ETV Bharat / sports

నేను ప‌ట్టింద‌ల్లా బంగార‌మే: ధావ‌న్ - ధావన్​ పట్టిందల్లా బంగారమే

తన ఆటతీరుపై ఇతరులు ఏమన్నా పట్టించుకోనని చెప్పిన దిల్లీ క్యాపిటల్స్​ ఆటగాడు శిఖర్​ ధావన్​.. తాను పట్టిందల్లా బంగారం అవుతుందని చెప్పాడు. ఈ విషయంపై తాను పూర్తి విశ్వాసంగా ఉన్నానన్నాడు.

Shikhar Dhawan
శిఖ‌ర్‌ధావ‌న్
author img

By

Published : Oct 23, 2020, 6:27 PM IST

Updated : Oct 23, 2020, 7:11 PM IST

దిల్లీ క్యాపిటల్స్​ డ్యాషింగ్ బ్యాట్స్‌మన్ శిఖ‌ర్‌ ధావ‌న్ ఈ ఐపీఎల్​లో తన ఆటను చాలా నెమ్మ‌దిగా మొద‌లుపెట్టాడు. కానీ మెల్ల‌మెల్ల‌గా జోరు పెంచి ప్రస్తుతం ప‌రుగుల వ‌ర‌ద పారిస్తున్నాడు. ఈ సీజ‌న్‌లో తొలి రెండు మ్యాచ్‌ల‌లో 20ల స్కోరుకే ఔట‌య్యాడు. కానీ గత రెండు మ్యాచుల్లో వ‌రుస సెంచ‌రీలు బాది 465 ప‌రుగుల‌తో ఈ సీజ‌న్‌లో అత్య‌ధిక ప‌రుగులు చేసిన రెండో బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. ఈ నేప‌థ్యంలో ధావ‌న్ మాట్లాడుతూ.. తన ఆట గురించి ఇత‌రులు ఏమ‌నుకుంటున్నార‌నే విష‌యాన్ని తాను అస్స‌లు ప‌ట్టించుకోన‌ని చెప్పాడు.

"నాకు ఎప్పుడూ సంతోషంగా ఉండ‌ట‌మే ఇష్టం. ఒత్త‌ిడిలో ఉండ‌టం న‌చ్చ‌దు. ముందుగా ఇత‌రులు నా గురించి ఏమ‌నుకుంటున్నారు అనే విష‌యాన్ని అస్సలు ప‌ట్టించుకోను. రెండోది నేను ఆట‌ను ఎక్కువ‌గా ప్రేమిస్తా. అది నాకు ఎంతో ఆనందాన్నిస్తుంది. ఆట కోసం ఎంత క‌ష్ట‌ప‌డతానో నాకు తెలుసు. అంతేకాదు, నేను ఏది ముట్టుకుంటే అది బంగారం అవుతుంది. ఈ విషయంపై పూర్తి నమ్మకం ఉంది."

-ధావ‌న్, దిల్లీ క్యాపిటల్స్​ ఆటగాడు.

అలాగే తమ జట్టు కోచ్​ రికీ పాంటింగ్​ తన బ్యాటింగ్​ తీరుని ప్రశంసించాడని తెలిపాడు ధావన్​. తొలి మ్యాచుల్లో తాను చేసింది తక్కువ పరుగులే అయినా అవి ఎంతో ప్రభావితం చేశాయని అన్నాడు.

ఇదీ చూడండి ఐపీఎల్​ తర్వాత బిగ్​బాష్​ లీగ్​​లో ధోనీ?

దిల్లీ క్యాపిటల్స్​ డ్యాషింగ్ బ్యాట్స్‌మన్ శిఖ‌ర్‌ ధావ‌న్ ఈ ఐపీఎల్​లో తన ఆటను చాలా నెమ్మ‌దిగా మొద‌లుపెట్టాడు. కానీ మెల్ల‌మెల్ల‌గా జోరు పెంచి ప్రస్తుతం ప‌రుగుల వ‌ర‌ద పారిస్తున్నాడు. ఈ సీజ‌న్‌లో తొలి రెండు మ్యాచ్‌ల‌లో 20ల స్కోరుకే ఔట‌య్యాడు. కానీ గత రెండు మ్యాచుల్లో వ‌రుస సెంచ‌రీలు బాది 465 ప‌రుగుల‌తో ఈ సీజ‌న్‌లో అత్య‌ధిక ప‌రుగులు చేసిన రెండో బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. ఈ నేప‌థ్యంలో ధావ‌న్ మాట్లాడుతూ.. తన ఆట గురించి ఇత‌రులు ఏమ‌నుకుంటున్నార‌నే విష‌యాన్ని తాను అస్స‌లు ప‌ట్టించుకోన‌ని చెప్పాడు.

"నాకు ఎప్పుడూ సంతోషంగా ఉండ‌ట‌మే ఇష్టం. ఒత్త‌ిడిలో ఉండ‌టం న‌చ్చ‌దు. ముందుగా ఇత‌రులు నా గురించి ఏమ‌నుకుంటున్నారు అనే విష‌యాన్ని అస్సలు ప‌ట్టించుకోను. రెండోది నేను ఆట‌ను ఎక్కువ‌గా ప్రేమిస్తా. అది నాకు ఎంతో ఆనందాన్నిస్తుంది. ఆట కోసం ఎంత క‌ష్ట‌ప‌డతానో నాకు తెలుసు. అంతేకాదు, నేను ఏది ముట్టుకుంటే అది బంగారం అవుతుంది. ఈ విషయంపై పూర్తి నమ్మకం ఉంది."

-ధావ‌న్, దిల్లీ క్యాపిటల్స్​ ఆటగాడు.

అలాగే తమ జట్టు కోచ్​ రికీ పాంటింగ్​ తన బ్యాటింగ్​ తీరుని ప్రశంసించాడని తెలిపాడు ధావన్​. తొలి మ్యాచుల్లో తాను చేసింది తక్కువ పరుగులే అయినా అవి ఎంతో ప్రభావితం చేశాయని అన్నాడు.

ఇదీ చూడండి ఐపీఎల్​ తర్వాత బిగ్​బాష్​ లీగ్​​లో ధోనీ?

Last Updated : Oct 23, 2020, 7:11 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.