పిచ్ను సరిగా అర్థం చేసుకోకపోవడం వల్లే ముంబయితో శనివారం జరిగిన మ్యాచ్లో ఓడిపోయామని దిల్లీ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ చెప్పాడు. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్కు దిగిన దిల్లీ నిర్ణీత ఓవర్లలో 110 పరుగులే చేయగలిగింది. దానిని ముంబయి 14.2 ఓవర్లలో వికెట్ కోల్పోయి ఛేదించింది.
"పిచ్ను అంచనా వేయటంలో విఫలమయ్యాం. మెరుగైన భాగస్వామ్యాన్ని నెలకొల్పాలనుకున్నాం, కానీ అది జరగలేదు. ఈ మ్యాచ్ ఓడిపోవటానికి మేం చేసిన పొరపాట్లే కారణం. ఓపెనర్లు బాగా ఆడాల్సింది. ఈ పిచ్పై 150-160 పరుగులు చేస్తామనుకున్నాం కానీ సాధ్యపడలేదు. మామీద మాకు నమ్మకం ఉంది. బెంగళూరుతో జరగబోయే తర్వాత మ్యాచ్ ఇరుజట్లకూ ఎంతో కీలకం"
--శ్రేయస్ అయ్యర్, దిల్లీ కెప్టెన్
దిల్లీపై గెలిచిన తర్వాత ముంబయి.. తన అగ్రస్థానాన్ని మరింత పదిలం చేసుకుంది. దిల్లీ - బెంగళూరు మ్యాచ్ నవంబరు 2న జరగనుంది.