ETV Bharat / sports

చెన్నైXపంజాబ్​ మ్యాచ్​తో బద్దలైన రికార్డులివే

author img

By

Published : Oct 5, 2020, 8:00 AM IST

Updated : Oct 5, 2020, 9:25 AM IST

దుబాయ్​ వేదికగా ఆదివారం జరిగిన చెన్నై-పంజాబ్​ మ్యాచ్​లో పలు సరికొత్త రికార్డులు నమోదయ్యాయి. ఇంతకీ అవేంటి? ఎవరు నమోదు చేశారు?

CSK beat KXIP
చెన్నైXపంజాబ్

కింగ్స్ ఎలెవెన్​ పంజాబ్​తో ఆదివారం జరిగిన మ్యాచ్​లో చెన్నై సూపర్​ కింగ్స్​ గెలిచింది. ఒక్క వికెట్​ కూడా పడకుండా.. రెండు ఓవర్లు మిగిలుండగానే విజయఢంకా మోగించింది. తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్.. నిర్ణీత 20 ఓవర్లలో 178 పరుగులు చేసింది​. కెప్టెన్​ కేఎల్​ రాహుల్​(63), పూరన్​(33) రాణించారు. ఛేదనలో చెన్నై దూకుడుగా ఆడింది. ఓపెనర్లు డుప్లెసిస్​(87*), వాట్సన్(83*) అదరగొట్టారు. దీంతో అలవోకగా విజయం సాధించింది. ఈ క్రమంలోనే లీగ్​లో పలు కొత్త రికార్డులు నమోదయ్యాయి.

రాహుల్​ ఘనతలు

పంజాబ్ కెప్టెన్​ కేఎల్​ రాహుల్​ ఈ మ్యాచ్​తో ఐపీఎల్​ కెరీర్​లో 18 అర్ధశతకాలు చేశాడు. 44.68 సగటుతో.. 2,279 పరుగులతో ఉన్నాడు. ఈ సీజన్​లో 300 పరుగుల మార్కును దాటేశాడు. సీఎస్కేపై ఇప్పటివరకు ఎనిమిది మ్యాచ్​ల్లో ఆడి, 263 పరుగులు చేశాడు. లీగ్​లో పంజాబ్​ తరఫున 1,500 పరుగుల మార్కును అందుకున్నాడు.

CSK beat KXIP
కేఎల్​ రాహుల్​

ఓపెనర్లుగా అద్భుతం

ఈ ఏడాది కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్ అద్భుత ఆరంభాలు ఇస్తున్నారు. చెన్నైతో మ్యాచ్​లో ఇద్దరూ నాలుగు ఓవర్లు బ్యాటింగ్ చేసి 30కి పైగా పరుగులు సాధించారు. ఐపీఎల్​లో టీమ్​ఇండియా క్రికెటర్ల ఓపెనింగ్​ ఉత్తమ ద్వయంలో వీరు ఏడో స్థానంలో ఉన్నారు.

వాట్సన్​, డుప్లెసిస్​ విజయాలు

వాట్సన్​, ఈ మ్యాచ్​తో ఐపీఎల్​లో 20వ అర్ధసెంచరీ నమోదు చేశాడు. సీఎస్కే తరఫున ఆరో అర్ధ శతకం. పంజాబ్​పై 400 పరుగుల మార్కును అందుకున్నాడు.

మరోవైపు డుప్లెసిస్​, లీగ్​లో 2,100 పరుగుల మార్కును దాటేశాడు. ఈ మ్యాచ్​తో 15వ అర్ధసెంచరీ సాధించాడు. సీఎస్కే తరఫున పదమూడోది.

CSK beat KXIP
వాట్సన్​, డుప్లెసిస్​

వాట్సన్​, డుప్లెసిస్​ ద్వయం రికార్డు

ఐపీఎల్​లో సీఎస్కే తరఫున అత్యధిక భాగస్వామ్యం నమోదు చేసిన ఆటగాళ్లు వాట్సన్​, డుప్లెసిస్​. ఈ మ్యాచ్​లో వీరిద్దరే స్కోరు మొత్తం కొట్టేశారు. దీంతో మరళీ విజయ్​, మైకేల్​ హస్సీల రికార్డును అధిగమించారు.

