ETV Bharat / sports

కరోనా భయాలు- ఐపీఎల్​ను వీడుతున్న ఆసీస్​ క్రికెటర్లు!

author img

By

Published : Apr 26, 2021, 11:43 AM IST

Updated : Apr 26, 2021, 12:35 PM IST

ఐపీఎల్​ మధ్యలో నుంచి ఇప్పటికే రాజస్థాన్​ రాయల్స్​ బౌలర్​ ఆండ్రూ టై.. తన స్వస్థలం ఆస్ట్రేలియా వెళ్లడానికి సిద్ధమవ్వగా.. ఇప్పుడు ఆర్సీబీ ఆటగాళ్లు జంపా, రిచర్డ్​సన్​ కూడా సొంత గూటికి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. దేశంలో కరోనా వ్యాప్తి పెరగడమే ఇందుకు కారణమని తెలుస్తోంది.

Aussie cricketers
ఆసీసీ క్రికెటర్లు

దేశంలో కరోనా సెకండ్​ వేవ్ విజృంభణ సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ప్రతిఒక్కరినీ భయబ్రాంతులకు గురి చేస్తోంది. చాలా రకాల కార్యకలాపాలు తాత్కాలికంగా వాయిదా పడటం, నిలిచిపోవడం జరుగుతున్నా ఐపీఎల్​ మాత్రం బయోబబుల్​లో కొనసాగుతోంది.

సురక్షితమైన వాతావరణంలో ఈ మెగాలీగ్ కొనసాగుతున్నప్పటికీ క్రికెటర్లకు మాత్రం కరోనా భయం వెంటాడుతున్నట్లుంది. ఈ కారణంగానే ఆస్ట్రేలియా క్రికెటర్లు లీగ్​ను వీడి తమ స్వదేశానికి తిరిగి వెళ్లిపోవడానికి సిద్ధమవుతున్నారని ఓ క్రికెట్ ప్రతినిధి తెలిపారు. ఆటగాళ్లు మానసిక ఒత్తిడికి గురవుతున్నారని వెల్లడించారు. భారత్​ నుంచి వచ్చే ప్రయాణికుల సంఖ్యపై ఆస్ట్రేలియా ప్రభుత్వం ఆంక్షలు విధించడం కూడా వీరి భయాలకు కారణమని చెప్పారు.

జంపా, రిచర్డ్​సన్ కూడా

ఇప్పటికే రాజస్థాన్​ రాయల్స్​ బౌలర్​ ఆండ్రూ టై వ్యక్తిగత కారణాల వల్ల స్వదేశానికి వెళ్లిపోవడానికి సిద్ధమవ్వగా.. ఇప్పుడు రాయల్ ఛాలెంజర్స్​ బెంగళూరు ఆటగాళ్లు ఆడం జంపా, కేన్ రిచర్డ్​సన్​ తన సొంత గూటికి వెళ్లనున్నారు. వ్యక్తిగత కారణాల వల్ల వీరు స్వస్థలాలకు వెళ్తున్నారని ఫ్రాంచైజీ ప్రకటించింది.

మొత్తంగా ఐపీఎల్​లో 17మంది ఆసీస్​ ఆటగాళ్లు పాల్గొన్నారు. వీరిలో ఈ ముగ్గురు లీగ్​ నుంచి తప్పుకోగా మిగతా వాళ్లలోనూ కొందరు వెళ్లిపోయే యోచనలో ఉన్నట్లు సదరు ప్రతినిధి తెలిపారు. మరి కరోనా వల్ల ఇంకెంతమంది ఆటగాళ్లు ఐపీఎల్​ నుంచి వైదొలుగుతారో చూడాలి.

ఇదీ చూడండి సూపర్​ ఓవర్​పై ధావన్​ అలా.. కేన్​ ఇలా!

దేశంలో కరోనా సెకండ్​ వేవ్ విజృంభణ సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ప్రతిఒక్కరినీ భయబ్రాంతులకు గురి చేస్తోంది. చాలా రకాల కార్యకలాపాలు తాత్కాలికంగా వాయిదా పడటం, నిలిచిపోవడం జరుగుతున్నా ఐపీఎల్​ మాత్రం బయోబబుల్​లో కొనసాగుతోంది.

సురక్షితమైన వాతావరణంలో ఈ మెగాలీగ్ కొనసాగుతున్నప్పటికీ క్రికెటర్లకు మాత్రం కరోనా భయం వెంటాడుతున్నట్లుంది. ఈ కారణంగానే ఆస్ట్రేలియా క్రికెటర్లు లీగ్​ను వీడి తమ స్వదేశానికి తిరిగి వెళ్లిపోవడానికి సిద్ధమవుతున్నారని ఓ క్రికెట్ ప్రతినిధి తెలిపారు. ఆటగాళ్లు మానసిక ఒత్తిడికి గురవుతున్నారని వెల్లడించారు. భారత్​ నుంచి వచ్చే ప్రయాణికుల సంఖ్యపై ఆస్ట్రేలియా ప్రభుత్వం ఆంక్షలు విధించడం కూడా వీరి భయాలకు కారణమని చెప్పారు.

జంపా, రిచర్డ్​సన్ కూడా

ఇప్పటికే రాజస్థాన్​ రాయల్స్​ బౌలర్​ ఆండ్రూ టై వ్యక్తిగత కారణాల వల్ల స్వదేశానికి వెళ్లిపోవడానికి సిద్ధమవ్వగా.. ఇప్పుడు రాయల్ ఛాలెంజర్స్​ బెంగళూరు ఆటగాళ్లు ఆడం జంపా, కేన్ రిచర్డ్​సన్​ తన సొంత గూటికి వెళ్లనున్నారు. వ్యక్తిగత కారణాల వల్ల వీరు స్వస్థలాలకు వెళ్తున్నారని ఫ్రాంచైజీ ప్రకటించింది.

మొత్తంగా ఐపీఎల్​లో 17మంది ఆసీస్​ ఆటగాళ్లు పాల్గొన్నారు. వీరిలో ఈ ముగ్గురు లీగ్​ నుంచి తప్పుకోగా మిగతా వాళ్లలోనూ కొందరు వెళ్లిపోయే యోచనలో ఉన్నట్లు సదరు ప్రతినిధి తెలిపారు. మరి కరోనా వల్ల ఇంకెంతమంది ఆటగాళ్లు ఐపీఎల్​ నుంచి వైదొలుగుతారో చూడాలి.

ఇదీ చూడండి సూపర్​ ఓవర్​పై ధావన్​ అలా.. కేన్​ ఇలా!

Last Updated : Apr 26, 2021, 12:35 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.