ETV Bharat / sports

ముంబయిXదిల్లీ : ఐపీఎల్​ ట్రోఫీని ముద్దాడేదెవరు?

మంగళవారం(నవంబరు 10 ) జరిగే ఐపీఎల్​ ఫైనల్​​లో ముంబయి​- దిల్లీ జట్లు కప్పు కోసం హోరాహోరీగా తలపడనున్నాయి.​ భారత కాలమాన ప్రకారం రాత్రి 7.30గంటలకు ఈ పోరు ప్రారంభం కానుంది. ఈ తుదిపోరు​లో గెలిచి ట్రోఫీని అందుకునేదెవరో?

author img

By

Published : Nov 10, 2020, 5:31 AM IST

MI VS DC
ముంబయిXదిల్లీ

అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న ఐపీఎల్​ తుది​పోరుకు అంతా సిద్ధమైంది. అత్యధికంగా నాలుగు సార్లు ట్రోఫీని అందుకున్న ముంబయి ఇండియన్స్​.. తొలిసారి ఫైనల్స్​కు చేరిన దిల్లీ క్యాపిటల్స్​ అమీతుమీ తేల్చుకోనున్నాయి. కప్​ నీదా నాదా అంటూ సాగే ఈ సమరంలో గెలవాలని ఇరుజట్లు పట్టుదలతో బరిలో దిగనున్నాయి. మరి విజేతగా నిలిచేది ఎవరో?

ఐదోసారి ఎగరేసుకుపోయేందుకు

​ఇప్పటికే నాలుగుసార్లు విజేతగా నిలిచిన ముంబయి ఇండియన్స్​.. ఈ సీజన్​లో అదరగొట్టింది. ఆడిన 15 మ్యాచుల్లో 10 గెలిచింది. జట్టులోని ఆటగాళ్లంతా కలిసి 130 సిక్స్​లు బాదారు. డికాక్​, సూర్యకుమార్​ యాదవ్​, ఇషాన్​ కిషన్​, పొలార్డ్​లతో బ్యాటింగ్​ విభాగం బలంగా ఉంది. ఆల్​రౌండర్లు పాండ్య బ్రదర్స్​ జట్టుకు బాగానే సహకరిస్తున్నారు. బౌలర్లలో బుమ్రా, బౌల్ట్​, చాహర్​ అద్భుతంగా రాణిస్తున్నారు. మొత్తంగా జట్టు ఫుల్​ఫామ్​లో ఉంది. ఇదే ఊపు కొనసాగిస్తే ఐదోసారి కప్​ అందుకోవడం పెద్ద కష్టమేమి కాదు.

అద్భుతం చేస్తారా?

లీగ్​ చరిత్రలోనే తొలిసారి ఫైనల్​లో​ అడుగుపెట్టింది దిల్లీ క్యాపిటల్స్​. అలాగే ట్రోఫీని సొంతం చేసుకోవాలని భావిస్తోంది. క్వాలిఫయర్​-1లో ముంబయిపైనే ఓడినా సరే ఎలిమినేటర్​లో​ సన్​రైజర్స్​పై విజయం సాధించింది. ధావన్​, స్టోయినిస్​, హెట్​మెయిర్​ విజయంలో కీలకపాత్ర పోషించారు. సారథి శ్రేయస్​, పంత్​ తడబడ్డారు. వారిద్దరూ ప్రదర్శనను మెరుగుపరుచుకోవాలి. బౌలర్లలో రబాడ(4), స్టోయినిస్(3) బ్యాట్స్​మెన్​కు చుక్కలు చూపించారు. వీరికి అశ్విన్​, అన్రిచ్, అక్షర్ పటేల్ సహకారమందిస్తే తిరుగే ఉండదు. ఏదేమైనప్పటకీ జట్టు సమష్టిగా రాణిస్తేనే విజయాన్ని అందుకుంటుంది.

దిల్లీ: శిఖర్ ధావన్, రహానే, శ్రేయస్ అయ్యర్ (సారథి), పంత్, హెట్​మెయర్, స్టోయినిస్, అక్షర్ పటేల్, రవి అశ్విన్, ప్రవీణ్ దూబే, రబాడ, అన్రిచ్

ముంబయి: రోహిత్ శర్మ (సారథి​), డికాక్ , సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్య, పొలార్డ్, కృనాల్ పాండ్య, నాథన్ కౌల్టర్-నైల్, చాహర్, బౌల్ట్, బుమ్రా.

