ETV Bharat / sports

అదరగొట్టిన అమ్మాయిలు.. అండర్19 టీ20 ప్రపంచ కప్ విజేతగా టీమ్ఇండియా

author img

By

Published : Jan 29, 2023, 7:38 PM IST

Updated : Jan 29, 2023, 7:59 PM IST

భారత అమ్మాయిల జట్టు అదరగొట్టింది. అండర్​-19 వరల్డ్​ కప్​ ఫైనల్​లో ఇంగ్లాండ్​ను చిత్తు చేసింది. ఏడు వికెట్ల తేడాతో గెలిచి.. తొలి వరల్డ్​ కప్​ను సొంతం చేసుకుంది. కాగా, గెలిచిన టీమ్​కు రూ. 5 కోట్ల ప్రైజ్​ మనీని బీసీసీఐ ప్రకటించింది.

india england u19 world cup final
india england u19 world cup final

అమ్మాయిలా.. ఆడ పులులా అన్నట్టు అడుగడుగునా ఇంగ్లాండ్​ ఆటగాళ్లకు చుక్కలు చూపించారు టీమ్​ఇండియా ప్లేయర్లు. అండర్​-19 వరల్డ్​ కప్​ ఫైనల్​ పోరులో ఇంగ్లాండ్​పై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి తొలి వరల్డ్​కప్​ను సొంతం చేసుకున్నారు. ఇంగ్లాండ్ నిర్దేశించిన 69 పరుగుల లక్ష్యాన్ని 14 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది టీమ్ఇండియా. షెఫాలీ వర్మ 15, శ్వేతా 5, సౌమ్య 24, గొంగడి త్రిష 24 పరుగులు చేశారు. ఇంగ్లాండ్​ బౌలర్లలో హన్నా బేకర్, సోఫియా, అలెక్సా ఒక్కో వికెట్​ పడగొట్టారు.

తొలుత బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లాండ్​.. 17.1 ఓవర్లలో 68 పరుగులు చేసి ఆలౌట్ అయింది. నియామ్​ 10, రియానా 19, అలెక్సా 11, సోఫియా 11 పరుగులు చేసి కాస్త ఫర్వాలేదనిపించారు. టిటాస్​ సధు, అర్చనా దేవి, పార్శవి తలో రెండు వికెట్లు తీశారు. మన్నత్​, శెఫాలీ, సోనం ఒక్కో వికెట్​ పడగొట్టారు. కాగా, గెలిచిన టీమ్​కు రూ. 5 కోట్ల ప్రైజ్​ మనీని బీసీసీఐ ప్రకటించింది. ఈ మేరకు బీసీసీఐ కార్యదర్శి జై షా ట్విట్టర్​ వేదికగా తెలిపారు.

అమ్మాయిలా.. ఆడ పులులా అన్నట్టు అడుగడుగునా ఇంగ్లాండ్​ ఆటగాళ్లకు చుక్కలు చూపించారు టీమ్​ఇండియా ప్లేయర్లు. అండర్​-19 వరల్డ్​ కప్​ ఫైనల్​ పోరులో ఇంగ్లాండ్​పై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి తొలి వరల్డ్​కప్​ను సొంతం చేసుకున్నారు. ఇంగ్లాండ్ నిర్దేశించిన 69 పరుగుల లక్ష్యాన్ని 14 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది టీమ్ఇండియా. షెఫాలీ వర్మ 15, శ్వేతా 5, సౌమ్య 24, గొంగడి త్రిష 24 పరుగులు చేశారు. ఇంగ్లాండ్​ బౌలర్లలో హన్నా బేకర్, సోఫియా, అలెక్సా ఒక్కో వికెట్​ పడగొట్టారు.

తొలుత బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లాండ్​.. 17.1 ఓవర్లలో 68 పరుగులు చేసి ఆలౌట్ అయింది. నియామ్​ 10, రియానా 19, అలెక్సా 11, సోఫియా 11 పరుగులు చేసి కాస్త ఫర్వాలేదనిపించారు. టిటాస్​ సధు, అర్చనా దేవి, పార్శవి తలో రెండు వికెట్లు తీశారు. మన్నత్​, శెఫాలీ, సోనం ఒక్కో వికెట్​ పడగొట్టారు. కాగా, గెలిచిన టీమ్​కు రూ. 5 కోట్ల ప్రైజ్​ మనీని బీసీసీఐ ప్రకటించింది. ఈ మేరకు బీసీసీఐ కార్యదర్శి జై షా ట్విట్టర్​ వేదికగా తెలిపారు.

Last Updated : Jan 29, 2023, 7:59 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.