాడు. ఈ మ్యాచ్లో 188 పరుగులు చేసినప్పటికీ సీఎస్కే ఓడిపోయింది. ధోనీ సేన తన తదుపరి మ్యాచ్ వాంఖడే వేదికగా సోమవారం.. రాజస్థాన్ రాయల్స్తో ఆడనుంది.
ఇదీ చదవండి: 'ప్లాన్-బీ'తో ఒలింపిక్స్కు సాత్విక్-చిరాగ్ జోడీ