ETV Bharat / sports

ధోని, జడ్డూకు ఫీవర్- అభిమానులకు ఫియర్!

భారత ఆటగాళ్లు ధోని, జడేజా అనారోగ్యంగా ఉన్నారని చెన్నై సూపర్ కింగ్స్ కోచ్​ ఫ్లెమింగ్ చెప్పాడు. ప్రపంచకప్​ దగ్గర పడుతున్న తరుణంలో ఇద్దరు ఆటగాళ్లకు ఇలా జరగడం అభిమానులను కలవరపెడుతోంది.

author img

By

Published : Apr 27, 2019, 1:21 PM IST

ధోనీ - జడేజా

ధోని, జడేజాకు ఆరోగ్యం బాగా లేదని చెన్నై సూపర్​ కింగ్స్​ కోచ్ స్టీఫెన్​ ఫ్లెమింగ్ చెప్పాడు. ఇద్దరూ వైరల్ జ్వరం బారిన పడ్డారని తెలిపాడు. ప్రపంచకప్​ దగ్గర పడుతున్న తరుణంలో భారత అభిమానులకు ఈ వార్త ఆందోళన కలిగిస్తోంది. శుక్రవారం ముంబయితో జరిగిన మ్యాచ్​కు మహీ దూరమైన విషయం తెలిసిందే. తర్వాత మ్యాచ్​లకు వీరు అందుబాటులో ఉంటారన్న విషయంపై స్పష్టత లేదు.

"ధోని, జడేజా వైరల్​ జ్వరంతో బాధపడుతున్నారు. మిగతా జట్లలోని ఆటగాళ్లూ అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నారు. ఐదు రోజుల విరామం తర్వాత బరిలోకి దిగిన ముంబయి చక్కటి ప్రదర్శన చేసింది. తర్వాత మ్యాచ్​కు మాకు నాలుగు రోజుల బ్రేక్​ ఉంది. ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటాం. మిడిల్ ​ఆర్డర్​లో ధోని స్థానాన్ని పూడ్చలేనప్పటికీ.. మంచి ప్రదర్శన చేయడానికి ప్రయత్నిస్తాం" - ఫ్లెమింగ్, చెన్నై కోచ్

ఈ సీజన్​లో ధోని లేకుండా ఆడిన రెండు మ్యాచ్​ల్లోనూ చెన్నై ఓటమి పాలైంది. ఇంతకు ముందు సన్​రైజర్స్​తో జరిగిన మ్యాచ్​తో పాటు తాజాగా ముంబయి చేతిలో ఓడిపోయింది. ఈ సీజన్​లో ఏడు ఇన్నింగ్స్​ ఆడిన ధోని 314 పరుగులు చేశాడు. 100కి పైగా సగటుతో కొనసాగుతున్నాడు.

ఇంగ్లండ్​ వేదికగా మే 30న ప్రపంచకప్​ ప్రారంభంకానుంది. ఈ సమయంలో వరల్డ్​కప్​ జట్టులో ఉన్న ఇద్దరు ఆటగాళ్లు అనారోగ్యం పాలవడం భారత అభిమానులను కలవరపెడుతోంది. ఇంతకుముందు బుమ్రాకు భుజం గాయమైంది. అయితే ఈ పేసర్ వెంటనే కోలుకుని మళ్లీ ఐపీఎల్​లో సత్తాచాటుతున్నాడు.

ధోని, జడేజాకు ఆరోగ్యం బాగా లేదని చెన్నై సూపర్​ కింగ్స్​ కోచ్ స్టీఫెన్​ ఫ్లెమింగ్ చెప్పాడు. ఇద్దరూ వైరల్ జ్వరం బారిన పడ్డారని తెలిపాడు. ప్రపంచకప్​ దగ్గర పడుతున్న తరుణంలో భారత అభిమానులకు ఈ వార్త ఆందోళన కలిగిస్తోంది. శుక్రవారం ముంబయితో జరిగిన మ్యాచ్​కు మహీ దూరమైన విషయం తెలిసిందే. తర్వాత మ్యాచ్​లకు వీరు అందుబాటులో ఉంటారన్న విషయంపై స్పష్టత లేదు.

"ధోని, జడేజా వైరల్​ జ్వరంతో బాధపడుతున్నారు. మిగతా జట్లలోని ఆటగాళ్లూ అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నారు. ఐదు రోజుల విరామం తర్వాత బరిలోకి దిగిన ముంబయి చక్కటి ప్రదర్శన చేసింది. తర్వాత మ్యాచ్​కు మాకు నాలుగు రోజుల బ్రేక్​ ఉంది. ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటాం. మిడిల్ ​ఆర్డర్​లో ధోని స్థానాన్ని పూడ్చలేనప్పటికీ.. మంచి ప్రదర్శన చేయడానికి ప్రయత్నిస్తాం" - ఫ్లెమింగ్, చెన్నై కోచ్

ఈ సీజన్​లో ధోని లేకుండా ఆడిన రెండు మ్యాచ్​ల్లోనూ చెన్నై ఓటమి పాలైంది. ఇంతకు ముందు సన్​రైజర్స్​తో జరిగిన మ్యాచ్​తో పాటు తాజాగా ముంబయి చేతిలో ఓడిపోయింది. ఈ సీజన్​లో ఏడు ఇన్నింగ్స్​ ఆడిన ధోని 314 పరుగులు చేశాడు. 100కి పైగా సగటుతో కొనసాగుతున్నాడు.

ఇంగ్లండ్​ వేదికగా మే 30న ప్రపంచకప్​ ప్రారంభంకానుంది. ఈ సమయంలో వరల్డ్​కప్​ జట్టులో ఉన్న ఇద్దరు ఆటగాళ్లు అనారోగ్యం పాలవడం భారత అభిమానులను కలవరపెడుతోంది. ఇంతకుముందు బుమ్రాకు భుజం గాయమైంది. అయితే ఈ పేసర్ వెంటనే కోలుకుని మళ్లీ ఐపీఎల్​లో సత్తాచాటుతున్నాడు.

AP Video Delivery Log - 0600 GMT News
Saturday, 27 April, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0429: China Forum AP Clients Only 4208055
Xi urges world leaders to join Belt and Road plan
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.