ETV Bharat / sports

రోహిత్​ ఆర్సీబీ కెప్టెన్​ అయితే టైటిల్స్ గెలవగలడా?

author img

By

Published : Nov 14, 2020, 11:43 AM IST

Updated : Nov 14, 2020, 2:34 PM IST

రోహిత్ ఎంపికపై జరుగుతున్న వివాదంలో భాగంగా గంభీర్​ను ఆకాశ్ చోప్రా సూటిగా ప్రశ్నించాడు. హిట్​మ్యాన్​కు ఆర్సీబీ కెప్టెన్సీ అప్పగిస్తే టైటిల్స్ గెలవగలడా అని అడిగాడు. ఐపీఎల్ కప్పు గెలవనంత మాత్రాన కోహ్లీని టీమ్​ఇండియా సారథిగా తప్పించమనడం సరికాదని పేర్కొన్నాడు.

Would Rohit Sharma have won IPL titles with RCB team?
కోహ్లీ రోహిత్ శర్మ

స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మను ఆస్ట్రేలియా పర్యటనలో పరిమిత ఓవర్ల సిరీస్​కు ఎంపిక చేయకపోవడంపై ఇంకా చర్చ సాగుతూనే ఉంది. ఈ విషయమై మాజీ క్రికెటర్లు గౌతమ్ గంభీర్, ఆకాశ్ చోప్రా మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఇందులో గంభీర్.. రోహిత్​కు సపోర్ట్​ చేయగా, ఆకాశ్ చోప్రా కోహ్లీకి అండగా నిలిచాడు.

ఇటీవలే జరిగిన ఐపీఎల్​లో ముంబయి ఇండియన్స్ విజేతగా నిలిచింది. రోహిత్ సారథ్యంలో ఐదో టైటిల్​ను గెలుచుకుంది. సరిగ్గా ఇదే సమయంలో ఆస్ట్రేలియా పర్యటన కోసం ప్రకటించిన భారత జట్టులో హిట్​మ్యాన్​కు చోటు లభించలేదు. దీంతో రోహిత్​కు టీమ్​ఇండియా టీ20 జట్టు బాధ్యతలు అప్పగించాలని లేదంటే జట్టుకు చాలా పెద్ద నష్టమని అన్నాడు. కోహ్లీ ఇంతవరకు ఐపీఎల్​లో ఒక్క టైటిల్​ గెలవలేకపోయాడని గౌతీ విమర్శించాడు.

rcb kohli
ఆర్సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లీ

వీటిపై స్పందించిన మాజీ క్రికెటర్, కామెంటేటర్​​ ఆకాశ్ చోప్రా.. గంభీర్ వ్యాఖ్యల్ని ఖండించాడు. కోహ్లీని అన్ని ఫార్మాట్లలో కెప్టెన్​గా కొనసాగించాలని అన్నాడు. ఒకవేళ రోహిత్​కు ఆర్సీబీ పగ్గాలు అప్పగిస్తే, ఇన్ని టైటిళ్లు సాధించగలడా? అని గంభీర్​ను ప్రశ్నించాడు ఆకాశ్. ముంబయి జట్టును టీమ్​ఇండియాతో పోల్చడం సరికాదని చెప్పాడు.

ప్రస్తుతం సిడ్నీలో క్వారంటైన్​లో ఉన్న భారత క్రికెటర్లు.. నవంబరు 27న ఆస్ట్రేలియాతో తొలి వన్డే ఆడనున్నారు. పర్యటనలో భాగంగా మూడు వన్డేలు, మూడు టీ20లు, నాలుగు టెస్టులు జరగనున్నాయి. గాయమైన కారణంగా రోహిత్​ను చివరి మూడు టెస్టుల కోసం మాత్రమే ఎంపిక చేశారు.

rohit sharma
ముంబయి ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ

స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మను ఆస్ట్రేలియా పర్యటనలో పరిమిత ఓవర్ల సిరీస్​కు ఎంపిక చేయకపోవడంపై ఇంకా చర్చ సాగుతూనే ఉంది. ఈ విషయమై మాజీ క్రికెటర్లు గౌతమ్ గంభీర్, ఆకాశ్ చోప్రా మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఇందులో గంభీర్.. రోహిత్​కు సపోర్ట్​ చేయగా, ఆకాశ్ చోప్రా కోహ్లీకి అండగా నిలిచాడు.

ఇటీవలే జరిగిన ఐపీఎల్​లో ముంబయి ఇండియన్స్ విజేతగా నిలిచింది. రోహిత్ సారథ్యంలో ఐదో టైటిల్​ను గెలుచుకుంది. సరిగ్గా ఇదే సమయంలో ఆస్ట్రేలియా పర్యటన కోసం ప్రకటించిన భారత జట్టులో హిట్​మ్యాన్​కు చోటు లభించలేదు. దీంతో రోహిత్​కు టీమ్​ఇండియా టీ20 జట్టు బాధ్యతలు అప్పగించాలని లేదంటే జట్టుకు చాలా పెద్ద నష్టమని అన్నాడు. కోహ్లీ ఇంతవరకు ఐపీఎల్​లో ఒక్క టైటిల్​ గెలవలేకపోయాడని గౌతీ విమర్శించాడు.

rcb kohli
ఆర్సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లీ

వీటిపై స్పందించిన మాజీ క్రికెటర్, కామెంటేటర్​​ ఆకాశ్ చోప్రా.. గంభీర్ వ్యాఖ్యల్ని ఖండించాడు. కోహ్లీని అన్ని ఫార్మాట్లలో కెప్టెన్​గా కొనసాగించాలని అన్నాడు. ఒకవేళ రోహిత్​కు ఆర్సీబీ పగ్గాలు అప్పగిస్తే, ఇన్ని టైటిళ్లు సాధించగలడా? అని గంభీర్​ను ప్రశ్నించాడు ఆకాశ్. ముంబయి జట్టును టీమ్​ఇండియాతో పోల్చడం సరికాదని చెప్పాడు.

ప్రస్తుతం సిడ్నీలో క్వారంటైన్​లో ఉన్న భారత క్రికెటర్లు.. నవంబరు 27న ఆస్ట్రేలియాతో తొలి వన్డే ఆడనున్నారు. పర్యటనలో భాగంగా మూడు వన్డేలు, మూడు టీ20లు, నాలుగు టెస్టులు జరగనున్నాయి. గాయమైన కారణంగా రోహిత్​ను చివరి మూడు టెస్టుల కోసం మాత్రమే ఎంపిక చేశారు.

rohit sharma
ముంబయి ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ
Last Updated : Nov 14, 2020, 2:34 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.