ఇదీ చూడండి : 'అసలైన ప్రయాణం ఇప్పుడే మొదలైంది.. కప్​ మాదే'

అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న ఐపీఎల్​ తుది​పోరుకు అంతా సిద్ధమైంది. అత్యధికంగా నాలుగు సార్లు ట్రోఫీని అందుకున్న ముంబయి ఇండియన్స్​.. తొలిసారి ఫైనల్స్​కు చేరిన దిల్లీ క్యాపిటల్స్​ అమీతుమీ తేల్చుకోనున్నాయి. కప్​ నీదా నాదా అంటూ సాగే ఈ సమరంలో గెలవాలని ఇరుజట్లు పట్టుదలతో బరిలో దిగనున్నాయి. మరి విజేతగా నిలిచేది ఎవరో?

ఐదోసారి ఎగరేసుకుపోయేందుకు

​ఇప్పటికే నాలుగుసార్లు విజేతగా నిలిచిన ముంబయి ఇండియన్స్​.. ఈ సీజన్​లో అదరగొట్టింది. ఆడిన 15 మ్యాచుల్లో 10 గెలిచింది. జట్టులోని ఆటగాళ్లంతా కలిసి 130 సిక్స్​లు బాదారు. డికాక్​, సూర్యకుమార్​ యాదవ్​, ఇషాన్​ కిషన్​, పొలార్డ్​లతో బ్యాటింగ్​ విభాగం బలంగా ఉంది. ఆల్​రౌండర్లు పాండ్య బ్రదర్స్​ జట్టుకు బాగానే సహకరిస్తున్నారు. బౌలర్లలో బుమ్రా, బౌల్ట్​, చాహర్​ అద్భుతంగా రాణిస్తున్నారు. మొత్తంగా జట్టు ఫుల్​ఫామ్​లో ఉంది. ఇదే ఊపు కొనసాగిస్తే ఐదోసారి కప్​ అందుకోవడం పెద్ద కష్టమేమి కాదు.

అద్భుతం చేస్తారా?

లీగ్​ చరిత్రలోనే తొలిసారి ఫైనల్​లో​ అడుగుపెట్టింది దిల్లీ క్యాపిటల్స్​. అలాగే ట్రోఫీని సొంతం చేసుకోవాలని భావిస్తోంది. క్వాలిఫయర్​-1లో ముంబయిపైనే ఓడినా సరే ఎలిమినేటర్​లో​ సన్​రైజర్స్​పై విజయం సాధించింది. ధావన్​, స్టోయినిస్​, హెట్​మెయిర్​ విజయంలో కీలకపాత్ర పోషించారు. సారథి శ్రేయస్​, పంత్​ తడబడ్డారు. వారిద్దరూ ప్రదర్శనను మెరుగుపరుచుకోవాలి. బౌలర్లలో రబాడ(4), స్టోయినిస్(3) బ్యాట్స్​మెన్​కు చుక్కలు చూపించారు. వీరికి అశ్విన్​, అన్రిచ్, అక్షర్ పటేల్ సహకారమందిస్తే తిరుగే ఉండదు. ఏదేమైనప్పటకీ జట్టు సమష్టిగా రాణిస్తేనే విజయాన్ని అందుకుంటుంది.

దిల్లీ: శిఖర్ ధావన్, రహానే, శ్రేయస్ అయ్యర్ (సారథి), పంత్, హెట్​మెయర్, స్టోయినిస్, అక్షర్ పటేల్, రవి అశ్విన్, ప్రవీణ్ దూబే, రబాడ, అన్రిచ్

ముంబయి: రోహిత్ శర్మ (సారథి​), డికాక్ , సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్య, పొలార్డ్, కృనాల్ పాండ్య, నాథన్ కౌల్టర్-నైల్, చాహర్, బౌల్ట్, బుమ్రా.

ఇదీ చూడండి : 'అసలైన ప్రయాణం ఇప్పుడే మొదలైంది.. కప్​ మాదే'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.