కింగ్స్ ఎలెవెన్​ పంజాబ్​తో ఆదివారం జరిగిన మ్యాచ్​లో చెన్నై సూపర్​ కింగ్స్​ గెలిచింది. ఒక్క వికెట్​ కూడా పడకుండా.. రెండు ఓవర్లు మిగిలుండగానే విజయఢంకా మోగించింది. తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్.. నిర్ణీత 20 ఓవర్లలో 178 పరుగులు చేసింది​. కెప్టెన్​ కేఎల్​ రాహుల్​(63), పూరన్​(33) రాణించారు. ఛేదనలో చెన్నై దూకుడుగా ఆడింది. ఓపెనర్లు డుప్లెసిస్​(87*), వాట్సన్(83*) అదరగొట్టారు. దీంతో అలవోకగా విజయం సాధించింది. ఈ క్రమంలోనే లీగ్​లో పలు కొత్త రికార్డులు నమోదయ్యాయి.

రాహుల్​ ఘనతలు

పంజాబ్ కెప్టెన్​ కేఎల్​ రాహుల్​ ఈ మ్యాచ్​తో ఐపీఎల్​ కెరీర్​లో 18 అర్ధశతకాలు చేశాడు. 44.68 సగటుతో.. 2,279 పరుగులతో ఉన్నాడు. ఈ సీజన్​లో 300 పరుగుల మార్కును దాటేశాడు. సీఎస్కేపై ఇప్పటివరకు ఎనిమిది మ్యాచ్​ల్లో ఆడి, 263 పరుగులు చేశాడు. లీగ్​లో పంజాబ్​ తరఫున 1,500 పరుగుల మార్కును అందుకున్నాడు.

CSK beat KXIP
కేఎల్​ రాహుల్​

ఓపెనర్లుగా అద్భుతం

ఈ ఏడాది కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్ అద్భుత ఆరంభాలు ఇస్తున్నారు. చెన్నైతో మ్యాచ్​లో ఇద్దరూ నాలుగు ఓవర్లు బ్యాటింగ్ చేసి 30కి పైగా పరుగులు సాధించారు. ఐపీఎల్​లో టీమ్​ఇండియా క్రికెటర్ల ఓపెనింగ్​ ఉత్తమ ద్వయంలో వీరు ఏడో స్థానంలో ఉన్నారు.

వాట్సన్​, డుప్లెసిస్​ విజయాలు

వాట్సన్​, ఈ మ్యాచ్​తో ఐపీఎల్​లో 20వ అర్ధసెంచరీ నమోదు చేశాడు. సీఎస్కే తరఫున ఆరో అర్ధ శతకం. పంజాబ్​పై 400 పరుగుల మార్కును అందుకున్నాడు.

మరోవైపు డుప్లెసిస్​, లీగ్​లో 2,100 పరుగుల మార్కును దాటేశాడు. ఈ మ్యాచ్​తో 15వ అర్ధసెంచరీ సాధించాడు. సీఎస్కే తరఫున పదమూడోది.

CSK beat KXIP
వాట్సన్​, డుప్లెసిస్​

వాట్సన్​, డుప్లెసిస్​ ద్వయం రికార్డు

ఐపీఎల్​లో సీఎస్కే తరఫున అత్యధిక భాగస్వామ్యం నమోదు చేసిన ఆటగాళ్లు వాట్సన్​, డుప్లెసిస్​. ఈ మ్యాచ్​లో వీరిద్దరే స్కోరు మొత్తం కొట్టేశారు. దీంతో మరళీ విజయ్​, మైకేల్​ హస్సీల రికార్డును అధిగమించారు.

Last Updated : Oct 5, 2020, 9:25 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.